ఈ-రిక్షా డ్రైవర్ కుమారుడి అద్భుత ప్రతిభ: ఐఐటీ జేఈఈలో 1040వ ర్యాంక్ సాధించిన ఇందర్‌జీత్

రాజస్థాన్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఈ-రిక్షా డ్రైవర్ కుమారుడు ఇందర్‌జీత్, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. కేవలం ఆన్‌లైన్ క్లాసులు, స్థానిక లైబ్రరీ సాయంతోనే అతను సాధించిన ఈ స్ఫూర్తిదాయక విజయ గాథను ఇక్కడ చూద్దాం.

Published on: Jun 04, 2026 2:22 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐటీల్లో (IIT) సీటు సాధించడం ఎంతోమంది విద్యార్థుల కల. కానీ, రాజస్థాన్‌లోని పఠాన్‌వాలా అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ఇందర్‌జీత్ ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయం ఎందరికో ఆదర్శం. తండ్రి ఈ-రిక్షా నడుపుతూ ఏడాదికి లక్ష రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నా, తల్లి గృహిణి అయినా, ఇందర్‌జీత్ తన లక్ష్యం వైపు అడుగులు వేసి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షలో OBC-NCL కేటగిరీలో 1040వ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో (CRL) 4861వ ర్యాంక్ సాధించాడు.

తల్లిదండ్రులతో ఇందర్‌జీత్
తల్లిదండ్రులతో ఇందర్‌జీత్

ఈ సందర్భంగా ఇందర్‌జీత్ తన విజయ ప్రస్థానం, పడిన కష్టాలు, చదువుకున్న విధానాన్ని పంచుకున్నాడు.

గూగుల్ సెర్చ్‌తో మొదలైన ఐఐటీ కల

ఇందర్‌జీత్ స్వగ్రామంలో కనీస నీటి వసతి, డ్రైనేజీ, వైద్య సదుపాయాలు కూడా సరిగ్గా లేవు. గ్రామంలో ఎవరికీ జేఈఈ, నీట్ గురించి తెలియదు. ఒకరోజు కొందరు సీనియర్లు మాట్లాడుకుంటుండగా విని, స్మార్ట్‌ఫోన్‌లో "జేఈఈ అంటే ఏమిటి?", "ఐఐటీ అంటే ఏమిటి?" అని వెతికాడు. కోటా లేదా సికార్ వంటి నగరాలకు వెళ్లి కోచింగ్ తీసుకోవడానికి లక్షల రూపాయల ఫీజులు అవుతాయని తెలిసి మొదట్లో నిరాశపడ్డాడు. కానీ, తక్కువ ఫీజుతో లభించే ఫిజిక్స్ వాలా (PhysicsWallah) ఆన్‌లైన్ కోర్సు ప్రకటన చూసి, తల్లిదండ్రులను ఒప్పించి జాయిన్ అయ్యాడు. 2025లో తొలి ప్రయత్నంలో 27,000 ర్యాంక్ వచ్చినా, సంతృప్తి చెందక ఒక ఏడాది డ్రాప్ తీసుకుని కష్టపడి ఈ ఘనత సాధించాడు.

లైబ్రరీ ఇంటర్నెట్టే కొండంత అండ

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆఫ్‌లైన్ కోచింగ్ చేరడం అసాధ్యమని ఇందర్‌జీత్‌కు తెలుసు. ఆన్‌లైన్ క్లాసులకు డేటా ప్లాన్ సరిపోకపోవడం, గ్రామంలో తరచూ పవర్ కట్స్ ఉండటంతో తండ్రి సలహా మేరకు పక్క గ్రామంలోని ప్రభుత్వ లైబ్రరీకి వెళ్లడం ప్రారంభించాడు.

రోజువారీ చదువుల ప్రణాళిక

కోచింగ్ సమయంలో ఇందర్‌జీత్ రోజువారీ దినచర్య చాలా క్రమశిక్షణతో సాగింది.

  • ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఒక గంట పాటు మ్యాథ్స్ సమస్యలను సాధించేవాడు.
  • ఉదయం 8 గంటలకల్లా లైబ్రరీకి చేరుకుని ముందు రోజు పాఠాలను రివైజ్ చేసేవాడు.
  • రోజూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ క్లాసులు వింటూ, నోట్స్ రాసుకునేవాడు.
  • మధ్యాహ్నం చిన్న నిద్ర (Nap) తీసి, సాయంత్రం 6:30 వరకు లైబ్రరీలోనే హోంవర్క్ పూర్తి చేసేవాడు.
  • రాత్రి 9 గంటలకల్లా నిద్రపోయేవాడు.

జేఈఈ అభ్యర్థులకు ఇందర్‌జీత్ ఇచ్చే 3 ముఖ్యమైన చిట్కాలు

లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకోలేని పేద విద్యార్థులకు ఇందర్‌జీత్ మూడు విషయాలు సూచిస్తున్నాడు.

స్థిరత్వం, అంకితభావం (Consistency & Dedication): కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అవి మీ చదువును దెబ్బతీయనివ్వకండి.

సోషల్ మీడియాకు దూరం: ఆన్‌లైన్‌లో చదివేటప్పుడు త్వరగా దృష్టి మళ్లే అవకాశం ఉంటుంది. రీల్స్, షార్ట్స్, సినిమాలకు దూరంగా ఉంటూ లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి.

రోజువారీ కఠోర శ్రమ: ప్రతిరోజూ చేసే హార్డ్ వర్క్ మాత్రమే మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది.

భవిష్యత్తు ఆశయాలు

ఐఐటీ రూర్కీ (IIT Roorkee) లో సీటు సాధించడమే తన కల అని ఇందర్‌జీత్ చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి ఉన్న డిమాండ్‌ను బట్టి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లేదా ఏఐ అండ్ డేటా సైన్స్ బ్రాంచ్ ఎంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More