దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజిల్లలో 20 శాతం ఇథనాల్ను కలిపే 'ఈ-20' (E20) ఇంధన విధానానికి తీవ్ర ప్రతిబంధకం ఏర్పడింది. డిజిల్లో ఇథనాల్ను కలిపే ప్రయోగాలు ప్రాథమిక సాంకేతిక పరీక్షల్లోనే విఫలమైనట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. సాంకేతిక లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దే వరకు దేశంలో ఇథనాల్ బ్లెండెడ్ డిజిల్ను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యపడదని స్పష్టమవుతోంది.
ఫ్లాష్-పాయింట్ పరీక్షలో విఫలం
ప్రభుత్వ రంగానికి చెందిన చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తమ పరిశోధనా కేంద్రాలలో (R&D Centres) ప్రముఖ వాహన తయారీదారులు, గుర్తింపు పొందిన ప్రయోగశాలలతో కలసి ఈ పరీక్షలను నిర్వహించాయి. డిజిల్లో ఇథనాల్ను కలిపినప్పుడు ఇంధన స్వచ్ఛత, దహన సామర్థ్యాన్ని నిర్ణయించే 'ఫ్లాష్-పాయింట్' (Flash-point) స్థాయి గణనీయంగా పడిపోయినట్లు ఈ నివేదికల్లో తేలింది. దీనివల్ల ఇంజిన్ భద్రత, పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వ్యవసాయం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం
మరోవైపు ఇథనాల్ బ్లెండింగ్ విధానం వల్ల దేశంలో భూ వినియోగ సరళి, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పర్యావరణ వేత్తలు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ సైన్స్ ఫోరమ్ నిపుణుడు డి. రఘునందన్, కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్, నీతి ఆయోగ్ మాజీ సభ్యుడు రమేష్ చంద్ వంటి ప్రముఖులు ఈ విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక్క మొక్కజొన్న పంటను ఉదాహరణగా తీసుకుంటే.. గతంలో భారత్ మొక్కజొన్నను విదేశాలకు ఎగుమతి చేసేది. అయితే ఇథనాల్ తయారీకి డిమాండ్ ఊహించని స్థాయిలో పెరగడంతో, ఇప్పుడు స్వదేశీ అవసరాల కోసమే విదేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిపుణులు ఎత్తిచూపారు. ఆహార భద్రత కంటే ఇంధన అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చేలా పంటల సరళి మారడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు.
బ్రెజిల్తో పోలిక తగదు
"ఇథనాల్ వాడకంలో బ్రెజిల్తో భారత్ను పోల్చడం సరికాదు. బ్రెజిల్ ఏడాదికి 4.5 కోట్ల టన్నుల చెరకును ఉత్పత్తి చేస్తూ, అందులో 3.6 కోట్ల టన్నులను ఎగుమతి చేస్తోంది. తక్కువ జనాభా, విస్తారమైన భూమి ఆ దేశానికి ఉన్నాయి. కానీ, రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల భారత్లో పంట దిగుబడి 25 శాతం తగ్గే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి" అని డి. రఘునందన్ స్పష్టం చేశారు.
'ఈ-10' విధానానికి తిరిగి వెళ్లడమే మేలు
{{/usCountry}}"ఇథనాల్ వాడకంలో బ్రెజిల్తో భారత్ను పోల్చడం సరికాదు. బ్రెజిల్ ఏడాదికి 4.5 కోట్ల టన్నుల చెరకును ఉత్పత్తి చేస్తూ, అందులో 3.6 కోట్ల టన్నులను ఎగుమతి చేస్తోంది. తక్కువ జనాభా, విస్తారమైన భూమి ఆ దేశానికి ఉన్నాయి. కానీ, రాబోయే రోజుల్లో వాతావరణ మార్పుల వల్ల భారత్లో పంట దిగుబడి 25 శాతం తగ్గే అవకాశముందని అధ్యయనాలు చెబుతున్నాయి" అని డి. రఘునందన్ స్పష్టం చేశారు.
'ఈ-10' విధానానికి తిరిగి వెళ్లడమే మేలు
{{/usCountry}}ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనం వల్ల వాహనాల మైలేజ్ తగ్గడమే కాకుండా, విడిభాగాల అరుగుదల పెరిగి వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని నిపుణులు తెలిపారు. దీనికి పరిహారంగా ఇంధన ధరలను తగ్గించాలని కోరారు. ప్రభుత్వం ఈ-20 స్థానంలో పాత 'ఈ-10' విధానానికే తిరిగి వెళ్లడం మంచిదని సలహా ఇచ్చారు. ఈ మార్పు వల్ల ఇథనాల్ తయారుచేసే దాదాపు 400 డిస్టిలరీలకు కొంత నష్టం వాటిల్లినా, వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించవచ్చని, పర్యావరణాన్ని, రైతులను, వినియోగదారులను కాపాడుకోవడమే అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.