వాహనదారుల్లో గందరగోళం సృష్టిస్తున్న E20 పెట్రోల్ (ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్) ఇన్సూరెన్స్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం గట్టి క్లారిటీ ఇచ్చింది. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహన ఇన్సూరెన్స్ క్లెయిమ్లు చెల్లకుండా పోతాయనే ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది.

"ఇథనాల్ బ్లెండింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విధానం. అమెరికా, బ్రెజిల్, జపాన్ వంటి పలు దేశాల్లో ఇది ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది" అని మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇది చెరకు రసం కాదు.. నాణ్యమైన ఇంధనం
సోషల్ మీడియాలో పెట్రోల్లో నేరుగా చెరకు రసాన్ని కలుపుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది. ఇథనాల్ను చెరకు రసం, మొలాసిస్, నూకలు (విరిగిన బియ్యం), మొక్కజొన్న వంటి రకరకాల ముడి పదార్థాల నుండి తయారు చేసినప్పటికీ.. అది పారిశ్రామిక ప్రక్రియల ద్వారా రూపాంతరం చెందుతుందని వివరించింది. కిణ్వ ప్రక్రియ (Fermentation) వంటి కఠినమైన దశల గుండా వెళ్ళిన తర్వాత తయారయ్యే ఇథనాల్ గుణాలు, దాని ముడి పదార్థాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటాయని స్పష్టం చేసింది.
చీమల పుకార్లకు శాస్త్రీయ ఆధారం లేదు
ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో వాహనం ఫ్యూయల్ ట్యాంక్ వద్ద చీమలు చేరడంపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వివరణ ఇచ్చింది. ఇథనాల్ తయారీలో డిస్టిలేషన్ ప్రక్రియను ఉపయోగించడం వల్ల తుది ఇంధనంలో చక్కెర అవశేషాలు ఏమాత్రం మిగలవని స్పష్టం చేసింది. పైగా, ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్లో కీటకాలను వికర్షించే (Repellent) రసాయనాలు ఉంటాయని తెలిపింది. E20 ఇంధనంలో చీమలను ఆకర్షించే గుణాలు ఏవీ లేవని, ఈ ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది.
ఇంజన్ ఫెయిల్యూర్ ఆరోపణలు అవాస్తవం
E20 పెట్రోల్ వల్ల వాహనాల పర్ఫార్మెన్స్ తగ్గిపోతోందని, ఇంజన్లు పాడవుతున్నాయనే ఆరోపణలనూ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, వాహన తయారీదారులు, ఫ్యూయల్ టెస్టింగ్ ఏజెన్సీలతో కలిసి తాము నిరంతరం దీనిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. E20 పెట్రోల్ ప్రవేశపెట్టినప్పటి నుండి ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా పెద్ద ఎత్తున ఇంజన్ ఫెయిల్యూర్లు లేదా వాహనాలు మొరాయించిన దాఖలాలు ఎక్కడా నమోదు కాలేదని తెలిపింది. సాధారణంగా ఏ ఇంధన ట్యాంక్లోనైనా నీరు చేరితే వాహనానికి నష్టం జరుగుతుందని, అయితే ఆధునిక వాహనాల్లో నీరు లోపలికి వెళ్లకుండా ప్రత్యేక రక్షణ ఫీచర్లు ఉంటాయని వివరించింది.
దేశానికి రూ.1.4 లక్షల కోట్ల ఆదా
{{/usCountry}}E20 పెట్రోల్ వల్ల వాహనాల పర్ఫార్మెన్స్ తగ్గిపోతోందని, ఇంజన్లు పాడవుతున్నాయనే ఆరోపణలనూ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, వాహన తయారీదారులు, ఫ్యూయల్ టెస్టింగ్ ఏజెన్సీలతో కలిసి తాము నిరంతరం దీనిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. E20 పెట్రోల్ ప్రవేశపెట్టినప్పటి నుండి ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా పెద్ద ఎత్తున ఇంజన్ ఫెయిల్యూర్లు లేదా వాహనాలు మొరాయించిన దాఖలాలు ఎక్కడా నమోదు కాలేదని తెలిపింది. సాధారణంగా ఏ ఇంధన ట్యాంక్లోనైనా నీరు చేరితే వాహనానికి నష్టం జరుగుతుందని, అయితే ఆధునిక వాహనాల్లో నీరు లోపలికి వెళ్లకుండా ప్రత్యేక రక్షణ ఫీచర్లు ఉంటాయని వివరించింది.
దేశానికి రూ.1.4 లక్షల కోట్ల ఆదా
{{/usCountry}}ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముడి చమురు దిగుమతులు తగ్గడం వల్ల ఇప్పటివరకు దేశానికి రూ.1.4 లక్షల కోట్లకు పైగా మిగిలాయని పేర్కొంది. ఇథనాల్ తయారీకి అవసరమైన వ్యవసాయ ముడిపదార్థాలకు డిమాండ్ పెరగడం వల్ల రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో తోడ్పడుతోంది. భారతదేశ ఇంధన భద్రతను పెంపొందించడంలో, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో, స్వచ్ఛమైన రవాణా వ్యవస్థ వైపు అడుగులు వేయడంలో ఇథనాల్ బ్లెండింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ ఆధారాలతోనే ఈ కార్యక్రమాన్ని మరింత పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.