పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం భారీ చర్య తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) సెక్షన్ 17(1A) కింద మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి చెందిన మూడు హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ ఖాతాల్లోని రూ. 440.42 కోట్ల నిధులను ఈడీ ఫ్రీజ్ చేసింది.
కోల్కతాలో ఈడీ సోదాలు

విమాన చార్టర్ సేవలు అందించే కేర్వెల్ గ్రూప్ (Carewell Group of companies) సంస్థలకు చెందిన కోల్కతా పరిసర ప్రాంతాల్లోని ఐదు ప్రాంగణాలలో ఈడీ కోల్కతా జోనల్ కార్యాలయం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల అనంతరం నిధులను ఫ్రీజ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
రూ.160 కోట్ల బదిలీపై దర్యాప్తు
ఈడీ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 2023, జూన్ 2026 మధ్య కాలంలో టీఎంసీ బ్యాంక్ ఖాతాల నుండి కేర్వెల్ ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Carewell Aviation India Pvt. Ltd.), దాని అనుబంధ సంస్థలకు సుమారు రూ. 160 కోట్లు బదిలీ అయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు వివాదం
కేర్వెల్ ఏవియేషన్ సంస్థ 2023-2026 మధ్య కాలంలో రూ. 82.96 కోట్లను కొత్తగా స్థాపించిన మరో అనుబంధ సంస్థకు మళ్లించింది. ఈ నిధులతో ఒక ఎంబ్రాయర్ లెగసీ 600 (Embraer Legacy 600) విమానం, అగస్టా 109 గ్రాండ్ న్యూ (Agusta 109 Grand New) హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. ఈ కొనుగోళ్లకు మొత్తం రూ.112 కోట్లు ఖర్చయ్యాయి. అంతేకాకుండా, సదరు హెలికాప్టర్ కొనుగోలు కోసం 2023లో కేమాన్ ఐలాండ్స్ (Cayman Islands)కు చెందిన ఒక సంస్థ నుండి 1.7 మిలియన్ యూఎస్ డాలర్లను అన్సెక్యూర్డ్ లోన్ (పూచీకత్తు లేని రుణం) రూపంలో సేకరించినట్లు ఈడీ పేర్కొంది.
విచిత్రమైన ఒప్పందం
టీఎంసీ నిధులతో కొనుగోలు చేసిన ఈ విమానం, హెలికాప్టర్ను తిరిగి టీఎంసీ పార్టీకే అద్దెకు ఇచ్చారు. విమాన వినియోగం పేరుతో మళ్లీ భారీ మొత్తంలో నిధులను సదరు సంస్థకు బదిలీ చేశారు. ఈ అనుమానాస్పద లావాదేవీల వెనుక ఉన్న అసలు లబ్ధిదారులు ఎవరు అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
రాజకీయ ప్రేరేపిత దాడి: టీఎంసీ మండిపాటు
{{/usCountry}}టీఎంసీ నిధులతో కొనుగోలు చేసిన ఈ విమానం, హెలికాప్టర్ను తిరిగి టీఎంసీ పార్టీకే అద్దెకు ఇచ్చారు. విమాన వినియోగం పేరుతో మళ్లీ భారీ మొత్తంలో నిధులను సదరు సంస్థకు బదిలీ చేశారు. ఈ అనుమానాస్పద లావాదేవీల వెనుక ఉన్న అసలు లబ్ధిదారులు ఎవరు అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
రాజకీయ ప్రేరేపిత దాడి: టీఎంసీ మండిపాటు
{{/usCountry}}ఈడీ చర్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్య అని మమతా బెనర్జీ శిబిరానికి చెందిన రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ (Derek O'Brien) విమర్శించారు.
"ఇది రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి. బీజేపీ బ్రాంచ్ ఆఫీసుల్లా ఈడీ, సీబీఐ, ఈసీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను బరితెగించి వాడుకుంటున్నారు" అని డెరెక్ ఓబ్రెయిన్ మండిపడ్డారు.