భారత ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఎన్నికలకోడ్ తక్షణమే అమలులోకి వస్తుందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

తమిళనాడులో234 అసెంబ్లీ స్థానాలు, పశ్చిమ బెంగాల్-294, కేరళ-140, అస్సాం-126, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి-30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ.
పోలింగ్ తేదీలు
- అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది.
- తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహిస్తారు.
- పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో పోలింగ్ ఉంటుంది. మెుదటి దశ ఏప్రిల్ 23, రెండో ఏప్రిల్ 29న పోలింగ్ నిర్వహిస్తారు
- మే 4న కౌంటింగ్ ఉంటుంది.
ఈ నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం కలిపి మొత్తం 174 మిలియన్ల (17.4 కోట్ల) ఓటర్లు ఉన్నారు. 824 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టుగా, 25 లక్షల ఎన్నికల అధికారులు పని చేస్తారని ఈసీ తెలిపింది.
గత 12 నెలల కాలంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించేందుకు ఎన్నికల సంఘం అనేక కొత్త కార్యక్రమాలను అమలు చేసిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. వీటిలో మొదటిది SIR అనే విధానం; ఓటర్ల జాబితాలో ఏ ఒక్క అనర్హుడు కూడా మిగిలి ఉండకుండా చూసే లక్ష్యంతో దీనిని రూపొందించారు. రెండో విధానం ప్రకారం, పోలింగ్ కేంద్రం వెలుపలే మొబైల్ ఫోన్లను అప్పగించాల్సి ఉంటుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత వాటిని తిరిగి తీసుకోవచ్చు.
ఎన్నికల షెడ్యూల్తో ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) తక్షణమే అమల్లోకి వచ్చింది. పుదుచ్చేరితోపాటుగా నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్లో పలు తేదీల్లో ముగుస్తుంది. ఈ రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను ఈసీ పూర్తి చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు పలు రాష్ట్రాల్లోనూ ఈసీ పర్యటించింది.
- కోవిడ్-19 మహమ్మారి మధ్య జరిగిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఎనిమిది దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశ పోలింగ్ మార్చి 27న, చివరిది ఏప్రిల్ 29న జరిగింది. అనేక రాజకీయ పార్టీల నాయకులు ఈసారి ఎన్నికలు రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. సుదీర్ఘ షెడ్యూల్ ఎన్నికల ఖర్చులను పెంచుతుందని, ఓటింగ్ గురించి ప్రజల స్ఫూర్తిని తగ్గిస్తుందని అధికారులకు చెప్పారు. చివరకు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.
ఎన్నికల షెడ్యూల్తో ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) తక్షణమే అమల్లోకి వచ్చింది. పుదుచ్చేరితోపాటుగా నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్లో పలు తేదీల్లో ముగుస్తుంది. ఈ రాష్ట్రాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియను ఈసీ పూర్తి చేసింది. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించేందుకు పలు రాష్ట్రాల్లోనూ ఈసీ పర్యటించింది.
- కోవిడ్-19 మహమ్మారి మధ్య జరిగిన 2021 అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఎనిమిది దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశ పోలింగ్ మార్చి 27న, చివరిది ఏప్రిల్ 29న జరిగింది. అనేక రాజకీయ పార్టీల నాయకులు ఈసారి ఎన్నికలు రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. సుదీర్ఘ షెడ్యూల్ ఎన్నికల ఖర్చులను పెంచుతుందని, ఓటింగ్ గురించి ప్రజల స్ఫూర్తిని తగ్గిస్తుందని అధికారులకు చెప్పారు. చివరకు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది.