కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. 'ప్రత్యేక సమగ్ర సవరణ'(SIR) మూడో దశలో భాగంగా తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఈ కీలక షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా మార్చేందుకు ఎన్నికల సంఘం భారీ కసరత్తు చేస్తోంది. సుమారు 3.94 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు (BLOలు) నేరుగా 36.73 కోట్ల మంది ఓటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వేర్వేరు తేదీల్లో జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్
- ఏపీలో జూన్ మొదటి వారం నుంచే యంత్రాంగం రంగంలోకి దిగనుంది.
- జూన్ 5 నుండి 14 వరకు సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
- జూన్ 15 నుండి జూలై 14 వరకు అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు.
- జూలై 21న ఓటర్ల ప్రాథమిక జాబితా విడుదలవుతుంది.
- జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు తప్పుల సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది.
- సెప్టెంబర్ 22న ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రకటిస్తారు.
తెలంగాణలో షెడ్యూల్
- తెలంగాణలో ఏపీ కంటే పది రోజులు ఆలస్యంగా ప్రక్రియ మొదలవుతుంది.
- జూన్ 15 నుండి 24 వరకు శిక్షణ ఉంటుంది.
- జూన్ 25 నుండి జూలై 24 వరకు ఇంటింటి తనిఖీ చేస్తారు.
- జూలై 31న ప్రాథమిక జాబితా విడుదల చేస్తారు.
- జూలై 31 నుండి సెప్టెంబర్ 28 వరకు సుదీర్ఘకాలం పాటు అభ్యంతరాలు తెలపవచ్చు.
- అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదలవుతుంది.
మీ ఇంట్లో ఎవరైనా 18 ఏళ్లు నిండిన వారు ఉంటే కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి, చనిపోయిన వారి పేర్లు తొలగించడానికి లేదా అడ్రస్ మార్చుకోవడానికి ఈ ఇంటింటి సర్వే ఒక మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది. అధికారులు మీ వద్దకు వచ్చినప్పుడు సరైన వివరాలు అందించి సహకరించాలని ఎన్నికల సంఘం కోరుతోంది. రాజకీయ పార్టీలు కూడా ఈ సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని ఈసీ విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}మీ ఇంట్లో ఎవరైనా 18 ఏళ్లు నిండిన వారు ఉంటే కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి, చనిపోయిన వారి పేర్లు తొలగించడానికి లేదా అడ్రస్ మార్చుకోవడానికి ఈ ఇంటింటి సర్వే ఒక మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది. అధికారులు మీ వద్దకు వచ్చినప్పుడు సరైన వివరాలు అందించి సహకరించాలని ఎన్నికల సంఘం కోరుతోంది. రాజకీయ పార్టీలు కూడా ఈ సవరణ ప్రక్రియలో చురుగ్గా పాల్గొని ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని ఈసీ విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}మూడో దశ ఎస్ఐఆర్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపురలో జరగనున్నాయి. 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల మంది ఓటర్ల వద్దకు వెళ్తారు.