ఈపీఎఫ్ఓ (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) ఖాతాదారులకు అలర్ట్. పీఎఫ్ ఆన్లైన్ సేవలు, క్లెయిమ్ల ప్రాసెసింగ్ నిలిపివేత గడువును సంస్థ మరో రోజు పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం, జూలై 1 అర్ధరాత్రి 11:59 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. తిరిగి జూలై 2 అర్ధరాత్రి (00:00 గంటల) నుంచి యథాతథంగా డిజిటల్ సేవలు ప్రారంభం కానున్నాయి.
డేటాబేస్ అప్గ్రేడేషన్ పనులే కారణం

క్లెయిమ్ల ప్రాసెసింగ్ సిస్టమ్ను మెరుగుపరచడం, సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ పనుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 26న ప్రారంభమైన ఈ డేటాబేస్ మార్పు పనుల వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్ భద్రత, వేగం పెరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు అటు చందాదారులు (మెంబర్ ఇంటర్ఫేస్), ఇటు యజమానులు (ఎంప్లాయర్ ఇంటర్ఫేస్) వెబ్సైట్ను ఉపయోగించడం కుదరదు.
రెండోసారి పొడిగింపు
నిజానికి ఈ సేవలను తొలుత జూన్ 28 వరకు నిలిపివేసి, జూన్ 29న ప్రారంభించాలని భావించారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో జూన్ 30 వరకు పొడిగించి, జూలై 1న సేవలు అందిస్తామన్నారు. సాంకేతిక పనుల దృష్ట్యా ఇప్పుడు మరో రోజు పొడిగించి, జూలై 2 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘకాలం పాటు ఆన్లైన్ సేవలు నిలిచిపోవడం ఇదే మొదటిసారి. దీంతో లక్షలాది మంది పీఎఫ్ చందాదారులు, కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏయే సేవలకు అంతరాయం కలగనుంది?
ఈ సాంకేతిక నిర్వహణ వ్యవధిలో కింది సేవలు పూర్తిగా నిలిచిపోతాయి:
- ఆన్లైన్ పీఎఫ్ క్లెయిమ్ సమర్పణ
- పీఎఫ్ పాస్బుక్ డౌన్లోడ్
- క్లెయిమ్ స్టేటస్ ట్రాకింగ్
- పీఎఫ్ బదిలీ (ట్రాన్స్ఫర్) అభ్యర్థనలు
- ప్రొఫైల్, వ్యక్తిగత వివరాల అప్డేట్
- మెంబర్ పోర్టల్, ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా లభించే డిజిటల్ సేవలు
యాజమాన్యాలు సైతం తమ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ పనులను ప్రస్తుతానికి నిర్వహించలేవు.
సాంకేతిక మార్పుల లక్ష్యం ఇదే
{{/usCountry}}యాజమాన్యాలు సైతం తమ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ పనులను ప్రస్తుతానికి నిర్వహించలేవు.
సాంకేతిక మార్పుల లక్ష్యం ఇదే
{{/usCountry}}వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలను అందించడమే ఈ అప్గ్రేడేషన్ ఉద్దేశమని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్లైన్ లావాదేవీలు మరింత వేగంగా, నమ్మకంగా సాగుతాయని పేర్కొంది.
"తాత్కాలికంగా కలిగిన ఈ అసౌకర్యానికి విచారం వ్యక్తంచేస్తున్నాం. మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు మేము చేపట్టిన ఈ కీలక అప్గ్రేడ్ ప్రక్రియకు చందాదారులు సహకరించాలి" అని ఈపీఎఫ్ఓ తన అధికారిక పోర్టల్ నోటీసులో స్పష్టం చేసింది.
పీఎఫ్ క్లెయిమ్లు, పాస్బుక్ డౌన్లోడ్ల కోసం నిరీక్షిస్తున్న చందాదారులు జూలై 2 అర్ధరాత్రి నుంచి తమ పనులను తిరిగి ప్రారంభించుకోవచ్చు.