...
...
Next Story

ఇండియాకు ట్రోఫీని ప్లేటులో పెట్టి ఇచ్చారు.. వాళ్లను అంత ఒత్తిడిలో ఎప్పుడూ చూడలేదు.. ఆ అపవాదును చెరిపేశారు: మహ్మద్ ఆమిర్

టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియా కనీసం సెమీఫైనల్ కూడా చేరదంటూ జోస్యం చెప్పిన పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ఇప్పుడు న్యూజిలాండ్ పై పడి ఏడుస్తున్నాడు. వాళ్లు ఇండియాకు ట్రోఫీని ప్లేటులో పెట్టి ఇచ్చారంటున్నాడు.

Published on: Mar 9, 2026, 11:39:29 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం (మార్చి 8) జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్‌లో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ పలు రికార్డులను తిరగరాసింది. వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలవడమే కాకుండా, సొంత గడ్డపై ఈ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా 'మెన్ ఇన్ బ్లూ' చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయంపై పాక్ మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆమిర్ ఆగ్రహం: "ట్రోఫీని భారత్‌కు ప్లేట్‌లో పెట్టి ఇచ్చారు"

ఇండియాకు వరల్డ్ కప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.. వాళ్లను అంత ఒత్తిడిలో ఎప్పుడూ చూడలేదు.. ఆ అపవాదును చెరిపేశారు: మహ్మద్ ఆమిర్ (AFP)
ఇండియాకు వరల్డ్ కప్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు.. వాళ్లను అంత ఒత్తిడిలో ఎప్పుడూ చూడలేదు.. ఆ అపవాదును చెరిపేశారు: మహ్మద్ ఆమిర్ (AFP)

ఈ ఓటమిపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ తీవ్రస్థాయిలో స్పందించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ వ్యూహాలను అతడు తప్పుబట్టాడు. 'హార్నా మనా హై' షోలో మాట్లాడుతూ.. "న్యూజిలాండ్ బౌలింగ్ మార్పులు నాకు అస్సలు అర్థం కాలేదు. అభిషేక్ శర్మ స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడతాడని తెలిసినా, స్పిన్నర్ కోల్ మెకోంచీని పక్కన పెట్టి పేసర్ జాకబ్ డఫీని తీసుకోవడం ఏంటి?" అని ప్రశ్నించాడు.

గ్లెన్ ఫిలిప్స్‌తో కేవలం ఒకే ఓవర్ వేయించడంపై కూడా అతడు మండిపడ్డాడు. కివీస్ జట్టు ఇంత ఒత్తిడిలో ఉండటం తానెప్పుడూ చూడలేదని ఆమిర్ అన్నాడు.

కొత్త చరిత్ర: బ్యాటర్లే టోర్నీలు గెలిపించగలరు

సాధారణంగా ఫాస్ట్ బౌలర్లే టోర్నీలను గెలిపిస్తారనే నానుడిని భారత్ తుడిచిపెట్టేసిందని అమీర్ కొనియాడాడు. సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో ఫ్లాట్ పిచ్‌లపై 250కి పైగా పరుగులు చేసి బ్యాటర్లు కూడా మ్యాచ్ విన్నర్లు అని నిరూపించారని ప్రశంసించాడు.

భారత్ బ్యాటర్ల వీరవిహారం

ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బ్యాటర్లు ఆ నిర్ణయం తప్పని నిరూపించారు. అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది భారత్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు.

భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించగా, కివీస్ జట్టు 159 పరుగులకే కుప్పకూలింది.

అవార్డులు ఇలా

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: బుమ్రా (4 ఓవర్లలో 4/15 వికెట్లు తీసి కివీస్ వెన్ను విరిచాడు).

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: సంజూ శాంసన్ (5 మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు).

ఈ విజయంతో భారత్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. షోయబ్ అక్తర్ వంటి మాజీలు కూడా స్పందిస్తూ.. "భారత్ ఇప్పుడే 2027 వరల్డ్ కప్ టైటిల్‌ను కూడా తీసేసుకోవాలి" అంటూ సెటైరికల్‌గా ప్రశంసలు కురిపించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe