దేశమంతటా వినాయక చవితి సంబరాలు మిన్నంటుతున్న వేళ ఆర్థిక రంగానికి నేడు కీలకమైన విరామం లభించింది. పండుగ పురస్కరించుకుని ఈరోజు (సెప్టెంబర్ 14, 2026 - సోమవారం) దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు బ్యాంకింగ్ రంగానికి సెలవు ప్రకటించారు.
స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ బంద్.. కమొడిటీ మార్కెట్ వేళలు ఇవే!

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) అందించిన వివరాల ప్రకారం.. ఈక్విటీ విభాగాలు, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్తో పాటు ఎన్డీఎస్-ఆర్ఎస్టీ, ట్రై-పార్టీ రెపో సెగ్మెంట్లలో వినాయక చవితి కారణంగా నేడు ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోనుంది. తిరిగి మంగళవారం ఉదయం సాధారణ వేళల్లో మార్కెట్లలో ట్రేడింగ్ పునఃప్రారంభమవుతుంది.
అయితే కమొడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ విభాగంలో ట్రేడింగ్ చేసే వారికి మినహాయింపు ఇచ్చారు. తొలి విడతలో అంటే ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కమొడిటీ మార్కెట్ మూసి ఉంటుంది. తిరిగి రెండో విడతలో సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి సమయం వరకు ట్రేడింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ సెప్టెంబర్ నెలలో స్టాక్ మార్కెట్లకు ఇదొక్కటే అధికారిక సెలవు కావడం గమనార్హం.
స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి?
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన నిఫ్టీ 50, సెన్సెక్స్ గడిచిన వారం ముగిసేసరికి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాలు, క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ పెరుగుదల వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. నిఫ్టీ 2 శాతం కంటే ఎక్కువ క్షీణించి 23,398 పాయింట్లకు చేరగా, సెన్సెక్స్ 2.27 శాతం నష్టపోయి 74,781 పాయింట్ల వద్ద స్థిరపడింది. గడిచిన ఐదు వారాలుగా మార్కెట్లు వరుసగా నష్టపోతూ రావడం రిటైల్ ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.
నేటి సెలవుతో ఈ నష్టాల పరంపరకు తాత్కాలిక విరామం లభించింది.
రాబోయే రోజుల్లో మిగిలిన స్టాక్ మార్కెట్ సెలవుల..
{{/usCountry}}నేటి సెలవుతో ఈ నష్టాల పరంపరకు తాత్కాలిక విరామం లభించింది.
రాబోయే రోజుల్లో మిగిలిన స్టాక్ మార్కెట్ సెలవుల..
{{/usCountry}}వినాయక చవితి అనంతరం అక్టోబర్ నెలలో అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 20న దసరా సందర్భంగా రెండు సెలవులు రానున్నాయి. ఆ తర్వాత నవంబర్ 10న దీపావళి బలిప్రతిపద, నవంబర్ 24న గురునానక్ జయంతి రోజుల్లో మార్కెట్లకు సెలవులు ఉంటాయి. చివరిగా డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజున బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సేవలను మూసివేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.. ఆన్లైన్ సేవలు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం.. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడతో పాటు ముంబై, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, పనాజీ వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల శాఖలకు నేడు సెలవు.
కాగా.. సమ్మె కారణంగా శుక్రవారం, రెండో శని- ఆదివారాల వల్ల నిన్న మొన్న, పండుగతో ఈరోజు.. బ్యాంకు కార్యకలాపాలకు వరుసగా 4 రోజులు అంతరాయం ఏర్పడింది.
అయితే డిజిటల్ బ్యాంకింగ్ యుగంలో భౌతిక శాఖలు మూసి ఉన్నప్పటికీ నెట్ బ్యాంకింగ్, మొబైల్ ఆప్లు, యూపీఐ డిజిటల్ చెల్లింపులు, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. నగదు విత్డ్రా లేదా ఇతర ఆన్లైన్ ట్రాన్స్ఫర్ల కోసం కస్టమర్లు డిజిటల్ మార్గాలను వినియోగించుకోవచ్చు.