...
...
Next Story

గ్యాప్-అప్ ప్రారంభం వైపు మార్కెట్లు: నేడు కొనాల్సిన 8 షేర్లు ఇవే

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం, తగ్గిన ముడిచమురు ధరలతో బుధవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 180 పాయింట్లకు పైగా ప్రీమియంతో పయనిస్తుండగా, నేటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిపుణులు 8 కీలక షేర్లను సిఫార్సు చేశారు.

Published on: Aug 5, 2026, 08:23:01 IST
Advertisement

క్రూడ్ ఆయిల్ ధరల పతనం, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు సడలడం, ఆసియా మార్కెట్ల జోరుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం (ఆగస్టు 5) లాభాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మునుపటి సెషన్‌లో నష్టాలతో ముగిసినప్పటికీ, అంతర్జాతీయంగా కనిపిస్తున్న సానుకూల పరిణామాలు మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్-అప్ సంకేతాలు

గ్యాప్-అప్ ప్రారంభం వైపు మార్కెట్లు:
గ్యాప్-అప్ ప్రారంభం వైపు మార్కెట్లు:

బుధవారం ఉదయం గిఫ్ట్ నిఫ్టీ (Gift Nifty) 24,740 స్థాయి వద్ద ట్రేడవుతూ, నిఫ్టీ ఫ్యూచర్స్ మునుపటి ముగింపు (24,555.60) కంటే ఏకంగా 184.4 పాయింట్ల ప్రీమియంతో కొనసాగుతోంది. ఇది భారత మార్కెట్లకు బలమైన ప్రారంభాన్ని (Gap-up start) సూచిస్తోంది.

అటు ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో పయనిస్తున్నాయి. జపాన్ నిక్కీ 3 శాతానికి పైగా, దక్షిణ కొరియా కోస్పి 4 శాతానికి పైగా ఎగబాకాయి. పర్షియన్ గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $79 కంటే కిందకు పడిపోగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ $75 మార్కు వద్ద నిలిచింది.

ఆర్బీఐ పాలసీపైనే అందరి దృష్టి

గత సెషన్‌లో సెన్సెక్స్ 210.08 పాయింట్లు తగ్గి 78,428.95 వద్ద, నిఫ్టీ 159.40 పాయింట్లు క్షీణించి 24,614.90 వద్ద ముగిశాయి. అయితే, నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యపతిన విధాన మండలి (MPC) నిర్ణయం వెలువడనుండటం మార్కెట్‌కు అత్యంత కీలకం కానుంది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఇచ్చే మార్గదర్శకాలు బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేసే అవకాశముంది.

ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే, 58,300–58,500 రెసిస్టెన్స్ స్థాయిని దాటితే నిఫ్టీ బ్యాంక్ 58,800–59,000 స్థాయికి చేరుకోవచ్చని, దిగువన 57,600–57,500 కీలక మద్దతుగా పనిచేస్తుందని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ పేర్కొన్నారు.

నేడు గమనించాల్సిన 8 ఇంట్రాడే షేర్లు

ప్రముఖ విశ్లేషకులు సుమీత్ బగాడియా (చాయిస్ బ్రోకింగ్), గణేష్ డోంగ్రే (ఆనంద్ రాఠీ), షిజు కూతుపలక్కల్ నేటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సిఫార్సు చేసిన షేర్లు:

  1. సారేగమ ఇండియా (Saregama India Ltd): కొనుగోలు ధర: 543 | టార్గెట్: 582 | స్టాప్ లాస్: 523
  2. వెల్‌స్పన్ కార్ప్ (Welspun Corp Ltd): కొనుగోలు ధర: 1,737 | టార్గెట్: 1,860 | స్టాప్ లాస్: 1,675
  3. డెలివరీ (Delhivery Ltd): కొనుగోలు ధర: 473 | టార్గెట్: 490 | స్టాప్ లాస్: 465
  4. జైడస్ లైఫ్‌సైన్సెస్ (Zydus Lifesciences Ltd): కొనుగోలు ధర: 1,120 | టార్గెట్: 1,160 | స్టాప్ లాస్: 1,100
  5. విప్రో (Wipro Ltd): కొనుగోలు ధర: 188 | టార్గెట్: 195 | స్టాప్ లాస్: 184
  6. ఇనాక్స్ గ్రీన్ ఎనర్జీ (Inox Green Energy Services Ltd): కొనుగోలు ధర: 178 | టార్గెట్: 192 | స్టాప్ లాస్: 174
  7. సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ (Syrma SGS Technology Ltd): కొనుగోలు ధర: 1,421 | టార్గెట్: 1,490 | స్టాప్ లాస్: 1,392
  8. వెల్‌స్పన్ లివింగ్ (Welspun Living Ltd): కొనుగోలు ధర: 160.50 | టార్గెట్: 172 | స్టాప్ లాస్: 156

(గమనిక: ఈ షేర్ల సిఫార్సులు విశ్లేషకుల సొంత అభిప్రాయాలు మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడులు తీవ్ర హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి, నిపుణుల సలహాతో నిర్ణయం తీసుకోండి).

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe