నూతన గరిష్ఠాలకు బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?
అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలహీనపడటంతో బంగారం, వెండి ధరలు బుధవారం సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం 10 గ్రాములు రూ. 1,38,469 పలుకగా, కిలో వెండి ఏకంగా రూ. 2.23 లక్షల మార్కును తాకింది. మరి ఇప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి, వెండి ధరలు బుధవారం (డిసెంబర్ 24) ఉదయం సరికొత్త రికార్డు శిఖరాలను అధిరోహించాయి. దేశీయ మార్కెట్ ఎంసీఎక్స్లో బుధవారం ఉదయం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.42 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,38,469 వద్ద ఆల్టైమ్ హైని తాకింది. మరోవైపు వెండి ధరల దూకుడు చూస్తే కళ్లు చెదరాల్సిందే! మార్చ్ సిల్వర్ కాంట్రాక్టులు దాదాపు 2 శాతం జంప్ చేసి కిలోకు రూ. 2,23,742 వద్ద కొత్త శిఖరాన్ని చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తొలిసారి ఔన్సుకు 4,500 డాలర్లు దాటింది. స్పాట్ సిల్వర్ తొలిసారి ఔన్సుకు 70డాలర్లు దాటింది. 0.8శాతం లాభపడి 4,513.87 డాలర్లకు చేరింది. ఫలితంగా స్పాట్ సిల్వర్ వరుసగా మూడో రోజు లాభాల్లో కొనసాగుతున్నట్టు అయ్యింది.
బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలు..
అమెరికా- వెనుజువెలా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఆ దేశం నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్లను అమెరికా ఆపేయడంతో ఇరు దేశాల మధ్య బంధంపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ కూడా పడుతూ వస్తోంది. ఫలితంగా “సేఫ్ హెవెన్”గా భావించే బంగారం, వెండివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. వీటితో పాటు యూఎస్ ఫెడ్ రేట్ కట్పైనా అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది కూడా వడ్డీ రేట్ల కోత ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా బంగారం, వెండి ధరల వృద్ధి కారణంగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడుల ప్రవాహాలు కూడా బంగారం, వెండికి జోష్ ఇచ్చాయి.
బంగారం కన్నా వెండి విపరీతంగా పెరుగుతుండటం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాదిపతికన బంగారం 76శాతం వృద్ధి చెందగా, వెండి మాత్రం ఏకంగా 140శాతం కన్నా ఎక్కువ పెరిగింది. 1979 తర్వాత వెండికి ఇదే బలమైన ప్రదర్శన.
బంగారం, వెండి ధరలు- ఈ లెవల్స్ కీలకం..
Prithvifinmart కమోడిటీ రీసెర్చ్కి చెందిన మనోజ్ కుమార్ జైన్ ప్రకారం.. బంగారం ధర ట్రాయ్ ఔన్సుకు 4,284 డాలర్లు- 4,580 డాలర్ల మధ్య ట్రేడ్ అవ్వొచ్చు. ఈ వారం వెండి ట్రాయ్ ఔన్సుకు 66.40 డాలర్లు- 74 డాలర్ల వద్ద కొనసాగవచ్చు.
“ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకుంటే.. బంగారానికి రూ. 1,36,660- 1,35,800 వద్ద సపోర్ట్, రూ. 1,38,850- రూ. 1,40,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది. వెండికి రూ. 2,17,700- రూ. 2,16,00 వద్ద సపోర్ట్, రూ.2,22,000- రూ. 2,25,000 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని జైన్ వెల్లడించారు.
“క్రిస్మస్ సెలవులకు ముందు బంగారం రూ. 1,40,000 వద్ద- సిల్వర్ రూ. 2,24,000 వద్ద ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవాలని మేము సూచిస్తున్నాము. మళ్లీ కొనుగోలు చేసే ముందు వేచి చూడండి. ధరలు పడిన తర్వాత కొత్తగా కొనుగోలు చేయవచ్చు,” అని జైన్ స్పష్టం చేశారు.
మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎంసీఎక్స్ బంగారానికి రూ. 1,38,650 - రూ. 1,39,470 వద్ద రెసిస్టెన్స్ ఉందని, వెండికి రూ. 2,22,970 వద్ద రెసిస్టెన్స్ ఉందని పేర్కొన్నారు.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడైజర్ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


