లాభాల్లో బంగారం, వెండి ధరలు.. పడిపోయిన డాలర్, క్రూడ్

అంతర్జాతీయంగా డాలర్ విలువ పడిపోవడం, ముడిచమురు ధరలు తగ్గడంతో బుధవారం ఉదయం మార్కెట్లో బంగారం, వెండి ధరలు లాభపడ్డాయి. ఎంసీఎక్స్‌లో పసిడి ధర 10 గ్రాములకు 1,45,110 దాటగా, వెండి ధర కిలోకు 2,23,690 వద్ద ట్రేడవుతోంది.

Published on: Aug 5, 2026, 09:38:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుధవారం (ఆగస్టు 5) ఉదయం కమోడిటీ మార్కెట్లలో బంగారం, వెండి కళకళలాడాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ క్షీణించడం, ముడిచమురు ధరలు దిగిరావడంతో లోహాల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు నేడు వెలువడనున్న ఆర్‌బీఐ ద్రవ్యపతిన విధాన నిర్ణయంపై మదుపర్లు దృష్టి సారించారు.

లాభాల్లో బంగారం, వెండి ధరలు.. పడిపోయిన డాలర్, క్రూడ్
లాభాల్లో బంగారం, వెండి ధరలు.. పడిపోయిన డాలర్, క్రూడ్

ఎంసీఎక్స్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం ఉదయం 9:10 గంటల సమయంలో:

బంగారం: అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.56% పెరిగి 10 గ్రాములకు 1,45,110 వద్ద నమోదైంది.

వెండి: సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు 1% లాభపడి కిలోకు 2,23,690 వద్ద ట్రేడయింది.

డాలర్, క్రూడ్ పతనం కలిసొచ్చింది

డాలర్ ఇండెక్స్ 0.10% తగ్గి 99.77 వద్దకు చేరింది. డాలర్ క్షీణించడం వల్ల ఇతర కరెన్సీల రూపంలో బంగారం కొనుగోలు చేసేవారికి భారం తగ్గింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 1% కంటే ఎక్కువ తగ్గి బ్యారెల్‌కు $78 సమీపానికి చేరింది. హార్ముజ్ జలసంధిని త్వరలోనే తెరుస్తామని, లేకపోతే ఇరాన్‌పై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినప్పటికీ, దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఆర్‌బీఐ పాలసీపైనే కళ్లు

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన సమీక్షలో వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అదే బాటలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా పయనిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఉదయం 10 గంటలకు విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఆర్‌బీఐ రెపో రేటును 5.25% వద్దే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

"ఈసారి ఆర్‌బీఐ నిర్ణయంలో కేవలం వడ్డీ రేట్ల కంటే ద్రవ్యోల్బణం, మార్కెట్లో ద్రవ్య లభ్యత (Liquidity), అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆర్‌బీఐ కామెంట్లు ఎలా ఉండబోతున్నాయనేది అత్యంత కీలకం" అని ఐఎన్‌విఅస్సెట్ పిఎమ్‌ఎస్ బిజినెస్ హెడ్ హర్షల్ దసానీ తెలిపారు.

నేడు గమనించాల్సిన కీలక స్థాయిలు (Trading Levels)

పృథ్వీఫిన్ మార్ట్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకుడు మనోజ్ కుమార్ జైన్ అంచనా ప్రకారం..

అంతర్జాతీయ మార్కెట్: బంగారానికి $4,120, $4,089 వద్ద మద్దతు (Support), $4,184, $4,222 వద్ద నిరోధం (Resistance) ఉన్నాయి. వెండికి $59.10, $58.40 వద్ద మద్దతు, $61.60, $62.80 వద్ద నిరోధం ఉన్నాయి.

ఎంసీఎక్స్ బంగారం: మద్దతు ధరలు 1,43,350 - 1,42,600. నిరోధక స్థాయిలు 1,45,000 - 1,45,550. 1,43,500 వద్ద కొనుగోలు చేసి స్టాప్ లాస్ 1,42,000 కింద ఉంచాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఎంసీఎక్స్ వెండి: మద్దతు ధరలు 2,20,000 - 2,17,700. నిరోధక స్థాయిలు 2,23,000 - 2,25,500.

ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది ప్రకారం, రూపాయి మారకపు విలువ ఆధారంగా ఎంసీఎక్స్ బంగారం సమీప కాలంలో 1,42,500 నుంచి 1,44,500 శ్రేణిలో కదలాడే అవకాశం ఉంది.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More