Gold Price Today: పసిడి, వెండి ధరల పరుగు: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి రేట్లు ఇవే

అమెరికా-ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయంగా పసిడి, వెండి ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా రిటైల్ ధరల వివరాలు మీకోసం.

Published on: Jul 14, 2026, 11:04:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్లోబల్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు భారత్‌లో పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్లను కుదిపేస్తున్నాయి. మంగళవారం (జూలై 14) దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి.

Gold mutual funds and sovereign gold bonds are two popular options for gold investors.
Gold mutual funds and sovereign gold bonds are two popular options for gold investors.

ఎంసీఎక్స్ మార్కెట్ అప్‌డేట్స్

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మంగళవారం ఉదయం 9:13 గంటల సమయానికి పసిడి ధరలు 0.69 శాతం పెరిగి, 10 గ్రాములకు రూ. 1,41,550 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా, కిలో వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.46 శాతం లాభపడి రూ. 2,18,760 వద్ద కొనసాగుతోంది.

చమురు సెగ.. ఎగబాకిన క్రూడాయిల్ ధరలు

ఇరాన్ నౌకాశ్రయాలపై ఆంక్షలు విధించడంతో పాటు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే ఓడలపై కొత్తగా షిప్పింగ్ రుసుములు వసూలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ ప్రతిపాదన అంతర్జాతీయంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపవచ్చనే ఆందోళనలను రేకెత్తించింది. దీంతో మంగళవారం ముడిచమురు ధరలు పెరిగాయి.

"హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే అన్ని రకాల సరుకు రవాణా ఓడలపై 20 శాతం పన్ను విధిస్తాం" అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాను ఈ కీలక చమురు రవాణా మార్గానికి రక్షకుడిగా అభివర్ణించిన ఆయన, ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఆగస్టు డెలివరీకి సంబంధించిన యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ఫ్యూచర్స్ ధర 2.27 శాతం లాభపడి బ్యారెల్‌కు 79.91 డాలర్లకు చేరింది. సెప్టెంబర్ డెలివరీకి సంబంధించిన అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 2.14 శాతం పెరిగి బ్యారెల్‌కు 85.11 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు సెషన్‌లో ఇది 9.6 శాతం పెరిగిన విషయం తెలిసిందే.

గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు

అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా మూడో రోజు కూడా దాడులు నిర్వహించింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు చమురు ట్యాంకర్లపై దాడులు చేయడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఐదు గంటల పాటు సాగిన దాడులను విజయవంతంగా పూర్తి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతుండడంతో ధరలు పెరుగుతున్నాయి.

దూసుకుపోతున్న చైనా ఎగుమతులు

మరోవైపు చైనా ఎగుమతులు జూన్ నెలలో గణనీయంగా పెరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హార్డ్‌వేర్ కోసం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన డిమాండ్, రాబోయే టారిఫ్ పెంపుల కంటే ముందే అమెరికా రిటైలర్లు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరపడం వల్ల చైనా ఎగుమతులు ఊపందుకున్నాయి. డాలర్ విలువ రూపంలో చైనా ఎగుమతులు గతేడాదితో పోలిస్తే ఏకంగా 27 శాతం వృద్ధి చెందాయి. ఇది ఆర్థిక నిపుణులు అంచనా వేసిన 18.2 శాతం కంటే ఎంతో ఎక్కువ. గత మే నెలలో నమోదైన 19.4 శాతం వృద్ధి కంటే ఇది భారీ మెరుగుదల కావడం విశేషం. అక్టోబర్ 2021 తర్వాత చైనా ఎగుమతుల్లో నమోదైన అత్యధిక వృద్ధి రేటు ఇదే కావడం గమనార్హం.

నగరాల వారీగా బంగారం, వెండి ధరలు

సాధారణంగా ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు, 24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైన రూపంగా భావిస్తారు. జూలై 14న దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం, వెండి రిటైల్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి:

నగరం24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)వెండి (1 కేజీ)
హైదరాబాద్రూ. 1,41,560రూ. 1,29,763రూ. 2,19,280
న్యూఢిల్లీరూ. 1,41,010రూ. 1,29,259రూ. 2,17,950
ముంబైరూ. 1,41,260రూ. 1,29,488రూ. 2,18,330
బెంగళూరురూ. 1,41,450రూ. 1,33,183రూ. 2,19,100
కోల్‌కతారూ. 1,41,450రూ. 1,29,388రూ. 2,18,640
చెన్నైరూ. 1,41,750రూ. 1,29,938రూ. 2,19,570
  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More