అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులను నియమించుకునే కంపెనీలపై మరో ఆర్థిక భారం పడింది. వీసా ఎక్స్టెన్షన్కు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రవేశపెట్టిన కొత్త ‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ రుసుము’ నిబంధన సెప్టెంబర్ 9, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. బాధ్యతాయుత భద్రతా ప్రమాణాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఏమిటీ కొత్త మార్పు? ఎవరిపై ప్రభావం?
గతంలో అమెరికాలో మొదటిసారి హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసా పొందేటప్పుడు లేదా ఉద్యోగ సంస్థ మారినప్పుడు (Change of employer) మాత్రమే కంపెనీలు ఈ బయోమెట్రిక్ రుసుమును చెల్లించేవి. అయితే సవరించిన నిబంధన ప్రకారం.. ఒకే కంపెనీలో కొనసాగుతూ వీసా కాలాన్ని పొడిగించుకునే (Extension of status) అభ్యర్థుల దరఖాస్తులకు కూడా కంపెనీలు ఈ రుసుమును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆగస్టు 10న ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన ఉత్తర్వులు సెప్టెంబర్ 9 నుంచి అమలులోకి వచ్చాయి.
ఎంత రుసుము చెల్లించాలి?
కొత్త నిబంధన ద్వారా ఫీజు మొత్తాన్నేమీ పెంచలేదు, కానీ ఫీజు వసూలు చేసే పరిధిని పొడిగించారు.
- హెచ్-1బీ వీసా ఎక్స్టెన్షన్: ఒక్కో దరఖాస్తుకు 4,000 డాలర్లు.
- ఎల్-1 వీసా ఎక్స్టెన్షన్: ఒక్కో దరఖాస్తుకు 4,500 డాలర్లు.
ఈ ఫీజు అమెరికాలోని అన్ని కంపెనీలకూ వర్తించదు. అమెరికాలో కనీసం 50 మంది ఉద్యోగులు ఉండి, వారిలో 50 శాతం కంటే ఎక్కువ మంది హెచ్-1బీ లేదా ఎల్-1 (ఎల్-1ఏ, ఎల్-1బీ) వీసాలపై పనిచేస్తున్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో పెద్ద మొత్తంలో భారతీయ టెక్కీలను నియమించుకునే ఐటీ, అవుట్సోర్సింగ్ కంపెనీలపై ఈ భారం పడనుంది. తక్కువ మంది విదేశీ ఉద్యోగులున్న చిన్న కంపెనీలకు దీని నుంచి మినహాయింపు లభిస్తుంది.
భారతీయ ఉద్యోగులపై పడే ప్రభావం ఎంత?
ఈ బయోమెట్రిక్ రుసుమును వీసా స్పాన్సర్ చేసే కంపెనీలే చెల్లించాలి. ఈ ఖర్చులను భర్తీ చేసుకోవడానికి హెచ్-1బీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించకూడదని డీహెచ్ఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కంపెనీలకు వీసా పొడిగింపు వ్యయం గణనీయంగా పెరగనుండటంతో, ఎక్స్టెన్షన్లు ఇచ్చే సమయంలో కంపెనీలు మరింత కఠిన వైఖరి అవలంబించే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}ఈ బయోమెట్రిక్ రుసుమును వీసా స్పాన్సర్ చేసే కంపెనీలే చెల్లించాలి. ఈ ఖర్చులను భర్తీ చేసుకోవడానికి హెచ్-1బీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించకూడదని డీహెచ్ఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే కంపెనీలకు వీసా పొడిగింపు వ్యయం గణనీయంగా పెరగనుండటంతో, ఎక్స్టెన్షన్లు ఇచ్చే సమయంలో కంపెనీలు మరింత కఠిన వైఖరి అవలంబించే అవకాశాలు ఉన్నాయి.
{{/usCountry}}ఈ నిబంధన సెప్టెంబర్ 30, 2027 వరకు దాఖలయ్యే దరఖాస్తులకు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అమెరికా సరిహద్దు భద్రత, బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ వ్యవస్థ బలోపేతానికి ఈ నిధులను వినియోగిస్తారు.