...
...
Next Story

హెచ్‌సీఎల్ టెక్ క్యూ3 ఫలితాలు: రూ.12 డివిడెండ్.. లాభం తగ్గినా రెవెన్యూ జోరు

ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. నికర లాభం 11% తగ్గినప్పటికీ, రెవెన్యూ 13% వృద్ధిని నమోదు చేసింది. షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ.12 డివిడెండ్ ఇస్తున్నట్లు బోర్డు నిర్ణయించింది.

Published on: Jan 12, 2026 06:01 PM IST
Advertisement

దేశీయ ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. కంపెనీ నికర లాభం గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆదాయం (Revenue) పెరగడం గమనార్హం. ఇదే సమయంలో తన వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించి కంపెనీ తీపి కబురు అందించింది.

రూ.12 డివిడెండ్.. కీలక తేదీలు ఇవే!

హెచ్‌సీఎల్ టెక్ క్యూ3 ఫలితాలు: రూ.12 డివిడెండ్.. లాభం తగ్గినా రెవెన్యూ జోరు (REUTERS)
హెచ్‌సీఎల్ టెక్ క్యూ3 ఫలితాలు: రూ.12 డివిడెండ్.. లాభం తగ్గినా రెవెన్యూ జోరు (REUTERS)

హెచ్‌సీఎల్ టెక్ బోర్డు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

రికార్డు తేదీ: జనవరి 16, 2026

చెల్లింపు తేదీ: జనవరి 27, 2026 గత ఏడాది కాలంలో హెచ్‌సీఎల్ టెక్ మొత్తం 60 డివిడెండ్‌ను అందించింది. దీంతో కంపెనీ డివిడెండ్ యీల్డ్ 3.60 శాతంగా ఉంది.

లాభం ఎందుకు తగ్గింది?

డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం 11.14 శాతం తగ్గి 4,076 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 4,591 కోట్లుగా ఉండేది. టీసీఎస్ మాదిరిగానే, హెచ్‌సీఎల్ టెక్ కూడా కొత్త కార్మిక చట్టాల అమలు కారణంగా 956 కోట్లను 'వన్-టైమ్ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్' కింద కేటాయించాల్సి వచ్చింది. ఈ అదనపు వ్యయం వల్లే నికర లాభంపై ప్రభావం పడింది.

ఆదాయంలో మెరుగైన వృద్ధి

లాభాలు తగ్గినా, ఆదాయం విషయంలో కంపెనీ దూసుకుపోతోంది. మూడో త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ రెవెన్యూ 13.32 శాతం పెరిగి 33,872 కోట్లుగా నమోదైంది. డాలర్ల రూపంలో చూస్తే, ఆదాయం 3,793 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది గతేడాదితో పోలిస్తే 7.4% వృద్ధి. కాన్స్టెంట్ కరెన్సీ పరంగా చూసినా 4.8 శాతం వార్షిక వృద్ధిని కంపెనీ సాధించింది.

నిపుణుల విశ్లేషణ

మొత్తానికి లాభాలు తగ్గినా, డివిడెండ్ల రూపంలో ఇన్వెస్టర్లకు లబ్ధి చేకూర్చడం ద్వారా హెచ్‌సీఎల్ టెక్ తన విశ్వసనీయతను నిలబెట్టుకుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe