దశాబ్దాలు గడిచినా తగ్గని క్రేజ్! భారతీయులకు Hero Splendor అంటే ఎందుకు అంత ఇష్టం?
ఎన్ని బైక్స్ వచ్చినా.. హీరో స్ల్పెండర్ జోరే సపరేటు! హీరో మోటోకార్ప్ నంబర్.1 స్థానానికి కారణమైన ఈ బైక్ ఎందుకంత పాపులర్? దశాబ్దాలు గడిచినా భారతీయుల్లో ఈ బైక్కి ఎందుకు క్రేజ్ కొనసాగుతోంది? పూర్తి విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..
అమ్మకాల పరిమాణం పరంగా భారతదేశంలో నంబర్ వన్ టూ-వీలర్ తయారీదారు హీరో మోటోకార్ప్. ఈ దేశీయ ఆటో దిగ్గజం చాలా కాలంగా ఈ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న మోడల్ స్ల్పెండర్ సిరీస్ అనడంలో సందేహం లేదు.
ఐకానిక్ బైక్ హీరో స్ల్పెండర్..
ఈ ఐకానిక్ కమ్యూటర్ మోటార్సైకిల్ సిరీస్లో ప్రస్తుతం స్ల్పెండర్+ ఎకస్టీఈసీ 2.0, స్ల్పెండర్+, స్ల్పెండర్+ ఎక్స్టీఈసీ, సూపర్ స్ల్పెండర్ ఎక్స్టీఈసీ సహా నాలుగు వేర్వేరు మోడల్స్ ఉన్నాయి. ఈ మోటార్సైకిల్స్ 100 సీసీ నుంచి 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి.
హీరో స్ల్పెండర్ బైక్ 1994లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్సైకిల్గా ప్రవేశించింది. అప్పటి నుంచి, డిజైన్లో మార్పులు, టెక్నాలజీ పరిణామాలు ఉన్నప్పటికీ, ఈ మోడల్ ప్రాథమిక డిజైన్ ఫిలాసఫీ, దాని అనుబంధ మోడల్స్ అలాగే ఉన్నాయి. అందుకే ఈ మోటార్సైకిల్ సిరీస్కు ఉన్న ప్రజాదరణ కూడా ఏ మాత్రం తగ్గలేదు.
భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో అగ్రస్థానం నుంచి స్కూటర్ల శ్రేణి అయిన హోండా యాక్టివా దీనిని ఒకటి, రెండు సందర్భాలలో దించివేసినప్పటికీ, స్ల్పెండర్.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనంగా నిలిచింది. శక్తివంతమైన, ప్రీమియం ద్విచక్ర వాహనాల వైపు వినియోగదారుల ప్రాధాన్యత వేగంగా మారుతున్నప్పటికీ, ఈ బైక్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
గత రెండు దశాబ్దాలలో, 100 సీసీ, 110 సీసీ మోటార్సైకిళ్ల స్థానంలో 125 సీసీ, 150 సీసీ మోటార్సైకిళ్లు భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న సెగ్మెంట్గా మారాయి. అయినప్పటికీ, ఈ ట్రెండ్ కూడా స్ల్పెండర్ సిరీస్ ప్రజాదరణను దెబ్బతీయలేకపోయింది.
హీరో స్ల్పెండర్ సిరీస్ను భారతదేశంలో అంతగా ప్రాచుర్యం పొందేలా చేసిన ఐదు కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి:
హీరో స్ల్పెండర్: ఇంత ప్రజాదరణకు కారణం ఏంటి?
రోజువారీ ప్రయాణానికి తక్కువ ఖర్చుతో కూడిన పర్సనల్ వెహికిల్ కోసం చూస్తున్న రైడర్లకు హీరో స్ల్పెండర్ ఒక పొదుపుతో కూడిన, ఆచరణాత్మకమైన ఎంపిక. దీని విశ్వసనీయత, సరసమైన ధర, మైలేజీ ఈ మోటార్సైకిల్ను వినియోగదారులకు బాగా నచ్చేలా చేసింది. హీరో మోటోకార్ప్ విస్తృత సర్వీస్ నెట్వర్క్ ద్వారా సులభంగా లభించే తక్కువ నిర్వహణ ఖర్చు దాని ఆకర్షణను మరింత పెంచుతోంది.
1. విశ్వసనీయత, మన్నిక
హీరో స్ల్పెండర్ సిరీస్ మోటార్సైకిళ్లు మన్నికైన, ఆచరణాత్మకమైన డిజైన్తో వస్తాయి. ఇవి పట్టణ, గ్రామీణ రోడ్లపై సాధారణ రైడింగ్ పరిస్థితులను ఎటువంటి ఇబ్బంది లేకుండా తట్టుకోగలవు. తక్కువ నిర్వహణ అవసరం కూడా ఈ మోటార్సైకిల్కు డిమాండ్ను పెంచడానికి మరొక ముఖ్య అంశం.
2. సరసమైన ధర
హీరో మోటోకార్ప్కి చెందిన స్ల్పెండర్ సిరీస్ బైక్స్ని స్థానికంగా తయారు చేయడం వల్ల, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారికి కూడా ధరలు పోటీతత్వంగా, సరసమైనవిగా ఉంచడానికి బ్రాండ్కు సహాయపడుతుంది. తక్కువ నిర్వహణ ఖర్చులు, సులభంగా, చౌకగా లభించే విడిభాగాలనుస్ల్పెండర్ ఈ సరసమైన ధరతో కలిపితే, స్ల్పెండర్ సిరీస్ మోటార్సైకిళ్లు అధిక విలువ గల ఉత్పత్తులుగా నిలుస్తున్నాయి.
3. అధిక మైలేజీ
ఫీచర్లు, సాంకేతికత, పనితీరుపై దృష్టి పెరుగుతున్నప్పటికీ, చాలా మంది వినియోగదారుల వాహనం కొనుగోలు నిర్ణయంలో మైలేజీ ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో 100-110 సీసీ ఇంజిన్లతో ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ని కొనుగోలు చేసే కొనుగోలుదారులలో ఎక్కువ మంది అధిక ఇంధన సామర్థ్యాన్ని కోరుకుంటారు. ఇది ప్రాడాక్ట్ మొత్తం యాజమాన్య ఖర్చును తక్కువగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపు 80 కేఎంపీఎల్ మైలేజీని అందించడం ద్వారా స్ల్పెండర్ చాలా మందిని ఆకట్టుకుంది!
4. నడపడానికి సులభం
హీరో స్ల్పెండర్ సిరీస్ బైక్ని నడపడం, హ్యాండిల్ చేయడం చాలా సులభం. దీని తక్కువ బరువు, తక్కువ సీటు ఎత్తు కారణంగా, ఈ మోటార్సైకిళ్లు అనేక రకాల రైడర్లకు అనుకూలంగా ఉంటాయి. అలాగే, రద్దీ ట్రాఫిక్ పరిస్థితుల్లో కూడా సులభంగా నడపడానికి వీలుగా ఉంటుంది.
5. ఇబ్బంది లేని ఆఫ్టర్సేల్స్ సపోర్ట్
ఏదైనా వాహన యజమానికి, మొత్తం యాజమాన్య అనుభవాన్ని నిర్వచించడంలో ఆఫ్టర్సేల్స్ సపోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. హీరో మోటోకార్ప్ భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉంది. దేశవ్యాప్తంగా, మారుమూల ప్రాంతాలలో కూడా విస్తృతమైన సర్వీస్ నెట్వర్క్ను కలిగి ఉంది. దీనివల్ల హీరో స్ల్పెండర్ యజమానులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆఫ్టర్సేల్స్ సేవను పొందుతారు. విడిభాగాలు చౌక ధరలకు సులభంగా అందుబాటులో ఉంటాయి. సర్వీసింగ్ కూడా చాలా సులువుగా ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


