భారత ఆటోమొబైల్ రంగాన్ని తీవ్రంగా ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ చక్రం తిప్పేందుకు సిద్ధమైంది. సగటు భారత వినియోగదారుడి బడ్జెట్కి అందుబాటులో ఉండేలా, సరికొత్త సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ ఎస్యూవీని 2026 చివరి త్రైమాసికం (క్యూ4)లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా ఈ వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు.
భారతీయ రోడ్లకు తగినట్లుగా..
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకోకుండా, పూర్తిగా భారతీయ కస్టమర్ల అవసరాలు, స్థానిక రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. భారత మార్కెట్లో దూసుకుపోతున్న టాటా పంచ్ ఈవీ వంటి మైక్రో ఎస్యూవీల విభాగానికి గట్టి పోటీ ఇచ్చేలా దీని ధరను నిర్ణయించనున్నారు. హ్యుందాయ్ విక్రయిస్తున్న క్రెటా ఈవీ కంటే దిగువ స్థానంలో ఈ మోడల్ నిలవనుంది.
సాంకేతికపరంగా ఈ ఎలక్ట్రిక్ కారులో హ్యుందాయ్ సరికొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ‘ప్లియోస్’ టెక్నాలజీని అందిస్తోంది. దీనికి తోడు ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచే లెవల్-2 అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ను ఇందులో అమర్చనున్నారు. భద్రతకు, డ్రైవింగ్ అనుభవానికి ప్రాధాన్యమిచ్చే నేటి యువతరానికి ఈ ఫీచర్లు బాగా ఆకట్టుకోనున్నాయి.
2030 నాటికి 26 కొత్త మోడళ్లు.. క్రెటా హైబ్రిడ్ కూడా!
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ రాక హ్యుందాయ్ సుదీర్ఘ వ్యూహంలో ఒక భాగం మాత్రమే. 2030 నాటికి భారత్లో 26 కొత్త కార్లు/ అప్డేటెడ్ మోడళ్లను ప్రవేశపెట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జాబితాలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎక్స్టెండెడ్ రేంజ్ ఈవీ రకాలు ఉన్నాయి.
భారత్లో విపరీతమైన ఆదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా తదుపరి తరం (నెక్ట్స్ జనరేషన్) మోడల్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ కొత్త క్రెటాలో పవర్ ఫుల్ 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఇంజిన్ ఆప్షన్ను ప్రవేశపెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది. అంతర్జాతీయ విపణిలో సక్సెస్ అయిన ‘బేయన్’ మోడల్ను కూడా వెన్యూ, క్రెటాల మధ్య రీ-పొజిషన్ చేస్తూ భారత మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
భారత్ను గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్గా మార్చే వ్యూహం..
{{/usCountry}}భారత్లో విపరీతమైన ఆదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా తదుపరి తరం (నెక్ట్స్ జనరేషన్) మోడల్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ కొత్త క్రెటాలో పవర్ ఫుల్ 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఇంజిన్ ఆప్షన్ను ప్రవేశపెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది. అంతర్జాతీయ విపణిలో సక్సెస్ అయిన ‘బేయన్’ మోడల్ను కూడా వెన్యూ, క్రెటాల మధ్య రీ-పొజిషన్ చేస్తూ భారత మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
భారత్ను గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్గా మార్చే వ్యూహం..
{{/usCountry}}భారత తయారీ సామర్థ్యంపై హ్యుందాయ్ గట్టి నమ్మకం ఉంచింది. 2030 నాటికి భారతదేశంలో తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 3.20 లక్షల యూనిట్లు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏటా 11 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తున్న ఈ ప్లాంట్ల సామర్థ్యం త్వరలోనే మరిన్ని యూనిట్లకు విస్తరించనుంది.
వాహనాల తయారీకి అవసరమైన విడిభాగాలను 90 శాతం వరకు భారత్లోనే స్థానికంగా కొనుగోలు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 1,400 కంటే ఎక్కువ స్థానిక సరఫరాదారులు, 900 మందికి పైగా భారతీయ ఇంజనీర్లతో కంపెనీ ముందుకు సాగుతోంది. ఇక్కడ తయారు చేసిన వాహనాలను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతి చేయనున్నారు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా తమ మొత్తం విక్రయాల్లో 60 శాతం విద్యుత్ వాహనాలే ఉండేలా హ్యుందాయ్ గ్లోబల్ విజన్ను ఖరారు చేసింది.