మధ్యతరగతి వారి కోసం హ్యుందాయ్ వెన్యూలో కొత్త వేరియంట్- ధర, ఫీచర్లు ఇలా..
పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ హ్యుందాయ్ వెన్యూలో సరికొత్త 'హెచ్ఎక్స్5+' వేరియంట్ను కంపెనీ లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారుల బడ్జెట్ను దృష్టిలో ఉంచుకుని, రోజువారీ అవసరాలకు కావాల్సిన ప్రీమియం ఫీచర్లను ఇందులో జోడించారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ రోడ్లపై తిరుగులేని ఆదరణ పొందుతున్న కాంపాక్ట్ ఎస్యూవీ ‘హ్యుందాయ్ వెన్యూ’లో కొత్త వేరియంట్ని కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. దీని పేరు 'హెచ్ఎక్స్5+'. ఇదొక మిడ్-లెవల్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 9.99 లక్షలుగా నిర్ణయించారు. మరీ ఖరీదైన టాప్ ఎండ్ వేరియంట్లు కొనలేక, బేస్ మోడల్లో ఫీచర్లు చాలవనుకునే కస్టమర్ల కోసం హ్యుందాయ్ ఈ ఈ హెచ్ఎక్స్5+ వేరియంట్ని తీసుకుంది.
హ్యుందాయ్ వెన్యూ హెచ్ఎక్స్5+.. ఫీచర్లు, లుక్ అదిరింది!
కొత్త హెచ్ఎక్స్5+ వేరియంట్లో మెకానికల్ మార్పులేవీ లేవు. ఇది సుపరిచితమైన 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్తో, మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది.
అయితే, ఫీచర్ల విషయంలో మాత్రం హ్యుందాయ్ ఎక్కడా తగ్గలేదు.
బయటి వైపు: రూఫ్ రైల్స్, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ దీనికి అగ్రెసివ్ రూపాన్ని ఇస్తున్నాయి. వర్షాకాలంలో వెనుక వైపు స్పష్టంగా కనిపించేలా రియర్ వైపర్, వాషర్ను కూడా ఈ బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీలో ఇచ్చారు.
లోపలి వైపు: కారు లోపల వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జర్ సౌకర్యం ఉంది. అంటే వైర్ల గొడవ లేకుండా, ఫోన్ పెడితే చాలు ఛార్జ్ అయిపోతుంది. వెనుక సీట్లో కూర్చునే వారి కోసం విండో సన్షేడ్స్ అమర్చారు.
- మార్కెట్లోకి కొత్త ఫ్యామిలీ ఎస్యూవీలు- 2026 కియా సెల్టోస్, టాటా సియెర్రాలో ఏది బెస్ట్? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
డ్రైవర్ సౌలభ్యం: డ్రైవింగ్కు మరింత కంఫర్ట్ని ఇచ్చేందుకు స్టోరేజ్తో కూడిన సెంటర్ ఆర్మ్రెస్ట్, ఆటో అప్-డౌన్, సేఫ్టీ ఫంక్షన్తో కూడిన పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఈ హ్యుందాయ్ వెన్యూ కొత్త వేరియంట్లో ఉన్నాయి. ట్రాఫిక్లో ఇవి డ్రైవర్కు ఎంతో రిలీఫ్నిస్తాయి.
హ్యుందాయ్ వెన్యూ హెచ్ఎక్స్4 వేరియంట్లోనూ మార్పులు..
కొత్త వేరియంట్ లాంచ్తో పాటు, వెన్యూలో ఇప్పటికే ఉన్న హెచ్ఎక్స్4 ట్రిమ్లోనూ హ్యుందాయ్ ఒక చిన్న అప్డేట్ చేసింది. ఇప్పుడు ఈ వేరియంట్లో కూడా డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఫీచర్ను చేర్చారు. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
'కస్టమర్ల నుంచి భారీ స్పందన..'
సరికొత్త హ్యుందాయ్ వెన్యూకి మార్కెట్లో ఇప్పటికే మంచి డిమాండ్ ఉంది. "కొత్త వెన్యూకి కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ 50,000 మార్కును దాటేశాయి," అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ క్రేజ్ను దృష్టిలో ఉంచుకునే వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా హెచ్ఎక్స్5+ వేరియంట్ను తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది.
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో మారుతీ సుజుకీ బ్రెజ్జా, కియా సోనెట్, స్కోడా కైలాక్, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, టాటా నెక్సాన్ వంటి దిగ్గజాలతో హ్యుందాయ్ వెన్యూ గట్టిగా తలపడుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


