...
...
Next Story

ఇండియాలో ఆడరా? అయితే ప్రపంచకప్ ఆడకండి- బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ- వరల్డ్ కప్ నుంచి ఔట్- దాని ప్లేస్‌లో స్కాట్లాండ్‌

ఇండియాలో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడలేమన్న బంగ్లాదేశ్ కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. మొత్తం వరల్డ్ కప్ నుంచే ఆ జట్టును తొలగించింది. బంగ్లా ప్లేస్ లో స్కాట్లాండ్ కు అవకాశం కల్పించింది.

Published on: Jan 24, 2026, 18:02:41 IST
Advertisement

అర్థం లేని వాదనతో మొండి పట్టు పట్టిన బంగ్లాదేశ్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ టీమ్ ను టీ20 ప్రపంచకప్ టోర్నీ నుంచి తొలగిస్తూ ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. 2026 టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతుందని ఐసీసీ తేల్చేసింది.

బంగ్లాదేశ్ ఔట్

బంగ్లాదేశ్ టీమ్ (AFP )
బంగ్లాదేశ్ టీమ్ (AFP )

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం (జనవరి 24) తొలగించింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ కు వెళ్లడానికి బంగ్లాదేశ్ జట్టు నిరాకరించడమే దీనికి కారణం. బుధవారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కు తుది నిర్ణయం తీసుకోవడానికి ఐసీసీ 24 గంటల సమయం ఇచ్చింది. కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ భారత్ కు ప్రయాణించడం సాధ్యం కాదన్నారు.

స్కాట్లాండ్ టీమ్

గురువారం బంగ్లాదేశ్ చివరి ప్రయత్నం చేసినా అది విఫలమైంది. దీంతో టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ను తప్పించి, ఆ స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చింది ఐసీసీ. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ నుంచి ఒక క్రికెట్ జట్టును తొలగించడం ఇదే తొలిసారి.

"భారత్ కు ప్రయాణించడానికి నిరాకరించిన తర్వాత ఆ టీమ్ ను టోర్నమెంట్ నుంచి తొలగించినట్లు బీసీబీకి ఐసీసీ లెటర్ పంపింది. స్కాట్లాండ్ ను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసినట్లు వారికి కూడా సమాచారం అందించారు. లాంఛనాలు పూర్తయ్యాయి" అని ఐసీసీ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు ధృవీకరించాయి.

అసలు ఏమైందంటే?

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీ20 ప్రపంచకప్ గ్రూప్ సిలో ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ, వెస్టిండీస్ తో కలిసి బంగ్లాదేశ్ ఉంది. ఆ టీమ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీతో మ్యాచ్ లు ఆడాల్సింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ స్థానంలో ఆ గ్రూప్ లో స్కాట్లాండ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7న స్టార్ట్ కానుంది. దీనికి ఇండియా, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks