ఐసీసీ మాజీ మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్.. బీసీసీఐ, టీమిండియాపై సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అతను తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ మ్యాచ్ లో టీమిండియాకు స్లో ఓవర్ రేట్ కారణంగా విధించాల్సిన ఫైన్ ను తప్పించాలని తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని వెల్లడించాడు. ఆ సమయంలో నిబంధనల అమలులో క్రికెట్ రాజకీయాల పాత్రను ఇది ఎత్తి చూపిందని బ్రాడ్ అన్నాడు.
స్లో ఓవర్ రేట్

ది టెలిగ్రాఫ్ తో మాట్లాడుతూ టీమిండియా స్లో ఓవర్ రేట్ ను సర్దుబాటు చేయాల్సి వచ్చిందని క్రిస్ బ్రాడ్ చెప్పాడు. ఆ మ్యాచ్ ఏది అన్నది తెలపలేదు. కానీ ఆ మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ నిర్దిష్ఠ సమయం లోపు మూడు లేదా నాలుగు ఓవర్లు వెనుకబడి ఉందని బ్రాడ్ అన్నాడు. అప్పుడు రూల్స్ ప్రకారం ఫైన్ వేయాల్సిందని చెప్పాడు.
ఫోన్ కాల్
తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని క్రిస్ బ్రాడ్ తెలిపాడు. ‘‘మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇండియాకు ఫైన్ విధించాల్సిన పరిస్థితి. అప్పుడు నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. చూసి చూడనట్లు వదిలేయండి, ఎందుకంటే ఇది ఇండియా అని చెప్పారు. దీంతో కొంత టైమ్ సర్దుబాటు చేసి నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి అయ్యాయని మార్చాల్సి వచ్చింది’’ అని క్రిస్ బ్రాడ్ ఆరోపించాడు.
మళ్లీ అదే తప్పు
టీమిండియా తర్వాతి మ్యాచ్ లోనూ స్లో ఓవర్ రేట్ తప్పును రిపీట్ చేసిందని క్రిస్ బ్రాడ్ చెప్పాడు. బీసీసీఐ నుంచి వార్నింగ్ ఉన్నప్పటికీ అప్పటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ పట్టించుకోలేదని బ్రాడ్ తెలిపాడు.
"తరువాతి మ్యాచ్ లోనూ సరిగ్గా అదే జరిగింది. అతను [సౌరభ్ గంగూలీ] ఏ హడావిడిని వినలేదు. కాబట్టి నేను ఫోన్ చేసి 'నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అడిగా. అప్పుడు అతను ‘మీకు కాల్ చేసిన వ్యక్తికి చేయండి’ అని అన్నాడు. మొదటి నుండి క్రికెట్లో రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కుర్రాళ్లు రాజకీయంగా మరింత తెలివితేటలు కలిగి ఉన్నారు’’ అని బ్రాడ్ పేర్కొన్నాడు.
ఐసీసీని స్వాధీనం
{{/usCountry}}"తరువాతి మ్యాచ్ లోనూ సరిగ్గా అదే జరిగింది. అతను [సౌరభ్ గంగూలీ] ఏ హడావిడిని వినలేదు. కాబట్టి నేను ఫోన్ చేసి 'నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అడిగా. అప్పుడు అతను ‘మీకు కాల్ చేసిన వ్యక్తికి చేయండి’ అని అన్నాడు. మొదటి నుండి క్రికెట్లో రాజకీయాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది కుర్రాళ్లు రాజకీయంగా మరింత తెలివితేటలు కలిగి ఉన్నారు’’ అని బ్రాడ్ పేర్కొన్నాడు.
ఐసీసీని స్వాధీనం
{{/usCountry}}‘‘బీసీసీఐకి డబ్బులున్నాయి. ఇప్పుడు ఐసీసీని అనేక విధాలుగా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు నేను ఆ బాధ్యతల్లో లేనందుకు సంతోషిస్తున్నా. గతంలో చాలా రాజకీయాలు చూశా’’ అని బ్రాడ్ ఆరోపించాడు. ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్ గా జై షా ఉన్న సంగతి తెలిసిందే. ఐసీసీ రిఫరీగా తన కెరీర్ లో 123 టెస్టులను పర్యవేక్షించిన బ్రాడ్.. చివరగా 2024లో బాధ్యతలు నిర్వర్తించాడు.