...
...
Next Story

ఐటీఆర్‌ ఆలస్యమైతే పడే 5 రకాల పెనాల్టీలు ఇవే.. జులై 31 ముందే ఫైల్ చేయండి

అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు జులై 31తో గడువు ముగుస్తోంది. సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆలస్య రుసుముతో పాటు పలు జరిమానాలు పడే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన పెనాల్టీల వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Jul 24, 2026, 11:58:40 IST
Advertisement

ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఒకవేళ మీరు ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే వెంటనే అప్రమత్తం కావాల్సిందే. జులై 31 గడువు దాటితే పన్ను చెల్లింపుదారులు ఐదు రకాల ఆర్థిక జరిమానాలు, చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఐటీఆర్‌ ఆలస్యమైతే పడే 5 రకాల పెనాల్టీలు ఇవే.. జులై 31 ముందే ఫైల్ చేయండి
ఐటీఆర్‌ ఆలస్యమైతే పడే 5 రకాల పెనాల్టీలు ఇవే.. జులై 31 ముందే ఫైల్ చేయండి

ప్రతి ఏటా జులై చివరి వారంలో ఐటీ శాఖ పోర్టల్ పై రద్దీ విపరీతంగా పెరుగుతుంది. సకాలంలో ఫైలింగ్ పూర్తి చేయకపోవడం, తప్పుడు వివరాలు నమోదు చేయడం లేదా వివరాలను దాచిపెట్టడం వల్ల అదనపు ఆర్థిక భారం పడుతుంది. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27కు సంబంధించి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఆ 5 పెనాల్టీల వివరాలు పరిశీలిద్దాం.

పన్ను చెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన పెనాల్టీలు

లేట్ ఫైలింగ్ ఫీజు (Late Filing Fee): నిర్దేశిత గడువు జులై 31 దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఆలస్య రుసుము కట్టాల్సి వస్తుంది.

రివైజ్డ్ రిటర్న్ ఛార్జీలు: దాఖలు చేసిన రిటర్నుల్లో పొరపాట్లను సరిదిద్దుకునే క్రమంలో ఆలస్యమైతే లేదా నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత మార్పులు చేస్తే అదనపు ఫీజులు పడతాయి.

ఆదాయాన్ని దాచిపెడితే జరిమానా (Misreporting Penalty): వాస్తవ ఆదాయాన్ని తగ్గించి చూపించినా లేదా తప్పుడు లెక్కలు వెల్లడించినా పన్ను మొత్తంలో 50 శాతం నుంచి 200 శాతం వరకు భారీ పెనాల్టీ విధిస్తారు.

పన్ను బకాయిలపై వడ్డీ: చెల్లించాల్సిన పన్ను బకాయిలను గడువులోగా కట్టకపోతే, చట్టబద్ధమైన వడ్డీ రేట్ల ప్రకారం అదనపు భారం పడుతుంది.

రిటర్నుల దాఖలు ప్రక్రియ వేగంగా సాగుతోందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. "AY 2026-27 కు సంబంధించి ఇప్పటివరకు 3 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. కేవలం ఒక్కరోజే 15 లక్షలకు పైగా రిటర్నులు వచ్చాయి. చివరి నిమిషం వరకు ఆగకుండా వెంటనే మీ ఫైలింగ్ పూర్తి చేయండి" అని ఐటీ శాఖ తమ అధికారిక 'ఎక్స్' (X) ఖాతా ద్వారా వెల్లడించింది.

చివరి నిమిషం దాకా ఆగకండి

చివరి రోజుల్లో ఐటీఆర్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆఖరి క్షణం వరకు వేచి చూడకుండా ముందే ఫైల్ చేయడం శ్రేయస్కరం. ముందస్తుగా ఫైలింగ్ పూర్తి చేయడం వల్ల పొరపాట్లను సరిచూసుకునే సమయం దొరుకుతుంది. అంతేకాకుండా రీఫండ్‌లు కూడా త్వరగా ఖాతాల్లో జమ అవుతాయి. ఏవైనా సందేహాలుంటే పన్ను నిపుణులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్లను సంప్రదించి సరైన వివరాలతో రిటర్నులు దాఖలు చేయడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe