ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డేలో టీమిండియాకు షాక్ తప్పలేదు. కంగారూ గడ్డపై మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఓటమితో మొదలెట్టింది భారత్. ఆదివారం పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులే చేసింది. ఛేజింగ్ లో ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది.
హెడ్ ఔటైనా

ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే టీమిండియా కు హెడెక్ గా మారుతాడు ఓపెనర్ హెడ్. కానీ ఈ మ్యాచ్ లో అతణ్ని 8 పరుగులకే అర్ష్ దీప్ ఔట్ చేశాడు. కానీ మరో ఎండ్ లో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్) పాతుకుపోయాడు. మాథ్యూ షార్ట్ (8)ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు.
ఫిలిప్ తో కలిసి
హెడ్, షార్ట్ తక్కువ పరుగులే చేసి ఔటైనా మిచెల్ మార్ష్ మాత్రం వికెట్ ఇవ్వలేదు. జోష్ ఫిలిప్ (37)తో కలిసి టీమ్ ను విజయం దిశగా నడిపించాడు. ఈ పార్ట్ నర్ షిప్ భారత్ కు మ్యాచ్ ను దూరం చేసింది. ఫిలిప్ ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేసినా అప్పటికే లేట్ అయింది. మ్యాట్ రెన్ షా (21 నాటౌట్)తో కలిసి మ్యాచ్ ముగించాడు మార్ష్.
బ్యాటింగ్ ఫెయిల్యూర్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31) పోరాడారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 26 ఓవర్లకు కుదించారు. హేజిల్ వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ కునెమన్ రెండేసి వికెట్ల చొప్పున సాధించారు.
ఈ మ్యాచ్ తో విశాఖ పట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి వన్డేల్లోనూ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్. రోహిత్ (8)తో పాటు కోహ్లి (0) కూడా ఈ మ్యాచ్ లో నిరాశపరిచారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ లో జరుగుతుంది.
ఫ్యాన్స్ ఫైర్
{{/usCountry}}ఈ మ్యాచ్ తో విశాఖ పట్నం కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి వన్డేల్లోనూ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇది 500వ ఇంటర్నేషనల్ మ్యాచ్. రోహిత్ (8)తో పాటు కోహ్లి (0) కూడా ఈ మ్యాచ్ లో నిరాశపరిచారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ లో జరుగుతుంది.
ఫ్యాన్స్ ఫైర్
{{/usCountry}}ఆస్ట్రేలియాతో ఓటమి కంటే కూడా చిత్తుగా పరాజయం పాలవడం టీమిండియా ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. అందుకే ఇదేం ఆట అంటూ టీమ్ పై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫెయిల్ కావడంతో ట్రోల్ చేస్తున్నారు.