...
...
Next Story

ఇండియా, సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దు.. పొగ మంచు దెబ్బకు టాస్ కూడా వేయకుండానే..

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ కనీసం టాప్ కూడా పడకుండానే రద్దయింది. లక్నోలో విపరీతమైన పొగ మంచు కారణంగా అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో ఇండియా ఇప్పటికీ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.

Published on: Dec 17, 2025, 21:46:18 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

లక్నోలోని ఏకానా స్టేడియంలో జరగాల్సిన ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20 మ్యాచ్.. పొగమంచు కారణంగా రద్దయింది. కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మరోవైపు ప్రాక్టీస్ సమయంలో గాయం కారణంగా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు.

నాలుగో టీ20కి పొగ మంచు దెబ్బ

ఇండియా, సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దు.. పొగ మంచు దెబ్బకు టాస్ కూడా వేయకుండానే.. (PTI)
ఇండియా, సౌతాఫ్రికా నాలుగో టీ20 రద్దు.. పొగ మంచు దెబ్బకు టాస్ కూడా వేయకుండానే.. (PTI)

లక్నో స్టేడియంలో మ్యాచ్ చూద్దామని వచ్చిన ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ పొగమంచు కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దవడం చాలా మందిని అసహనానికి గురి చేసింది.

షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేసి, 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ చేయాలి. కానీ మైదానాన్ని మంచు దుప్పటి కప్పేయడంతో అది సాధ్యం కాలేదు. మ్యాచ్ అఫీషియల్స్ మ్యాచ్ జరిపించడానికి చాలా ప్రయత్నాలు చేశారు.

పరిస్థితిని సమీక్షించడానికి సాయంత్రం 6:50 నుంచి మొదలుపెట్టి.. 7:30, 8:00, 8:30, 9:00.. ఇలా చాలాసార్లు గ్రౌండ్‌ను చెక్ చేశారు. చివరికి 9:25 గంటలకు ఫైనల్ ఇన్‌స్పెక్షన్ జరిపాక మ్యాచ్‌ను రద్దు చేశారు.

రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఐసీసీ రూల్స్ ప్రకారం.. వర్షం లేదా మంచు వల్ల మ్యాచ్ కుదించాల్సి వస్తే, కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్ అయినా జరగాలి. దీనికోసం రాత్రి 9:46 గంటల లోపు మ్యాచ్ స్టార్ట్ అవ్వాలి. కానీ 9:25కి కూడా విజిబిలిటీ క్లియర్‌గా లేకపోవడంతో, ప్లేయర్స్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

గిల్ ఔట్.. సంజూకి ఛాన్స్?

గిల్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. అయితే ఈ మ్యాచ్ రద్దు కావడంతో డిసెంబర్ 19న జరిగే చివరి మ్యాచ్ వరకు సంజూ వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఐదు టీ20ల సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్ గెలవాలంటే చివరి మ్యాచ్ లోనూ టీమిండియా కచ్చితంగా గెలవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe