...
...
Next Story

IND vs AUS : విరాట్​ కోహ్లీ రిటైర్​ అయిపోతున్నాడా? ఆ ‘గుడ్​బై’కి అర్థం అదేనా?

ఆస్ట్రేలియాలో జరుగుతున్న వన్డే సిరీస్​లో విరాట్​ కోహ్లీ మళ్లీ డకౌట్​ అయ్యాడు! రెండో వన్డేలో 4 బంతులు ఆడి వెనుదిరిగాడు. ఫలితంగా ఇప్పుడు వన్డేల నుంచి కూడా కోహ్లీ రిటైర్మెంట్​పై ఊహాగానాలు మొదలయ్యాయి.

Published on: Oct 23, 2025, 12:03:11 IST
Advertisement

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలోనూ పేలవ ప్రదర్శన చేసి ఫ్యాన్స్​కి షాక్​ ఇచ్చాడు విరాట్​ కోహ్లీ. అయితే, ఔటైన తర్వాత కోహ్లీ చేసిన పని ఇప్పుడు అతని ఫ్యాన్స్​కి మరింత ఆందోళన కలిగిస్తోంది! అంతేకాదు సోషల్​ మీడియాలో విరాట్​ కోహ్లీ రిటైర్మెంట్​ అనే టాపిక్​ ఇప్పుడు వైరల్​గా మారింది.

అసలేం జరిగింది?

విరాట్​ కోహ్లీ
విరాట్​ కోహ్లీ

పెర్త్​ వేదికగా, కొన్ని రోజుల క్రితం జరిగిన మొదటి వన్డేలో డకౌట్​ అయన కోహ్లీపై చాలా ఒత్తిడి ఉంది. రెండో వన్డేలో అతను చెలరేగుతాడని అందరు అనుకున్నారు. కానీ అడిలైడ్​ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో నాలుగు బంతులాడిన కోహ్లీ డకౌట్​ అయ్యాడు! ఫ్యాన్స్​తో పాటు టీమిండియా అభిమానులందరు షాక్​ అయ్యారు.

జేవియర్​ బార్ట్​లెట్​ బౌలింగ్​లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు కోహ్లీ. అంతేకాదు, విరాట్​ ఇలా వరుసగా రెండుసార్లు డకౌట్​ అవ్వడం, అతని కెరీర్​లోనే మొదటిసారి!

ఆ తర్వాత కోహ్లీ పెవీలియన్​వైపు నడిచాడు. అడిలైడ్​లో కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్​ అవ్వొచ్చు అన్న ఊహాగానాల మధ్య అక్కడి ప్రేక్షకులు “కోహ్లీ, కోహ్లీ” అంటూ అరిచారు. దానికి కోహ్లీ తన గ్లోవ్స్​ని పైకి చూపిస్తూ, పెవీలియన్​వైపు వెళ్లాడు. ఇప్పుడు ఇది హాట్​ టాపిక్​గా మారింది. ఇప్పటికే టెస్టులు, టీ20లకు గుడ్​బై చెప్పిన రన్​ మెషిన్​.. ఆస్ట్రేలియాతో పేలవ ప్రదర్శన అనంతరం వన్డేల నుంచి కూడా తప్పుకుంటాడా? అన్న సందేహాలు మొదలయ్యయి.

ఈ విషయంపై సోషల్​ మీడియాలో ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది.

“ఓహ్​ గాడ్​! ఈ కోహ్లీ ఒకప్పటి కోహ్లీలా లేడు! ఇంత అస్పష్టంగా తన కెరీర్​లో ఎప్పుడూ లేడు. ఆస్ట్రేలియాలో అడుగుపెటటిన ప్రతిసారీ, ఒక గొప్ప ఎనర్జీ, ఫైర్​తో కనిపించేవాడు. అదేదీ ఇప్పుడు కనిపించడం లేదు. అడిలైడ్​ క్రౌడ్​ని చూసి అలా చేశాడు(గ్లౌజ్​ ఎత్తడం). ఇది దేనికైనా హింట్​ ఆ?” అని మరొకరు రాసుకొచ్చారు.

ఎదురీదుతున్న టీమిండియా..

మరోవైపు, 3 మ్యాచ్​ల సిరీస్​లోని మొదటి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. రెండో వన్డేలో ఎదురీదుతోంది. ప్రస్తుతం 38 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 180 పరుగుల వద్ద ఉంది. కెప్టెన్​ శుభ్​మాన్​ గిల్​ 9 పరుగులకే ఔట్​ అయ్యాడు. రోహిత్​ శర్మ.. తన సత్తాని చాటుతూ 73 రన్స్​ చేశాడు. శ్రేయాస్​ అయ్యార్​ 61 పరుగులు చేసి ఔట్​ అయ్యాడు. కోహ్లీ, అక్సర్​ పటేల్​, కేఎల్​ రాహుల్​లు ఆకట్టుకోలేకపోయారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe