పశ్చిమాసియాలో (West Asia) రాజుకున్న ఉద్రిక్తతలు ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్ దిగ్గజాల పోర్ట్ఫోలియోలను కుదిపేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం దలాల్ స్ట్రీట్లోని మార్క్యూ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. 'మింట్' (Mint) నిర్వహించిన విశ్లేషణ ప్రకారం, డిసెంబర్ 31, 2025 నుంచి మార్చి 13, 2026 మధ్య కాలంలో దేశంలోని పలువురు ప్రముఖ ఇన్వెస్టర్ల సంపద వేగంగా ఆవిరైంది.

ఫిబ్రవరి 27 నుంచి పశ్చిమాసియాలో పరిస్థితులు విషమించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఏకంగా 8 శాతం పైగా పతనం కావడం మార్కెట్ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కేవలం అగ్రశ్రేణి షేర్లే కాకుండా, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 7 నుంచి 8 శాతం మేర కోతకు గురయ్యాయి.
నష్టాల్లో అగ్రస్థానంలో ఉన్నవారు వీరే..
ఈ విశ్లేషణలో రూ. 1,000 కోట్లకు పైగా పోర్ట్ఫోలియో విలువ ఉండి, కంపెనీల్లో 1 శాతం కంటే ఎక్కువ వాటా కలిగిన ఇన్వెస్టర్లను పరిగణనలోకి తీసుకున్నారు.
- హేమేంద్ర కొఠారీ: ఈయన పోర్ట్ఫోలియో అత్యధికంగా 22 శాతం పైగా నష్టపోయింది. డిసెంబర్ చివరిలో ఉన్న విలువతో పోలిస్తే మార్చి మధ్య నాటికి ఇది రూ. 4,697 కోట్లకు పడిపోయింది.
- మధుసూదన్ కేలా: ఈయన పెట్టుబడుల విలువ 21.8 శాతం క్షీణించి రూ. 1,629 కోట్లకు చేరింది.
- ఆశిష్ ధావన్ & పరేష్ పరేఖ్: వీరిద్దరి పోర్ట్ఫోలియోలు చెరో 20.8 శాతం మేర నష్టపోయాయి.
- ఇతరులు: ఆకాష్ భన్సాలీ, నెమిష్ షా పోర్ట్ఫోలియోలు 18 శాతం పైగా తగ్గగా, ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా 15 శాతం నష్టాన్ని చవిచూశారు. విజయ్ కేడియా పోర్ట్ఫోలియో కూడా సుమారు 9.7 శాతం క్షీణించింది.
క్రూడ్ ఆయిల్, సప్లై చైన్ దెబ్బ
ఈ పతనానికి ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది.
{{/usCountry}}ఈ పతనానికి ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది.
{{/usCountry}}హేమేంద్ర కొఠారీకి వాటా ఉన్న 'ఆల్కైల్ అమైన్స్ కెమికల్స్' వంటి సంస్థలు పెట్రోకెమికల్ ముడిసరుకుపై ఆధారపడతాయి.
ఆశిష్ ధావన్ పెట్టుబడులు ఉన్న 'AGI గ్రీన్పాక్' వంటి సంస్థలకు ఇంధన, రవాణా ఖర్చులు పెరిగాయి. ఈ కారణాల వల్ల సదరు షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి.
దమానీ ఒక్కరే సేఫ్
ఈ గందరగోళ పరిస్థితుల్లోనూ డీమార్ట్ (DMart) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ నిలకడగా రాణించారు. ఆయన పోర్ట్ఫోలియో విలువ సుమారు 1 శాతం పెరిగి రూ. 1.7 లక్షల కోట్లకు చేరింది. లార్జ్ క్యాప్ షేర్లలో ఎక్కువగా పెట్టుబడులు ఉండటం ఆయనకు రక్షణ కవచంలా పనిచేసింది.
విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల జోరు
యుద్ధం వల్ల పెరిగిన ద్రవ్యోల్బణం, కరెన్సీ అస్థిరత వంటి కారణాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FPIs) భారత్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 27 నుంచి ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 43,500 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్పై ఒత్తిడిని పెంచింది.
"మార్కెట్లు ప్రస్తుతం ఒక దిద్దుబాటు (Correction) దశలో ఉన్నాయి. ముఖ్యంగా రిస్క్ ఎక్కువగా ఉండే స్మాల్ క్యాప్ నుండి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన లార్జ్ క్యాప్ షేర్లకు మళ్లిస్తున్నారు" అని ఈక్విట్రీ క్యాపిటల్ సీఐఓ పవన్ భరాడియా పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇలాంటి పతనాలు నాణ్యమైన షేర్లను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.