కెనడాలోని వైద్య వ్యవస్థలో ఉన్న లోపాలు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తీవ్రమైన గుండెనొప్పితో విలవిలలాడుతూ ఆస్పత్రికి వెళ్లిన ఒక భారత సంతతి వ్యక్తిని వైద్యులు పట్టించుకోకపోవడంతో, ఎనిమిది గంటల పాటు ఎమర్జెన్సీ వార్డులో నరకయాతన అనుభవించి ఆయన ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన ఎడ్మంటన్లోని 'గ్రే నన్స్ కమ్యూనిటీ హాస్పిటల్'లో చోటుచేసుకుంది.
8 గంటల పాటు మృత్యువుతో పోరాటం

మృతుడిని 44 ఏళ్ల ప్రశాంత్ శ్రీకుమార్గా గుర్తించారు. వృత్తిరీత్యా అకౌంటెంట్ అయిన ప్రశాంత్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత సోమవారం ఆఫీసులో ఉన్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెలో తీవ్రమైన నొప్పి రావడంతో, ఒక క్లయింట్ ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్లిన వెంటనే అక్కడ ప్రాథమిక పరీక్షలు చేసి, ఎమర్జెన్సీ వార్డులో వేచి ఉండమని సిబ్బంది చెప్పారు.
అయితే గంటలు గడుస్తున్నా వైద్యులు ఆయన్ని పట్టించుకోలేదు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ప్రశాంత్కు కేవలం 'టైలెనాల్' (Tylenol) మాత్ర ఇచ్చి సరిపెట్టారని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. వేచి ఉన్న సమయంలోనే ఆయన రక్తపోటు (బిపి) 210కి చేరినప్పటికీ, సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆమె రోదిస్తూ చెప్పారు.
'నాన్నా.. నొప్పి భరించలేకపోతున్నాను'
ప్రశాంత్ తన తండ్రి కుమార్ శ్రీకుమార్తో మాట్లాడిన చివరి మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. "నాన్నా, నేను ఈ నొప్పిని అస్సలు భరించలేకపోతున్నాను" అని తన కొడుకు పదేపదే ఫోన్ లో రోదించాడని కుమార్ వివరించారు. ఈ లోపు ఈసీజీ తీసిన సిబ్బంది.. "ఏమీ పర్వాలేదు, ప్రమాదకరమైనది ఏమీ లేదు.. కొంచెం సేపు ఆగండి" అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
చివరికి ఎనిమిది గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రశాంత్ను చికిత్స కోసం లోపలికి పిలిచారు. కానీ, లోపలికి వెళ్లిన కొన్ని క్షణాలకే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్స అందించే లోపే ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
కుటుంబం దిగ్భ్రాంతి.. ఆస్పత్రి వివరణ
{{/usCountry}}చివరికి ఎనిమిది గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రశాంత్ను చికిత్స కోసం లోపలికి పిలిచారు. కానీ, లోపలికి వెళ్లిన కొన్ని క్షణాలకే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్స అందించే లోపే ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
కుటుంబం దిగ్భ్రాంతి.. ఆస్పత్రి వివరణ
{{/usCountry}}ప్రశాంత్ మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 3, 10, 14 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు తండ్రి లేని వారయ్యారు. "తీవ్రమైన గుండెనొప్పితో వచ్చిన పేషెంట్ను వైద్యుడి వద్దకు తీసుకెళ్లకుండా ఎనిమిది గంటల పాటు ఎలా కూర్చోబెడతారు?" అని కుటుంబ స్నేహితుడు వరీందర్ భుల్లర్ ప్రశ్నించారు. ఇది ఘోరమైన వైఫల్యమని, వైద్య వ్యవస్థపై నమ్మకం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్య సంస్థ 'కోవనెంట్ హెల్త్' స్పందిస్తూ.. గోప్యత కారణాల దృష్ట్యా బాధితుడి కేసు గురించి పూర్తి వివరాలు వెల్లడించలేమని పేర్కొంది. అయితే, ఈ కేసును 'చీఫ్ మెడికల్ ఎగ్జామినర్' కార్యాలయానికి అప్పగించామని, బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది.