...
...
Next Story

ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ.. సామాన్యుడిపై దీని ప్రభావమెంత?

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ శుక్రవారం 91.93 వద్ద సరికొత్త రికార్డు కనిష్టానికి పడిపోయింది. విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు రూపాయిని బలహీనపరిచాయి. ఇంధనం, దిగుమతి వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

Published on: Jan 23, 2026 04:44 PM IST
Advertisement

భారత కరెన్సీ రూపాయి విలువ పతనం ఆగడం లేదు. శుక్రవారం (జనవరి 23) అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 91.93 వద్ద స్థిరపడి, ఆల్‌టైమ్ లో (All-time low) రికార్డు నమోదు చేసింది. కార్పొరేట్లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు విపరీతమైన డిమాండ్ పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPI) నిరంతరం పెట్టుబడులను ఉపసంహరించుకోవడం రూపాయిని కుదిపేస్తున్నాయి.

ఒక్క నెలలోనే 2 శాతం పతనం

ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ.. సామాన్యుడిపై దీని ప్రభావమెంత? (Bloomberg)
ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి విలువ.. సామాన్యుడిపై దీని ప్రభావమెంత? (Bloomberg)

ట్రేడింగ్ మధ్యలో రూపాయి విలువ ఒక దశలో 91.99 వరకు పడిపోయింది. గత బుధవారం నమోదైన 91.74 కనిష్ట స్థాయిని ఇది అధిగమించింది. కేవలం ఒక్క రోజులోనే రూపాయి 0.63 శాతం మేర క్షీణించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రంగంలోకి దిగి ఒడిదుడుకులను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, రూపాయి పతనాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఈ ఒక్క జనవరి నెలలోనే రూపాయి విలువ 2 శాతం పడిపోవడం గమనార్హం.

రూపాయి ఎందుకు పడిపోతోంది?

భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్ (NSDL) గణాంకాల ప్రకారం.. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు ఏకంగా రూ. 31,334 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

దీనితో పాటు అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కూడా రూపాయిని దెబ్బతీస్తున్నాయి. గ్రీన్‌లాండ్, వెనిజులా, రష్యా-ఉక్రెయిన్ వివాదాలతో పాటు అమెరికా విధిస్తున్న వాణిజ్య సుంకాలు (Trade Tariffs) పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

"ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయిపై ఒత్తిడి కొనసాగుతోంది. రానున్న రోజుల్లో రూపాయి 91.35 నుంచి 92.25 శ్రేణిలో కదలాడవచ్చు" అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది విశ్లేషించారు.

ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

రూపాయి పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. శుక్రవారం సెన్సెక్స్ 770 పాయింట్లు క్షీణించి 81,537 వద్ద ముగియగా, నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 25,049 వద్ద స్థిరపడింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe