RR vs PBKS IPL 2026 : ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత విజయాన్ని అందుకుంది. ఛేజింగ్ లో డోనోవన్ ఫెరీరా మెరుపుల దాటికి… పంజాబ్ కింగ్స్ (PBKS) నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ టీమ్ చేధించింది.

ఈ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ను మట్టికరిపించింది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో పంజాబ్ తొలిస్థానంలో ఉండగా.. బెంగళూరు టీమ్ రెండో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్…
ఈ మ్యాచ్ లో చివరి ఆరు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 71 పరుగులు అవసరమైన దశలో డోనోవన్ ఫెరీరా తన విశ్వరూపాన్ని చూపాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతనికి తోడుగా శుభమ్ దూబే (12 బంతుల్లో 31 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో…. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ విజ తీరాలకు చేరింది. డెత్ ఓవర్లలో వీరు ఆడిన తీరు మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
చేతులెత్తేసిన పంజాబ్ బౌలర్లు
పంజాబ్ ప్రధాన బౌలర్లు అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, మార్కో జాన్సెన్లు పెద్దగా రాణించలేకపోయారు. అర్ష్దీప్ సింగ్ తన 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకోగా, లాకీ ఫెర్గూసన్ 57 పరుగులు ఇచ్చాడు. మార్కో జాన్సెన్ సైతం 3.2 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఒకవైపు యుజ్వేంద్ర చాహల్ (4 ఓవర్లలో 3/36) తన అద్భుత స్పిన్తో రాజస్థాన్ను కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ…. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో అతని శ్రమ వృథా అయింది.
సూర్యవంశీ మెరుపులు.. జైస్వాల్ ఫిఫ్టీ
లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 16 బంతుల్లోనే 5 సిక్సర్లతో 43 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను వణికించాడు. అర్ష్దీప్, ఫెర్గూసన్ బంతులను ఫ్లిక్ చేస్తూ అతను బాదిన సిక్సర్లు గ్యాలరీలో పడ్డాయి.
{{/usCountry}}లక్ష్య ఛేదనలో రాజస్థాన్కు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 16 బంతుల్లోనే 5 సిక్సర్లతో 43 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లను వణికించాడు. అర్ష్దీప్, ఫెర్గూసన్ బంతులను ఫ్లిక్ చేస్తూ అతను బాదిన సిక్సర్లు గ్యాలరీలో పడ్డాయి.
{{/usCountry}}మరోవైపు యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 51) బాధ్యతాయుతమైన అర్థ సెంచరీతో ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ధ్రువ్ జురెల్ (20) అనవసర షాట్కు ప్రయత్నించి అవుట్ కాగా, కెప్టెన్ రియాన్ పరాగ్ (29) కూడా చాహల్ బౌలింగ్లో పెవిలియన్ చేరారు. అయితే ఫెరీరా అటాకింగ్ గేమ్ ముందు ఇవేవీ అడ్డుకాలేదు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ కేవలం 22 బంతుల్లోనే 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ (59), ప్రియాంష్ ఆర్య (29), కూపర్ కొన్నోలీ (30) రాణించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో యంగ్ లెగ్ స్పిన్నర్ యష్ రాజ్ పుంజా (2/41) ఆకట్టుకున్నాడు.