సోషల్ మీడియాలో ఏదైనా వార్త కనిపిస్తే చాలు, అది నిజమో కాదో తెలుసుకోకుండానే వైరల్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. తాజాగా రూ. 500 నోట్ల చలామణిపై కూడా ఇటువంటి ఒక తప్పుడు వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. 2026 మార్చి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 500 నోట్లను ఉపసంహరించుకోబోతోందన్నది ఆ వార్త సారాంశం.
అదంతా ఫేక్.. నమ్మకండి!

ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ అధికారిక విభాగం 'పిఐబి ఫ్యాక్ట్ చెక్' (PIB Fact Check) స్పందించింది. "రూ. 500 నోట్లను నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ఎక్కడా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు, అది పూర్తిగా అవాస్తవం" అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తేల్చి చెప్పింది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500 నోట్లు చట్టబద్ధమైనవని, వాటిని యధావిధిగా లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని ప్రజలను కోరింది.
పాత వీడియోతో తప్పుడు ప్రచారం
నిజానికి ఇలాంటి పుకార్లు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రూ. 500 నోట్ల రద్దుపై పలుమార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానెల్ వీడియోను అడ్డుపెట్టుకుని కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారు. ఆ వీడియోలో ఒక న్యూస్ యాంకర్.. 2026 మార్చి నుంచి నోట్లు రద్దవుతాయని చెప్పడం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఈ వాదనను అప్పట్లోనే కొట్టిపారేసింది.
పార్లమెంటులో ప్రభుత్వం ఏం చెప్పింది?
నోట్ల రద్దుపై వస్తున్న ఊహాగానాలపై గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వివరణ ఇచ్చారు. రూ. 500 నోట్లను నిలిపివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకు ఏటీఎంల ద్వారా రూ. 100, రూ. 200 నోట్లతో పాటు రూ. 500 నోట్లు కూడా యధావిధిగా అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.
పాఠకులకు సూచన: ఆర్థిక అంశాలకు సంబంధించి ఏదైనా వార్త వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేదా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. పుకార్లు సృష్టించే గందరగోళానికి లోనుకావద్దు.
{{/usCountry}}పాఠకులకు సూచన: ఆర్థిక అంశాలకు సంబంధించి ఏదైనా వార్త వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేదా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. పుకార్లు సృష్టించే గందరగోళానికి లోనుకావద్దు.
{{/usCountry}}