Kamakhya Temple Ticket Booking : కామాఖ్య ఆలయ ప్రత్యేక దర్శనం టిక్కెట్లలో మార్పులు - ఇకపై ఆన్లైన్ బుకింగ్ మాత్రమే!
Kamakhya Temple Online Ticket Booking : అస్సాంలోని ప్రసిద్ధ కామాఖ్య ఆలయ ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జూన్ 15, 2026 నుండి ప్రత్యేక దర్శన టిక్కెట్లను కేవలం ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Kamakhya Temple Online Ticket Booking : భారతదేశంలోని అత్యంత పురాతన, అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాలలో ఒకటైన అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఒక ముఖ్యమైన గమనింపు. కామాఖ్య ఆలయ యాజమాన్యం ప్రత్యేక దర్శన టిక్కెట్ల బుకింగ్ విధానంలో కీలక మార్పులను ప్రకటించింది. జూన్ 15, 2026 నుంచి ప్రత్యేక దర్శన టిక్కెట్ల బుకింగ్ కేవలం ఆన్లైన్ మోడ్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆలయ బోర్డు స్పష్టం చేసింది.

ఇప్పటివరకు భక్తులకు అందుబాటులో ఉన్న ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నారు. ఇకపై భక్తులు ప్రత్యేక దర్శనం కోసం కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనికోసం ఆలయ అధికారిక వెబ్సైట్ www.mkdonline.in ద్వారా మాత్రమే భక్తులు తమ ప్రత్యేక దర్శన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, అలాగే క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా గుంపును సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ సరికొత్త డిజిటల్ మార్పును తీసుకువచ్చినట్లు ఆలయ నిర్వాహకులు వివరించారు.
అస్సాం రాజధాని గౌహతి సమీపంలోని నీలాచల్ పర్వతంపై కొలువై ఉన్న కామాఖ్య క్షేత్రం దేశవ్యాప్తంగా అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కాళికా పురాణంతో పాటు పలు పురాణ గ్రంథాల ప్రకారం.. మాతా సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞంలో జరిగిన అవమానాన్ని భరించలేక తన శరీరాన్ని త్యాగం చేసింది. ఆ సమయంలో ఆగ్రహోదగ్రుడైన శివుడు సతీదేవి మర్త్య దేహాన్ని భుజాలపై వేసుకుని ప్రళయ తాండవం చేయడం ప్రారంభించాడు. సృష్టిని రక్షించడం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా ఖండించాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలే పవిత్ర శక్తిపీఠాలుగా వెలిశాయి. అందులో సతీదేవి యోని భాగం పడిన నీలాచల్ పర్వత ప్రాంతమే ఈనాటి కామాఖ్య క్షేత్రం. అందుకే ఈ ఆలయానికి 51 శక్తిపీఠాల్లోకెల్లా అత్యున్నతమైన 'మహాపీఠం' అనే హోదా ఉంది.
ఈ ఆలయం యొక్క అత్యంత అద్భుతమైన ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ దుర్గామాత లేదా జగదంబ విగ్రహం రూపంలో దర్శనమివ్వదు. ఆలయ గర్భగుడిలో సహజసిద్ధంగా ఏర్పడిన యోని ఆకారపు రాతి కొలను ఉంటుంది. ఈ కొలనులోంచి నిరంతరం నీరు ప్రవహిస్తూ బయటకు వస్తూ ఉంటుంది. భక్తులు ఈ పవిత్రమైన కొలనుకే పువ్వులు సమర్పించి, జగన్మాత రూపంగా భావించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. నీరు నిరంతరం ఊరుతుండటం వల్ల ఈ భాగం ఎప్పుడూ పువ్వులతో కప్పబడి ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

