KVS admission 2026 : కేంద్రీయ విద్యాలయలో పిల్లల అడ్మిషన్లు- ఈరోజు నుంచే రిజిస్ట్రేషన్, పూర్తి వివరాలు..
KVS online admission : కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి 'బాలవాటిక' ప్రవేశాల షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 20 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ విధానం, అర్హతలు, దరఖాస్తు చేసుకునే పద్ధతిపై పూర్తి స్పష్టత కోసం ఈ కథనం చదవండి.
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ బాలవాటిక అడ్మిషన్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చ్ 20, అంటే నేడు ప్రారభంకానుంది. కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) జారీ చేసిన నోటీసు ప్రకారం, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అధికారిక వెబ్సైట్ admission.kvs.gov.in లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు- ఎంపిక విధానం..
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలు పూర్తిగా లాటరీ పద్ధతి మీద ఆధారపడి ఉంటాయి. దీని కోసం ఎటువంటి రాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు నిర్వహించరు. లాటరీ ప్రక్రియ పూర్తయి, ఫలితాలు వెల్లడైన తర్వాత, ఎంపికైన విద్యార్థులు తమకు కేటాయించిన పాఠశాలల్లో అవసరమైన పత్రాలను సమర్పించి, నిర్ణీత అడ్మిషన్ ఫీజు చెల్లించి ప్రవేశాన్ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత మెరుగుపడుతుంది.
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు- అర్హత ప్రమాణాలు..
దరఖాస్తు చేసుకునే చిన్నారులకు ఈ కింది అర్హతలు ఉండాలి:
సంబంధిత విద్యా సంవత్సరం మార్చి 31 నాటికి బిడ్డకు కనీసం 6 ఏళ్లు నిండి ఉండాలి.
అదే తేదీ నాటికి బిడ్డ వయస్సు 8 ఏళ్ల లోపు ఉండాలి.
ఒకవేళ బిడ్డ ఏప్రిల్ 1వ తేదీన జన్మించినా కూడా అడ్మిషన్కు అర్హులుగా పరిగణిస్తారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వయోపరిమితిలో 2 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చే అవకాశం ఉంది.
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు- దరఖాస్తు చేసే విధానం..
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు ఈ కింది స్టెప్స్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు:
అధికారిక పోర్టల్: ముందుగా kvsangathan.nic.in వెబ్సైట్ను సందర్శించండి.
రిజిస్ట్రేషన్: "New Registration" బటన్పై క్లిక్ చేయండి.
వివరాల నమోదు: బిడ్డ, తల్లిదండ్రుల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.
లాగిన్ కోడ్: వివరాలు సబ్మిట్ చేయగానే ఒక లాగిన్ కోడ్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది.
లాగిన్: ఆ కోడ్ సహాయంతో పోర్టల్లోకి లాగిన్ అవ్వండి.
స్కూళ్ల ఎంపిక: మీకు నచ్చిన 3 కేంద్రీయ విద్యాలయాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోండి.
పత్రాల అప్లోడ్: అడిగిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయండి.
సమర్పణ: అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసిన తర్వాత, భవిష్యత్తు అవసరాల కోసం ఆ ఫారం, కన్ఫర్మేషన్ రసీదును ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు- రిజర్వేషన్ పాలసీ..
ఒకటో తరగతిలో ప్రతి సెక్షన్కు 40 సీట్లు ఉంటాయి. వీటిని ఈ కింది విధంగా కేటాయిస్తారు:
ఆర్టీఈ (విద్యా హక్కు చట్టం): 10 సీట్లు (25%)
ఎస్సీ : 6 సీట్లు (15%)
ఎస్టీ : 3 సీట్లు (7.5%)
ఓబీసీ-ఎన్సీఎల్ (నాన్-క్రీమీ లేయర్): 11 సీట్లు (27%)
ప్రత్యేక అవసరాలు గల వారు : మొత్తం సీట్లలో 3 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు- ప్రాధాన్యతా క్రమం..
తల్లిదండ్రుల ఉద్యోగ స్వభావాన్ని బట్టి అడ్మిషన్లలో ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో క్రమంగా:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.
సాయుధ దళాల సిబ్బంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.
ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల ఉద్యోగులు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ఒకే బిడ్డ కోసం వేర్వేరు కేంద్రీయ విద్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చా?
అవును, ఒకే ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా మీరు గరిష్టంగా 3 వేర్వేరు కేంద్రీయ విద్యాలయాలను ఎంచుకోవచ్చు. అయితే, మీరు నివసించే ప్రాంతానికి దగ్గరగా ఉన్న పాఠశాలలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఎందుకంటే అడ్మిషన్ సమయంలో నివాస ధృవీకరణ పత్రం కీలకంగా మారుతుంది.
2. అడ్మిషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏంటి?
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో, అడ్మిషన్ ఖరారైనప్పుడు ఈ కింది పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి:
జనన ధృవీకరణ పత్రం : వయస్సు నిర్ధారణ కోసం ఇది తప్పనిసరి.
నివాస ధృవీకరణ పత్రం : రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు వంటివి.
రిజర్వేషన్ సర్టిఫికేట్: వర్తిస్తే
సర్వీస్ సర్టిఫికేట్: తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైతే, వారి ప్రస్తుత కార్యాలయం నుంచి ధృవీకరణ పత్రం.
ఫోటో: బిడ్డకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ డిజిటల్ ఫోటో.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


