ఇంకొన్ని రోజుల్లో మహీంద్రా XUV 7XO లాంచ్.. కొనాలా? వద్దా?
కొత్త ఏడాదిలో ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 'XUV 7XO' ని మీ ముందుకు తీసుకొస్తోంది. ఈ ఎస్యూవీకి సంబంధించిన పలు కీలక ఫీచర్స్, ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీరు 2026 జనవరిలో కొత్త ఎస్యూవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మార్కెట్లో మీకు చాలా ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ రీ-ఎంట్రీ ఇస్తోంది. పర్యావరణంపై మక్కువ ఉంటే మారుతీ సుజుకీ నుంచి ‘ఈ విటారా’ ఎలక్ట్రిక్ కారు కూడా వస్తోంది. టాటా సియెర్రా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, హారియర్, సఫారి పెట్రోల్ మోడల్స్ డెలివరీలు కూడా జనవరి నుంచే మొదలుకానున్నాయి.

అయితే, వీటన్నింటి మధ్య మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ ఎక్స్యూవీ 700ని సరికొత్త హంగులతో 'ఎక్స్యూవీ 7ఎక్స్ఓ' పేరుతో లాంచ్ చేస్తోంది. మునుపటి కంటే మెరుగైన డిజైన్, లగ్జరీ ఇంటీరియర్స్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లతో ఇది రాబోతోంది. మరి ఈ కారు కొనాలా? వద్దా? కొన్ని కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ- సరికొత్త లుక్.. అదిరిపోయే డిజైన్
ఎక్స్యూవీ 7ఎక్స్ఓ చూడటానికి పాత ఎక్స్యూవీ 700 మాదిరిగానే ఉన్నప్పటికీ, దీని ఎక్స్టీరియర్లో కీలక మార్పులు చేశారు. మహీంద్రా అప్ కమింగ్ ఎలక్ట్రిక్ కార్ల డిజైన్ శైలిని దీనికి జోడించారు. ముఖ్యంగా కొత్త ఎల్ఈడీ లైటింగ్ యూనిట్లు, స్టైలిష్ అలాయ్ వీల్స్తో ఈ కారు మరింత ఫ్రెష్గా కనిపించనుంది.
మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ- లగ్జరీ ఇంటీరియర్.. మూడు స్క్రీన్ల మ్యాజిక్!
ఈ మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ కారు లోపల అడుగుపెడితే మీకు ఒక ప్రీమియం ఫీలింగ్ కలుగుతుంది. డ్యాష్బోర్డ్పై ఏకంగా మూడు స్క్రీన్లు ఉంటాయి. డ్రైవర్, మధ్యలో ఉండే ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్తో పాటు పక్కన కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో స్క్రీన్ను కేటాయించారు.
బాస్ మోడ్: ఈ ఎస్యూవీ వెనుక సీట్లో కూర్చునే వారు తమకు కావలసినంత లెగ్రూమ్ కోసం ముందు సీట్లను ఎలక్ట్రికల్ బటన్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
మౌంటింగ్ పాయింట్లు: వెనుక ప్యాసింజర్ల కోసం తమ సొంత స్క్రీన్లను అమర్చుకునేలా 'బీవైఓడీ' (బ్రింగ్ యువర్ ఓన్ డిస్ప్లే) సదుపాయం కల్పించారు.
కొత్త స్టీరింగ్: టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మీద మహీంద్రా లోగో వెలుగుతూ అద్భుతంగా ఉంటుంది.
మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ- అదిరిపోయే ఫీచర్లు.. భద్రతలో మేటి
వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి సౌకర్యాలతో పాటు ఈ మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీలో భద్రతకు పెద్దపీట వేశారు.
అడాస్ లెవల్ 2: మరింత సురక్షితమైన డ్రైవింగ్ కోసం లెవల్ 2 అడాస్ (అడాస్) ప్యాకేజీని అందించే అవకాశం ఉంది.
540-డిగ్రీ కెమెరా: కారు చుట్టూ ఏముందో 360 డిగ్రీల కంటే మెరుగ్గా, అంటే 540-డిగ్రీల వ్యూతో స్క్రీన్ పై చూడవచ్చు! ఇది డ్రైవింగ్ను మరింత సులభతరం చేస్తుంది.
| కేటగిరీ | వివరాలు |
|---|---|
| ఇంజిన్లు | 2.0లీటర్ టర్బో పెట్రోల్, 2.2లీర్ డీజిల్ |
| పవర్ | పెట్రోల్ 197 హెచ్పీ, డీజిల్ 182 హెచ్పీ |
| టార్క్ | పెట్రోల్ 380 ఎన్ఎం, డీజిల్ 450 ఎన్ఎం |
| ట్రాన్స్మిషన్ | 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ |
| డ్రైవ్ట్రైన్ | ఎఫ్డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ |
| ఎక్స్టీరియర్ మార్పులు | కొత్త గ్రిల్, రివైజ్డ్ బంపర్, కొత్త డ్యూయెల్ బ్యారెల్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, అప్డేటెడ్ టెయిల్ ల్యాంప్స్ |
| వీల్స్ | కొత్త అలాయ్ వీల్స్ డిజైన్ |
| ఇంటీరియర్ | ట్రిపుల్ స్క్రీన్ సెటప్, వెంటిలేటెడ్ సెకెండ్ రో కెప్టెన్ సీట్స్, హర్మన్ కార్డాన్ డాల్బీ అట్మోస్ ఆడియో, బాస్ మోడ్ |
| టెక్ అండ్ సేఫ్టీ | లెవల్ 2 అడాస్, సెల్ఫ్ పార్కింగ్ ఫీచర్, ఫ్రెంట్ పార్కింగ్ సెన్సార్ |
| సీటింగ్ ఆప్షన్స్ | 5 లేదా 7 |
| ఫ్యుయెల్ టైప్ | పెట్రోల్, డీజిల్ |
మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ- ఇంజిన్ పవర్ సేమ్..
ఈ మహీంద్రా ఎక్స్యూవీ 700 ఫేస్లిఫ్ట్లో మెకానికల్ పరంగా పెద్ద మార్పులు లేవు. 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లనే ఇందులోనూ కొనసాగిస్తున్నారు. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్బాక్స్లతో వస్తాయి. డీజిల్ వెర్షన్లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.
ధర- బుకింగ్స్: మహీంద్రా ఎక్స్యూవీ 7ఎక్స్ఓ భారతదేశంలో 2026 జనవరి 5న అధికారికంగా లాంచ్ కానుంది. రూ. 21,000 టోకెన్ అమౌంట్తో బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని ధర సుమారు రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.
కొత్త ఏడాదిలో పవర్ ఫుల్ ఎస్యూవీ కావాలనుకునే వారు దీనిపై ఓ లుక్కేయొచ్చు!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


