Vijay TVK Government : తమిళనాడు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉత్కంఠ నెలకొంది. మూడు దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే-ఏఐఏడీఎంకే ద్వంద్వ ఆధిపత్యానికి చెక్ పెడుతూ సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK)కు అధికార పీఠం దక్కే విషయంలో మ్యాజిక్ ఫిగర్ రూపంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన విడుదలైంది.
లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన

గురువారం చెన్నైలోని లోక్ భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో టీవీకే అధినేత విజయ్ భేటీ అయ్యారు. అయితే…. ప్రస్తుతానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు టీవీకేకు లేదని గవర్నర్ వివరించినట్లు ఓ ప్రకటన విడుదలైంది.
"తమిళనాడు శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ మద్దతు ఇప్పటి వరకు నిరూపితం కాలేదు" అని లోక్ భవన్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
తాజా పరిణామంతో విజయ్ వర్గంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ప్రస్తుతం టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా…. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ప్రకటించారు. దీనితో మొత్తం బలం 112కు చేరింది. 234 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ (118) అందుకోవడానికి విజయ్ కూటమికి ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
అసెంబ్లీలో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడిగా తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అనుమతించాలని విజయ్ మరోసారి కోరినట్లు తెలిసింది. ఆ తర్వాత సభలో మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ విజయ్ అభ్యర్థననురెండోసారి కూడా గవర్నర్ తిరస్కరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో 'ప్రోగ్రెస్సివ్ గవర్నమెంట్' (పురోగతి సాధించే ప్రభుత్వం) ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ విజయ్ ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)కు లేఖ రాశారు. దీనిపై సీపీఐ నేత వీరపాండియన్ స్పందిస్తూ…. కీలక వ్యాఖ్యలు చేశారు. "విజయ్ నుంచి మాకు మద్దతు కోరుతూ లేఖ అందింది. దీనిపై చర్చించేందుకు శుక్రవారం అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మద్దతుపై రేపే తుది నిర్ణయం తీసుకుంటాం," అని ఆయన వెల్లడించారు.
{{/usCountry}}రాష్ట్రంలో 'ప్రోగ్రెస్సివ్ గవర్నమెంట్' (పురోగతి సాధించే ప్రభుత్వం) ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ విజయ్ ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI)కు లేఖ రాశారు. దీనిపై సీపీఐ నేత వీరపాండియన్ స్పందిస్తూ…. కీలక వ్యాఖ్యలు చేశారు. "విజయ్ నుంచి మాకు మద్దతు కోరుతూ లేఖ అందింది. దీనిపై చర్చించేందుకు శుక్రవారం అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మద్దతుపై రేపే తుది నిర్ణయం తీసుకుంటాం," అని ఆయన వెల్లడించారు.
{{/usCountry}}