దేశ రాజకీయాల్లో మంగళవారం ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు పెను సంచలనానికి దారితీశాయి. ప్రధానిని ఉద్దేశించి ఆయన 'టెర్రరిస్ట్' అనే పదాన్ని వాడటంతో పాటు, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో జతకట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి.
అన్నాడీఎంకేపై విమర్శల జడివాన

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే తీరును ఖర్గే ఎండగట్టారు. "అన్నాదురై వంటి గొప్ప నేతల ఫోటోలను పెట్టుకునే అన్నాడీఎంకే నేతలు మోదీతో ఎలా కలుస్తారు? ఆయన ఒక ఉగ్రవాది. ఆయన పార్టీకి సమానత్వం, న్యాయంపై అస్సలు నమ్మకం లేదు. అటువంటి వారితో చేతులు కలపడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే" అని ఖర్గే నిప్పులు చెరిగారు. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటంలో అన్నాడీఎంకే విఫలమైందని, ఆ పార్టీ ఇప్పుడు బీజేపీకి ఒక మూగ బానిసగా మారిపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. బీజేపీ ముందు తలవంచకుండా పోరాడే నాయకత్వం ఒక్క ఎంకే స్టాలిన్కే ఉందని ఆయన కొనియాడారు.
తన వ్యాఖ్యలపై వివరణ
మోదీని టెర్రరిస్ట్ అని పిలవడంపై సర్వత్రా విమర్శలు రావడంతో ఖర్గే వెంటనే స్పందిస్తూ వివరణ ఇచ్చారు. తాను ప్రధానిని నేరుగా ఉగ్రవాది అని అనలేదని, ఆయన ఎప్పుడూ ప్రజలను, విపక్షాలను భయపెడతారనే ఉద్దేశంతో ఆ పదాన్ని వాడానని చెప్పుకొచ్చారు. "మోదీ ఎప్పుడూ బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఈడీ, ఐటీ, సీబీఐ వంటి కేంద్ర సంస్థలన్నీ ఆయన కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనను కూడా తన చేతుల్లోకి తీసుకోవాలని ఆయన చూస్తున్నారు. ఇవన్నీ భయపెట్టే చర్యలే కదా" అని ఖర్గే ప్రశ్నించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలు
ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ప్రవర్తనా నియమావళిని (MCC) తుంగలో తొక్కుతున్నారని ఖర్గే ఆరోపించారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు విఫలమైన తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడాన్ని ఆయన తప్పుబట్టారు. "ఎన్నికల మధ్యలో ప్రధాని ఇలా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోంది. ఓటర్ల జాబితాలో మార్పుల నుంచి నియోజకవర్గాల పునర్విభజన వరకు ప్రతిచోటా అక్రమాలు జరుగుతున్నాయి" అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
{{/usCountry}}ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ప్రవర్తనా నియమావళిని (MCC) తుంగలో తొక్కుతున్నారని ఖర్గే ఆరోపించారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు విఫలమైన తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడాన్ని ఆయన తప్పుబట్టారు. "ఎన్నికల మధ్యలో ప్రధాని ఇలా వ్యవహరించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోంది. ఓటర్ల జాబితాలో మార్పుల నుంచి నియోజకవర్గాల పునర్విభజన వరకు ప్రతిచోటా అక్రమాలు జరుగుతున్నాయి" అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
{{/usCountry}}ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. 2023లోనే కాంగ్రెస్ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇచ్చిందని, కానీ జనాభా గణన పూర్తి కాలేదనే సాకుతో మోదీ ప్రభుత్వం దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన గుర్తు చేశారు.
బీజేపీ ఎదురుదాడి
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధానిని దూషించడం ఇదే మొదటిసారి కాదని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సుమారు 175 సార్లు మోదీని కాంగ్రెస్ నేతలు దూషించారని పూనావాలా మండిపడ్డారు. "జిహాదీలకు క్లీన్ చిట్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి, దేశం కోసం పనిచేసే ప్రధాని ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా? ఇది వారి ద్వేషపూరిత రాజకీయాలకు నిదర్శనం" అని ఆయన విమర్శించారు.