దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వచ్చే ఆగస్టు 2026 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో మంగళవారం వెల్లడించింది. కంపెనీ తన ఆల్మోడల్స్ పోర్ట్ఫోలియోపై గరిష్టంగా రూ.30,000 వరకు ధరలను పెంచాలని నిర్ణయించింది.

వాహనాల విడిభాగాల తయారీ వ్యయం రోజురోజుకూ పెరుగుతోందని, ఆ భారాన్ని తట్టుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే మారుతీ సుజుకీ షేర్లు బిఎస్ఈ (BSE)లో 0.6 శాతం లాభపడి రూ.13,597 వద్ద ముగిశాయి.
వ్యయాల భారం.. తప్పని పెంపు
"నిరంతరం పెరుగుతున్న ఇన్ పుట్ కాస్ట్స్ కారణంగానే విధిలేక ధరలు పెంచాల్సి వస్తోంది. ఆగస్టు 2026 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి" అని మారుతీ సుజుకీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.
గడిచిన కొన్ని నెలలుగా ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడానికి అంతర్గతంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ద్రవ్యోల్బణ ప్రభావం వల్ల ఆ భారాన్ని పాక్షికంగా వినియోగదారులపై వేయక తప్పడం లేదని సంస్థ వివరించింది. అయితే, కస్టమర్లపై ఈ ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం మారుతీ సుజుకీ ఎంట్రీ లెవెల్ 'ఎస్-ప్రెస్సో' (S-Presso) నుంచి ప్రీమియం ఎస్యూవీ 'ఇన్విక్టో' (Invicto) వరకు అనేక మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 3.5 లక్షల నుంచి రూ. 28.70 లక్షల మధ్య ఉన్నాయి.
మార్కెట్లో మిగతా కంపెనీల పరిస్థితి
కేవలం మారుతీ మాత్రమే కాదు, ఆటోమొబైల్ రంగంలోని ఇతర దిగ్గజాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న రవాణా అడ్డంకులు, ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో విడిభాగాల తయారీ ఖర్చులు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే జూన్లో మారుతీ రూ.30,000 వరకు ధరలు పెంచగా, టాటా మోటార్స్ రెండుసార్లు, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ సంస్థలు ఒకసారి చొప్పున వాహనాల ధరలను సవరించాయి.
'ప్రైస్ ప్రొటెక్షన్' మళ్లీ ఇస్తారా?
{{/usCountry}}కేవలం మారుతీ మాత్రమే కాదు, ఆటోమొబైల్ రంగంలోని ఇతర దిగ్గజాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న రవాణా అడ్డంకులు, ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లు, సరఫరా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో విడిభాగాల తయారీ ఖర్చులు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే జూన్లో మారుతీ రూ.30,000 వరకు ధరలు పెంచగా, టాటా మోటార్స్ రెండుసార్లు, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ సంస్థలు ఒకసారి చొప్పున వాహనాల ధరలను సవరించాయి.
'ప్రైస్ ప్రొటెక్షన్' మళ్లీ ఇస్తారా?
{{/usCountry}}గత మే/జూన్ నెలలో ధరలు పెంచినప్పుడు ఆల్టో K10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్-ఆర్ వంటి చిన్న కార్ల బుకింగ్లపై మారుతీ 'ప్రైస్ ప్రొటెక్షన్' వెసులుబాటు కల్పించింది. జూన్ 14 నాటికి కార్లను బుక్ చేసుకున్న వారికి పాత ధరలకే వాహనాలు అందిస్తామని నాడు హామీ ఇచ్చింది.
"కారు కొనాలనే ఆలోచనతో ధైర్యంగా ముందుకు వచ్చిన సామాన్య కస్టమర్ ధరల పెంపు వల్ల వెనక్కి తగ్గకూడదనే ఉద్దేశంతోనే చిన్న కార్ల కొనుగోలుదారులకు ప్రైస్ ప్రొటెక్షన్ వెసులుబాటు కల్పించాం" అని మారుతీ సుజుకీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ గతంలో వెల్లడించారు.
అయితే రాబోయే ఆగస్టు పెంపునకు కూడా ఇలాంటి ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్ను వర్తింపజేస్తారా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.