పాకిస్థాన్లోని అశాంతి నిండిన నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఘోర బాంబు పేలుడు సంభవించింది. సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళుతున్న ఒక రైలును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. క్వెట్టాలోని చమన్ పట్టక్ సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న కారు.. రైలు బోగీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భీకర ఆత్మాహుతి దాడిలో కనీసం 24 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది.

ఈద్ (రంజాన్) పండుగ వేడుకల కోసం క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పెషావర్ వెళుతున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ తిరుగుబాటుదారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మంగళవారం నుంచి ఈద్ సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైలులో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
దాడి జరిగిన తీరు..
రైలు క్వెట్టాలోని చమన్ పట్టక్ వద్ద సిగ్నల్ దాటుతున్న సమయంలో, భారీగా పేలుడు పదార్థాలు అమర్చిన ఒక కారు వేగంగా దూసుకొచ్చి రైలులోని ఒక బోగీని బలంగా ఢీకొట్టింది. ఈ ఆత్మాహుతి దాడి తీవ్రతకు రైలుకు చెందిన రెండు కోచ్లు పూర్తిగా రివర్స్ అయి పట్టాలు తప్పాయి. అనంతరం బోగీల్లో భారీగా మంటలు చెలరేగి దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది.
అత్యంత భద్రత ఉండే క్వెట్టా కంటోన్మెంట్ పరిసరాల్లోనే ఈ స్థాయి పేలుడు జరగడం పాకిస్థాన్ నిఘా వర్గాల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.
విధ్వంసకర దృశ్యాలు - భారీ ఆస్తి నష్టం!
పేలుడు ధాటికి రైలు బోగీలు తుక్కుతుక్కయ్యాయి. స్థానిక ప్రజలు, రెస్క్యూ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న క్షతగాత్రులను, రక్తసిక్తమైన మృతదేహాలను స్ట్రెచర్లపై బయటకు తీసుకువచ్చారు.
రైలు పట్టాలకు దాదాపు 25 నుంచి 30 మీటర్ల దూరంలో పార్క్ చేసి ఉన్న అనేక కార్లు ఈ పేలుడు ధాటికి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పక్కనే ఉన్న ఒక బహుళ అంతస్తుల భవనం గోడలు కూలిపోయాయి, కిటికీల అద్దాలు పగిలిపోయి భవన నిర్మాణం తీవ్రంగా దెబ్బతింది.
బాధ్యత వహించిన ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’
ఈ దాడికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఆత్మాహుతి విభాగమైన ‘మజీద్ బ్రిగేడ్’కు చెందిన ఫిదాయి (ప్రాణ త్యాగానికి సిద్ధపడిన సైనికుడు) ఈ దాడులను అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించినట్లు పేర్కొంది. ఆక్రమణ దళాల (పాక్ సైన్యం) కు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు విడుదల చేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది.
{{/usCountry}}ఈ దాడికి తామే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఆత్మాహుతి విభాగమైన ‘మజీద్ బ్రిగేడ్’కు చెందిన ఫిదాయి (ప్రాణ త్యాగానికి సిద్ధపడిన సైనికుడు) ఈ దాడులను అత్యంత వ్యూహాత్మకంగా నిర్వహించినట్లు పేర్కొంది. ఆక్రమణ దళాల (పాక్ సైన్యం) కు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు విడుదల చేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది.
{{/usCountry}}బలూచిస్థాన్ వివాదం నేపథ్యం : ఇరాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్ ప్రాంతం దశాబ్దాలుగా తిరుగుబాటుతో నలిగిపోతోంది. పూర్వపు సంస్థానమైన 'కలాత్' పాకిస్థాన్లో విలీనమైనప్పటి నుంచే ఈ బలూచ్ నిరోధక ఉద్యమం ప్రారంభమైంది. తమ ప్రాంతంలోని సహజ వనరుల్లో బలూచ్ ప్రజలకు సరైన వాటా ఇవ్వాలని, తమకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి జాతి సమూహాలు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నాయి. బీఎల్ఏ వంటి వేర్పాటువాద సమూహాలు గత కొన్నేళ్లుగా పాక్ భద్రతా దళాలు, పౌరులు, ప్రభుత్వ మౌలిక సదుపాయాలతో పాటు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి.