భారతీయ ఈ-కామర్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న మీషో (Meesho) స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల పాలిట కామధేనువుగా మారుతోంది. గత వారం అద్భుతమైన లిస్టింగ్ తర్వాత, ఈ షేరు వరుసగా మూడవ రోజు కూడా భారీ లాభాలను నమోదు చేసింది. బుధవారం ట్రేడింగ్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో మీషో షేర్ ధర ఏకంగా 10.5 శాతం పెరిగి రూ. 199.35 వద్ద సరికొత్త రికార్డు (All-time high) సృష్టించింది.

కేవలం గత మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ స్టాక్ 21 శాతం పెరగడం విశేషం. ఈ అసాధారణ ర్యాలీతో మీషో మార్కెట్ విలువ సుమారు రూ. 90,000 కోట్లకు చేరుకుంది.
యూబీఎస్ (UBS) 'బై' కాల్తో పెరిగిన ఉత్సాహం
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్.. మీషో స్టాక్పై పాజిటివ్ రిపోర్ట్ను విడుదల చేసింది. మీషోకు రూ. 220 టార్గెట్ ధరను నిర్ణయిస్తూ 'బై' రేటింగ్ ఇచ్చింది. యూబీఎస్ విశ్లేషణ ప్రకారం మీషో సక్సెస్కు ప్రధాన కారణాలు:
అసెట్-లైట్ మోడల్: సొంతంగా భారీ వేర్హౌస్లు లేదా లాజిస్టిక్స్ నెట్వర్క్ నిర్వహించకుండా, కేవలం టెక్నాలజీ ద్వారా వ్యాపారం చేయడం.
నగదు ప్రవాహం (Cash Flow): నెగటివ్ వర్కింగ్ క్యాపిటల్ మోడల్ వల్ల ఇతర ఇంటర్నెట్ కంపెనీల కంటే మీషో మెరుగైన నగదు ప్రవాహాన్ని కలిగి ఉండటం.
యూజర్ల వృద్ధి: వార్షిక లావాదేవీల వినియోగదారులు (ATU) ప్రస్తుతం ఉన్న 19.9 కోట్ల నుంచి 2030 నాటికి 51.8 కోట్లకు పెరుగుతారని అంచనా.
ఐపీఓ ఇన్వెస్టర్లకు కాసుల వర్షం
మీషో ఐపీఓ ధర రూ. 111 కాగా, నేటి గరిష్ట స్థాయి రూ. 199.35 వద్ద ఇన్వెస్టర్లు సుమారు 79 శాతం లాభాన్ని ఆర్జించారు. గత బుధవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు సుమారు 46 శాతం ప్రీమియంతో రూ. 162.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ షేరు వెనుదిరిగి చూడలేదు.
ఈ భారీ వృద్ధి మీషో కో-ఫౌండర్, సీఈఓ విదిత్ ఆత్రేను బిలియనీర్ల క్లబ్లో చేర్చింది. ఆయనకున్న 11.1 శాతం వాటా విలువ ఇప్పుడు సుమారు రూ. 9,142 కోట్లకు పైగానే ఉంది.
బిజినెస్ మోడల్ స్ట్రెంత్
{{/usCountry}}ఈ భారీ వృద్ధి మీషో కో-ఫౌండర్, సీఈఓ విదిత్ ఆత్రేను బిలియనీర్ల క్లబ్లో చేర్చింది. ఆయనకున్న 11.1 శాతం వాటా విలువ ఇప్పుడు సుమారు రూ. 9,142 కోట్లకు పైగానే ఉంది.
బిజినెస్ మోడల్ స్ట్రెంత్
{{/usCountry}}భారతదేశంలోని టైర్-2, టైర్-3 నగరాల్లోని మధ్యతరగతి ప్రజలే మీషో ప్రధాన బలం. తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులను అందించడం (Low AOV strategy) ద్వారా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాలకు మీషో గట్టి పోటీనిస్తోంది. సెప్టెంబర్ 30, 2025 నాటికి మీషో ప్లాట్ఫారమ్ మీద రోజూ సగటున 1,353 కోట్ల ప్రొడక్ట్ వ్యూస్ నమోదవుతున్నాయి.
IPO నిధుల వినియోగం: ఐపీఓ ద్వారా సేకరించిన రూ. 5,421 కోట్లను క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడానికి, బ్రాండ్ మార్కెటింగ్, ఇతర కంపెనీల కొనుగోలు (Acquisitions) కోసం మీషో ఖర్చు చేయనుంది.