...
...
Next Story

Meta layoffs 2026: మెటా భారీ లేఆఫ్స్: 1,000 మందికి పైగా ఉద్యోగులపై వేటు

ప్రముఖ టెక్ దిగ్గజం మెటా 2026లో తొలిసారిగా భారీ లేఆఫ్స్ ప్రకటించింది. తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో సుమారు 10 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయం ఐటీ రంగంలో చర్చనీయాంశమైంది. ఏఐ, వేరబుల్స్ రంగాలకు ప్రాధాన్యత పెంచడమే దీని వెనుక అసలు ఉద్దేశం.

Published on: Jan 14, 2026 07:10 AM IST
Advertisement

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన వ్యాపార వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే సంస్థకు చెందిన 'రియాలిటీ ల్యాబ్స్' (Reality Labs) విభాగంలో భారీగా కోత విధించింది. సుమారు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2026 ఏడాదిలో మెటా చేపట్టిన మొదటి అతిపెద్ద లేఆఫ్ ఇదే కావడం గమనార్హం.

మెటావర్స్ నుంచి ఏఐ వైపు..

Meta layoffs 2026: మెటా భారీ లేఆఫ్స్: 1,000 మందికి పైగా ఉద్యోగులపై వేటు (File Photo)
Meta layoffs 2026: మెటా భారీ లేఆఫ్స్: 1,000 మందికి పైగా ఉద్యోగులపై వేటు (File Photo)

గత కొన్నేళ్లుగా మెటావర్స్ (Metaverse) కల సాకారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మార్క్ జుకర్‌బర్గ్, ఇప్పుడు తన రూటు మార్చారు. కంపెనీ తన పూర్తి ఫోకస్‌ను మెటావర్స్ నుంచి 'ఏఐ డివైజ్‌ల' (AI devices) వైపు మళ్ళిస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పులో భాగంగానే రియాలిటీ ల్యాబ్స్‌లో ఉద్యోగాల కోత అనివార్యమైందని తెలుస్తోంది.

మొత్తం 15,000 మంది ఉద్యోగులున్న ఈ విభాగంలో, తాజా నిర్ణయంతో సుమారు 10 శాతం మంది ఉపాధి కోల్పోయారు. ఈ తొలగింపుల ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచే మొదలైందని, ప్రభావిత ఉద్యోగులకు ఇప్పటికే సమాచారం అందినట్లు సమాచారం. మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ అంతర్గతంగా పంపిన సందేశం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఎందుకీ నిర్ణయం?

కంపెనీ ప్రతినిధి ఒకరు ఈ లేఆఫ్స్‌పై స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. "మెటావర్స్‌పై పెట్టే పెట్టుబడులను కొంతమేర తగ్గించి, ధరించగలిగే సాంకేతిక పరికరాల (Wearables) వైపు మళ్లిస్తున్నట్లు మేము గత నెలలోనే సూచించాము. ఈ మార్పులో భాగంగానే ప్రస్తుత చర్యలు చేపట్టాం. దీనివల్ల మిగిలే నిధులను ఈ ఏడాది వేరబుల్స్ విభాగం అభివృద్ధి కోసం తిరిగి పెట్టుబడిగా పెడతాం" అని వివరించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe