పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం భారతీయ కుటుంబాలను తీవ్ర వేదనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అక్కడ సాగుతున్న ఘర్షణల కారణంగా 10 మంది భారతీయ నావికులు (సీఫేరర్స్) సహా మొత్తం 16 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానమిచ్చారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘర్షణల వల్ల ఇప్పటివరకు 16 మంది భారతీయులు మరణించారు. వీరిలో ఒమాన్లో ఎనిమిది మంది, యూఏఈలో నలుగురు, కువైట్లో ఇద్దరు, సౌదీ అరేబియాలో ఒకరు, ఇరాక్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 75 మంది భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో యూఏఈలో 32 మంది, ఒమాన్లో 24 మంది, కువైట్లో 13 మంది, ఖతార్లో నలుగురు, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లలో ఒక్కొక్కరు ఉన్నారు. ఇదికాకుండా, ఈ దాడులతో సంబంధం లేని ఒక వేర్వేరు ప్రమాదంలో ఖతార్లోని రాస్ లఫ్ఫాన్ గ్యాస్ ప్లాంట్లో 12 మంది భారతీయ పౌరులు మరణించారని మంత్రి స్పష్టం చేశారు.
రూ.10 లక్షల పరిహారం.. ముమ్మర సహాయక చర్యలు
మరణించిన భారతీయుల పార్థివ దేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో భారత దౌత్య కార్యాలయాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేలా చూడటంతో పాటు బాధితుల కుటుంబాలకు సమాచారం అందించడం, సురక్షితంగా భారత్కు చేరుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను రాయబార కార్యాలయాలు అందిస్తున్నాయని తెలిపారు.
యుద్ధ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన నావికుల కుటుంబాలను ఆదుకునేందుకు డీజీఎమ్ఏ వెల్ఫేర్ స్కీమ్ కింద రూ.10 లక్షల పరిహారాన్ని త్వరితగతిన అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు మెరైన్ యూనియన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆఫీసర్ స్థాయి నావికులకు రూ.12 లక్షలు, నేషనల్ యూనియన్ ఆఫ్ సీఫేరర్స్ ఆఫ్ ఇండియా ద్వారా క్రూ సభ్యులకు రూ.10 లక్షలదనంగా వార్-జోన్ పరిహారం లభిస్తుందని వివరించారు.
ఇరాన్ నుంచి 2,557 మంది ఖాళీ.
{{/usCountry}}యుద్ధ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయిన నావికుల కుటుంబాలను ఆదుకునేందుకు డీజీఎమ్ఏ వెల్ఫేర్ స్కీమ్ కింద రూ.10 లక్షల పరిహారాన్ని త్వరితగతిన అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు మెరైన్ యూనియన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆఫీసర్ స్థాయి నావికులకు రూ.12 లక్షలు, నేషనల్ యూనియన్ ఆఫ్ సీఫేరర్స్ ఆఫ్ ఇండియా ద్వారా క్రూ సభ్యులకు రూ.10 లక్షలదనంగా వార్-జోన్ పరిహారం లభిస్తుందని వివరించారు.
ఇరాన్ నుంచి 2,557 మంది ఖాళీ.
{{/usCountry}}ఇరాన్లో సుమారు 7,000 మంది భారతీయులు (వైద్య విద్యార్థులు, కార్మికులు, మత్స్యకారులు) నివసిస్తున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. ఫిబ్రవరి 2026 నుంచి అక్కడ పరిస్థితులు దిగజారడంతో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం చొరవ తీసుకుని 2,557 మంది భారతీయులను అర్మేనియా, అజర్బైజాన్ సరిహద్దుల గుండా సురక్షితంగా భారత్కు తరలించిందని మంత్రి తెలిపారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థుల భవిష్యత్తుపై ఇరాన్ అధికారులతో మాట్లాడుతున్నామని, పరిస్థితి సర్దుమణికే వరకు ఇరాన్ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పౌరులకు సూచించారు.
మరోవైపు, దుబాయ్లోని ఇరానియన్ హాస్పిటల్ను స్థానిక ప్రభుత్వం మూసివేయడంతో ఉపాధి కోల్పోయి వీసా సమస్యలు ఎదుర్కొంటున్న 130 మందికి పైగా భారతీయ హెల్త్కేర్ సిబ్బందికి (ఎక్కువమంది కేరళ వాసులు) దౌత్య మార్గాల ద్వారా సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.
అమెరికాలో 30 మంది భారతీయులు అరెస్ట్
అమెరికాలోని అరిజోనాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారనే ఆరోపణలతో మే 11-15 తేదీల మధ్య 'ఆపరేషన్ చెక్మేట్' పేరుతో యుఎస్ బోర్డర్ పెట్రోల్ నిర్వహించిన తనిఖీల్లో 52 మందిని అరెస్ట్ చేయగా, అందులో 36 మంది సెమీ-ట్రక్ డ్రైవర్లు ఉన్నారని మంత్రి వెల్లడించారు. ఈ 52 మందిలో 30 మంది భారతీయ పౌరులేనని అమెరికా సుంకాలు, సరిహద్దు రక్షణ విభాగం జూన్ 1న ప్రకటించిందని, చట్టప్రకారం వీరిని డిపోర్ట్ (దేశం నుంచి పంపించివేయడం) చేస్తారని తెలిపారు. దీనిపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా పూర్తి వివరాలను కోరామని, అమెరికా అధికారుల నుంచి అధికారిక ధృవీకరణ కోసం నిరీక్షిస్తున్నామని మంత్రి సభకు వివరించారు.