భారత ప్రాథమిక మార్కెట్లో జులై 30న ప్రారంభమైన ‘ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్’ పబ్లిక్ ఇష్యూ నేటితో (ఆగస్టు 3, 2026) ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా ఈక్విటీ షేరు రూ.400 నుంచి రూ.425 ప్రైస్ బ్యాండ్గా కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ బుక్-బిల్డింగ్ ఇష్యూలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లకు ఈరోజే చివరి అవకాశం.

రూ.290 కోట్ల నిధులను సేకరించడమే లక్ష్యంగా కంపెనీ నూతన షేర్లను జారీ చేస్తోంది. మరోవైపు, ఐపీఓ సబ్స్క్రిప్షన్కు విశేష స్పందన లభిస్తుండటం, సెకండరీ మార్కెట్లో సానుకూల ధోరణి కనిపిస్తుండటంతో గ్రే మార్కెట్లోనూ ఈ షేర్ల డిమాండ్ పెరిగింది.
ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ- జీఎంపీ..
ఇన్వెస్టర్గెయిన్ సమాచారం ప్రకారం.. గ్రే మార్కెట్లో ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ షేర్లు నేడు రూ.120 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. గురువారం బిడ్డింగ్ ప్రారంభం కాకముందు ఉన్న జీఎంపీతో పోలిస్తే ఇది రూ.20 పెరగడం గమనార్హం. ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న భారీ ఆదరణే ఈ పెంపునకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ- సబ్స్క్రిప్షన్ స్టేటస్..
సబ్స్క్రిప్షన్ మూడో రోజైన సోమవారం ఉదయం 10:18 గంటల సమయానికి ఓవరాల్గా ఈ ఇష్యూ 15.42 రెట్లు సబ్స్క్రైబ్ అయింది.
రీటైల్ విభాగం: 43.19 రెట్లు
నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ): 25.89 రెట్లు
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బైయర్స్ (క్యూఐబీ): 0.92 రెట్లు
బ్రోకరేజ్ సంస్థల రివ్యూలు..
ఈ ఐపీఓపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు వేర్వేరు రేటింగ్లు ఇచ్చాయి.
ఈ ఐపీఓను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని ‘జీఈపీఎల్ క్యాపిటల్’ సిఫార్సు చేసింది. “చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్డబ్ల్యూ), ఇండియన్ రైల్వేస్ ఆమోదం పొందిన ఐజీబీటీ ఆధారిత 3-ఫేజ్ ప్రొపల్షన్ సిస్టమ్ను కంపెనీ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. రైల్వే టెండర్లలో పాల్గొనే అర్హత సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్వై26) నష్టం నమోదైనప్పటికీ, ఆర్డర్ బుక్ బలంగా ఉండటంతో లిస్టింగ్ లాభాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు,” అని సంస్థ తెలిపింది.
‘వెంచురా సెక్యూరిటీస్’ కూడా ఈ ఐపీఓకు 'అప్లై' రేటింగ్ ఇచ్చింది. “పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్లో బలమైన ఆర్ అండ్ డీ, ఇండియన్ రైల్వేస్తో సుదీర్ఘ అనుబంధం కంపెనీకి ప్రధాన బలాలు. రైల్వేల నుంచి 2026 జూన్ 30 నాటికి జిఎస్టీ మినహాయించి రూ.989.32 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి,” అని వివరించింది.
{{/usCountry}}‘వెంచురా సెక్యూరిటీస్’ కూడా ఈ ఐపీఓకు 'అప్లై' రేటింగ్ ఇచ్చింది. “పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్లో బలమైన ఆర్ అండ్ డీ, ఇండియన్ రైల్వేస్తో సుదీర్ఘ అనుబంధం కంపెనీకి ప్రధాన బలాలు. రైల్వేల నుంచి 2026 జూన్ 30 నాటికి జిఎస్టీ మినహాయించి రూ.989.32 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి,” అని వివరించింది.
{{/usCountry}}ఈ ఐపీఓకు 'ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్' సబ్స్క్రైబ్ రేటింగ్ ఇవ్వగా.. 'స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్' మాత్రం దూరంగా ఉండాలని సూచించింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, అరేటే సెక్యూరిటీస్ సంస్థలు ఎలాంటి రేటింగ్ ఇవ్వలేదు.
ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ- కీలక తేదీలు..
- షేర్ల కేటాయింపు : ఆగస్టు 4, 2026
- రజిస్ట్రార్: కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్
- లిస్టింగ్ తేదీ (అంచనా): ఆగస్టు 6, 2026 (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్స్ఛేంజీల్లో)
- లీడ్ మేనేజర్: సన్డే క్యాపిటల్ అడ్వైజర్స్