ఢిల్లీ నిరసనకారులకు నాగాలాండ్ యువకుడి మద్దతు: జంతర్ మంతర్కు రూ.68 వేల విలువైన 150 పిజ్జాలు
నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఆందోళన తెలుపుతున్న విద్యార్థులకు నాగాలాండ్కు చెందిన ఒక యువకుడు వినూత్న రీతిలో మద్దతు తెలిపారు. వారి ఆకలి తీర్చేందుకు ఏకంగా రూ.67,734 విలువైన 150 పిజ్జాలను పంపించి నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు.
నాగాలాండ్కు చెందిన ఒక యువకుడు (ఇన్స్టాగ్రామ్లో @adiespoems) జంతర్ మంతర్ వద్ద రాత్రింబవళ్లు పోరాడుతున్న విద్యార్థుల పరిస్థితి చూసి చలించిపోయారు. తాను ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనలేకపోయినా, దూరం నుంచే వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జులై 22న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో డామినోస్ యాప్ ద్వారా ఏకంగా 150 'ఫార్మ్హౌస్ చీజ్ బర్స్ట్' (Farmhouse Cheese Burst) పిజ్జాలను ఆర్డర్ చేశారు.

పిజ్జాల అసలు ధర రూ. 64,650 కాగా, పన్నులు, డెలివరీ ఛార్జీలతో కలిపి మొత్తం బిల్లు రూ. 67,734 అయింది. పిజ్జా డెలివరీ చేయడానికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి 'ఈ పిజ్జాలను ఎవరికి ఇవ్వాలి?' అని అడగ్గా.. ఆ యువకుడు సదరు డెలివరీ బాయ్కి ఒక చిన్న సూచన ఇచ్చారు.
"అక్కడ ఇంకా భోజనం చేయకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు, నిరసనకారులు ఎవరున్నా సరే వారందరికీ ఈ పిజ్జాలను పంచేయండి."
ఈ మాట వినగానే డెలివరీ ఎగ్జిక్యూటివ్ క్షణకాలం ఆగి, భావోద్వేగానికి గురవుతూ.. "మీరు అక్కడ ఉన్న వారి పాలిట దేవుడిలా మారారు" అని వ్యాఖ్యానించినట్లు ఆ యువకుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
తాను చేసిన ఈ పనిని ప్రచారం చేసుకోవడానికి పోస్ట్ చేయలేదని, ఢిల్లీ వెళ్లలేకపోయినా ఎక్కడి నుంచైనా సీజేపీ నిరసనకారులకు సహాయం చేయవచ్చని నిరూపించడానికే ఇన్స్టాగ్రామ్లో బిల్లు రశీదును షేర్ చేసినట్లు ఆ యువకుడు తెలిపారు. "చిన్న సహాయం కూడా ఎంతో విలువైనది" అని ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. "సాధారణ పిజ్జా కాకుండా, విద్యార్థుల కోసం చీజ్ బర్స్ట్ పిజ్జాలు ఆర్డర్ చేయడం ఆయన మంచి మనసుకు నిదర్శనం" అని ఒకరు కామెంట్ చేయగా.. "మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి ఇతడే నిదర్శనం. దేవుడు నిన్ను చల్లగా చూడాలి" అని మరొకరు ప్రశంసించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


