నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్లను శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. గత సెప్టెంబర్లో నిరసనకారులపై జరిగిన ప్రాణాంతకమైన అణచివేతలో వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు నేపాల్ పోలీసులను ఉటంకిస్తూ ఏఎఫ్పీ వార్తా సంస్థ నివేదించింది.

2025లో ఓలీ ప్రభుత్వాన్ని పడగొట్టిన తిరుగుబాటు తర్వాత జరిగిన మొదటి ఎన్నికల అనంతరం, ప్రధాన మంత్రి బాలేంద్ర షా, ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఈ అరెస్టులు జరగడం గమనార్హం.
అవినీతి వ్యతిరేక నిరసనల సమయంలో జరిగిన హింసపై దర్యాప్తు చేసిన నేపాల్ కమిటీ, నిరసనకారులపై జరిగిన అణచివేతను అడ్డుకోవడంలో విఫలమైనందుకు 74 ఏళ్ల ఓలీని విచారించాలని ఈ వారం ప్రారంభంలోనే సిఫార్సు చేసింది.
"వారిని ఈ ఉదయం అరెస్ట్ చేశాము, చట్టప్రకారం ప్రక్రియ ముందుకు సాగుతుంది," అని ఖాట్మండు వ్యాలీ పోలీసు ప్రతినిధి ఓం అధికారి ఏఎఫ్పీతో చెప్పారు.
ఎవరూ చట్టానికి అతీతులు కారు: కొత్త ప్రభుత్వం!
కొత్తగా నియమితులైన (నిరసనల్లో కీలక పాత్ర పోషించిన) హోం మంత్రి సుదన్ గురుంగ్, ఓలీ అరెస్ట్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ.. 'ఎవరూ చట్టానికి అతీతులు కారు,' అని పేర్కొన్నారు.
"ఎవరూ చట్టానికి అతీతులు కారు.. ఇది ఎవరిపైనా పగ తీర్చుకోవడం కాదు, కేవలం న్యాయం వైపు సాగే ప్రయాణానికి ఆరంభం మాత్రమే. ఇప్పుడు దేశం కొత్త దిశలో పయనిస్తుందని నేను నమ్ముతున్నాను," అని సుదన్ గురుంగ్ పోస్ట్ చేశారు.
శనివారం ఉదయం మాజీ ప్రధానిని ఆయన నివాసం నుంచే అరెస్ట్ చేసినట్లు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ సీనియర్ నాయకుడు మిన్ బహదూర్ షాహి రాయిటర్స్కు తెలిపారు.
నిరసనల నేపథ్యం..
{{/usCountry}}శనివారం ఉదయం మాజీ ప్రధానిని ఆయన నివాసం నుంచే అరెస్ట్ చేసినట్లు ఓలీకి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ సీనియర్ నాయకుడు మిన్ బహదూర్ షాహి రాయిటర్స్కు తెలిపారు.
నిరసనల నేపథ్యం..
{{/usCountry}}సెప్టెంబర్ 8- 9 తేదీలలో జరిగిన అవినీతి వ్యతిరేక యువత తిరుగుబాటులో కనీసం 77 మంది మరణించారు. సోషల్ మీడియాపై విధించిన స్వల్పకాలిక నిషేధంతో ఈ నిరసనలు ప్రారంభమైనప్పటికీ, ఆర్థిక కష్టాలపై ప్రజల్లో ఉన్న దీర్ఘకాలిక ఆగ్రహం దీనికి ప్రధాన కారణమైంది. నిరసనల మొదటి రోజే జరిగిన అణచివేతలో కనీసం 19 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు.
మరుసటి రోజు ఈ అశాంతి దేశవ్యాప్తంగా వ్యాపించింది. నిరసనకారులు పార్లమెంటు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఈ ఘోరమైన తిరుగుబాటుపై నేపాల్ ప్రభుత్వ మద్దతుతో రూపొందించిన నివేదిక, అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ, ఇతర అధికారులను విచారించాలని సిఫార్సు చేసింది.
నిరసనకారులను కాల్చివేయమని 'ఆదేశం ఇచ్చినట్లు నిర్ధారణ కాలేదు' అని నివేదిక పేర్కొన్నప్పటికీ, "కాల్పులను ఆపడానికి లేదా నియంత్రించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. వారి నిర్లక్ష్య ప్రవర్తన కారణంగా మైనర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు," అని నివేదిక స్పష్టం చేసింది.