భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా సిద్ధమైంది. కంపెనీకి అత్యధిక విక్రయాలు అందిస్తున్న క్రెటా (Creta), ఐ10 (i10) కార్ల కొత్త తరం (Next-Generation) మోడళ్లను 2027 నాటికి భారత రోడ్లపైకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 2026 సీఈఓ ఇన్వెస్టర్ డే (CEO Investor Day 2026) వేదికగా కంపెనీ తమ భవిష్యత్ ప్రణాళికలను స్పష్టం చేసింది.

ఈ క్రమంలో 2027 ఆరంభంలోనే కొత్త క్రెటా మోడల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, అదే ఏడాది చివరినాటికి నెక్స్ట్ జనరేషన్ ఐ10 హ్యాచ్బ్యాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే భారత రోడ్లపై నెక్స్ట్ జనరేషన్ క్రెటా టెస్టింగ్ జరుపుతుండటంతో, ఈ ఎస్యూవీ డిజైన్, సైజ్, సాంకేతికతకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సరికొత్త లుక్, భారీ సైజులో 3వ తరం క్రెటా
హ్యుందాయ్ క్రెటా (SX3) మూడో తరం మోడల్ సరికొత్త డిజైన్ భాష్యంతో రానుంది. ఈ కొత్త ఎస్యూవీని హ్యుందాయ్-కియా సంయుక్తంగా అభివృద్ధి చేసిన అధునాతన 'కే3' (K3) ప్లాట్ఫామ్పై నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వచ్చిన కియా సెల్టోస్ మోడల్ను కూడా ఇదే ప్లాట్ఫామ్పై రూపొందించారు.
ఇప్పటికే లీకైన టెస్టింగ్ చిత్రాలను పరిశీలిస్తే, కొత్త క్రెటా మునుపటి కంటే మరింత బాక్సీ (Boxy), నిటారైన (Upright) డిజైన్తో కనిపిస్తోంది. ప్రస్తుత మోడల్ కంటే పొడవు, వీల్బేస్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాబిన్ లోపల ప్రయాణికులకు మరింత విశాలమైన స్థలం లభిస్తుంది. ముందరి భాగంలో నిటారైన గ్రిల్, పెద్ద అల్లాయ్ వీల్స్, వెడల్పాటి వైఖరి (Wider stance) ఈ ఎస్యూవీకి రోడ్డుపై మరింత గంభీరమైన లుక్ను అందిస్తాయి.
ఇంజిన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ తమ నమ్మకమైన 1.5-లీటర్ పెట్రోల్, డిజైన్ ఆప్షన్లను అలాగే కొనసాగించే అవకాశం ఉంది. వీటితో పాటు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
మైలేజ్ పెంచేలా 'స్ట్రాంగ్ హైబ్రిడ్' టెక్నాలజీ
{{/usCountry}}ఇంజిన్ విషయానికి వస్తే, హ్యుందాయ్ తమ నమ్మకమైన 1.5-లీటర్ పెట్రోల్, డిజైన్ ఆప్షన్లను అలాగే కొనసాగించే అవకాశం ఉంది. వీటితో పాటు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
మైలేజ్ పెంచేలా 'స్ట్రాంగ్ హైబ్రిడ్' టెక్నాలజీ
{{/usCountry}}కొత్త క్రెటాలో రాబోతున్న అతిపెద్ద మార్పు దీని 'స్ట్రాంగ్ హైబ్రిడ్' (Strong Hybrid) సిస్టమ్. భారత్లో ఎస్యూవీ ప్రియులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు పూర్తిగా మారకుండానే, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో హైబ్రిడ్ టెక్నాలజీ అత్యంత కీలకంగా మారనుంది.
"2027 నాటికి భారత్లో కియా సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్ను తీసుకొస్తున్నాం," అని కియా ఇప్పటికే స్పష్టం చేసింది. కియా అనుసరిస్తున్న సాంకేతిక విధానాన్నే హ్యుందాయ్ కూడా క్రెటా కోసం వర్తింపజేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చార్జింగ్ స్టేషన్ల లభ్యతపై ఆందోళన చెందే వినియోగదారులకు సాంప్రదాయ పెట్రోల్ కార్లు, పూర్తి స్థాయి ఈవీ (EV) లకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.
హ్యాచ్బ్యాక్ విభాగాన్ని ఊపేసేలా కొత్త ఐ10
క్రెటా తర్వాత హ్యుందాయ్ తమ హిట్ హ్యాచ్బ్యాక్ ఐ10 నెక్స్ట్ జనరేషన్ మోడల్ను మార్కెట్లోకి తేనుంది. ఈ కారును పూర్తి స్థాయి కొత్త ప్లాట్ఫామ్పై రీడిజైన్ చేయడమే కాకుండా, సరికొత్త భద్రతా ప్రమాణాలు, డిజిటల్ ఫీచర్లను జోడించనున్నారు.
అయితే దీని ఇంజిన్ విభాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (83 bhp) తో పాటు 69 bhp పవర్ ఇచ్చే సీఎన్జీ (CNG) ఆప్షన్ను కొనసాగించనున్నారు. వినియోగదారుల సౌకర్యం కోసం మ్యాన్యువల్, ఏఎమ్టీ (AMT) గేర్బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
సరికొత్త ఫీచర్లు, పోటీదారులకు సవాలు విసిరే సరసమైన ధరలతో ఈ రెండు కార్లు వస్తే, వేగంగా మారుతున్న భారత ప్యాసింజర్ వాహన రంగంలో హ్యుందాయ్ స్థానం మరింత బలపడటం ఖాయంగా కనిపిస్తోంది.