వెనిజులా అధ్యక్షుడు మదురోకు పుట్టపర్తి సాయిబాబాతో ఉన్న ఆధ్యాత్మిక బంధం ఇదే!
అమెరికా దళాల చేతికి చిక్కిన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు పుట్టపర్తి సత్యసాయిబాబాతో విడదీయలేని అనుబంధం ఉంది. 2005లో ఆయన పుట్టపర్తిని సందర్శించారు. మదురోకు భారత్తో ఉన్న ఈ ఆసక్తికర ఆధ్యాత్మిక విశేషాలు మీకోసం.
అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అమెరికా ప్రత్యేక దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వెనిజులా రాజధాని కరాకస్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అత్యంత రహస్యంగా సాగిన ఆపరేషన్లో అమెరికా కమెండోలు వీరిని 'క్యాప్చర్' చేశారు. 1989లో పనామాపై దాడి తర్వాత లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదేనని నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఈ నేతకు భారతదేశంతో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తితో ఒక లోతైన ఆధ్యాత్మిక సంబంధం ఉందన్న విషయం చాలామందికి తెలియదు.
పుట్టపర్తి భక్తుడిగా మదురో
నికోలస్ మదురో పుట్టుకతో క్యాథలిక్ అయినప్పటికీ, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ద్వారా పుట్టపర్తి సత్యసాయిబాబా భక్తుడిగా మారారు. వీరిద్దరూ పెళ్లికి ముందే సాయిబాబా బోధనలకు ప్రభావితులయ్యారు.
2005 సందర్శన: మదురో వెనిజులా అధ్యక్షుడు కావడానికి సుమారు ఎనిమిదేళ్ల ముందే, అంటే 2005లో తన భాగస్వామి సిలియాతో కలిసి పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. అక్కడ సత్యసాయిబాబాను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సమయంలో తీయించుకున్న ఒక ఫోటోలో మదురో దంపతులు బాబా పక్కన కింద కూర్చుని ఉండటం గమనించవచ్చు.
జాతీయ అసెంబ్లీలో సంతాపం: 2011లో సత్యసాయిబాబా మరణించినప్పుడు, అప్పటి వెనిజులా విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో స్వయంగా చొరవ తీసుకుని అక్కడి జాతీయ అసెంబ్లీలో అధికారిక సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
చిహ్నాల్లోనూ బాబా గుర్తులే: 2024లో వెనిజులా జాతీయ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలపై 'ఓం' (Om) గుర్తును ముద్రించడం విశేషం. అంతేకాకుండా, నవంబర్ 2025లో సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా మదురో ఆయనను 'కాంతి పుంజం' (Being of light) అని కొనియాడారు.
అమెరికా ఆపరేషన్ వెనుక కారణాలేంటి?
మదురో దంపతులు భారీ ఎత్తున కొకైన్ అక్రమ రవాణా నెట్వర్క్ను నడుపుతున్నారని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. మెక్సికోలోని సినలోవా కార్టెల్, కొలంబియా తిరుగుబాటుదారులు వంటి ప్రమాదకరమైన ముఠాలతో కలిసి మదురో పనిచేస్తున్నారని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే, తన దేశంలోని చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా, కుట్రపూరితంగా తనపై ఈ ఆరోపణలు చేస్తోందని మదురో వాదిస్తున్నారు.
నియంతగా ముద్రపడిన ఒక నేతకు, పుట్టపర్తి సాయిబాబా పట్ల ఉన్న ఈ అచంచలమైన భక్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


