పెట్టుబడులు పెట్టడం అంటే భారీ లాభాలను ఇచ్చే షేర్లను వెతకడం కాదని, ఒక క్రమశిక్షణతో కూడిన అలవాటని చెప్తున్నారు జెరోధా కో-ఫౌండర్ నితిన్ కామత్. చాలా మంది ఇన్వెస్టర్లు సంక్లిష్టమైన వ్యూహాల వెనుక పడుతూ, సులువైన ప్రాథమిక సూత్రాలను విస్మరిస్తుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) లో ఆయన ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు.
"చాలా మందికి ఇన్వెస్టింగ్ అనేది కొన్ని విషయాలపైనే ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యం, కాలపరిమితికి అనుగుణంగా సరైన అసెట్ అలోకేషన్ ఎంచుకోవాలి. స్టాక్స్ ఎంపిక కోసం తలబద్దలు కొట్టుకోకుండా తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లను నమ్ముకోవాలి. మార్కెట్ పరిస్థితి ఎలా ఉన్నా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి" అని నితిన్ కామత్ స్పష్టం చేశారు.
ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచడం, పోర్ట్ఫోలియోను ఎప్పటికప్పుడు రీబ్యాలెన్స్ చేయడం, దీర్ఘకాలం పాటు మార్కెట్లో కొనసాగడం ఇన్వెస్టింగ్లో అత్యంత కీలకమని కామత్ సూచించారు. ఇవన్నీ వినడానికి చాలా సరళంగా అనిపించినా, ఆచరణలో పెట్టడం అంత సులువు కాదన్నారు.
ఇన్వెస్టర్ల కన్ఫ్యూజన్.. ఎఫ్డీల వైపు అడుగులు
పెట్టుబడి పెట్టేటప్పుడు ఎంత ఈక్విటీ ఉండాలి? డెట్ ఎంత ఉండాలి? గోల్డ్ కొనాలా? ఎప్పుడు రీబ్యాలెన్స్ చేయాలి? అనే ప్రశ్నలు ఇన్వెస్టర్లను తరచూ వేధిస్తుంటాయి. మార్కెట్లో వేల సంఖ్యలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ల వల్ల ఈ గందరగోళం మరింత పెరుగుతుంది. ఫలితంగా చాలా మంది మెరుగైన రిటర్న్స్ ఇచ్చే మార్కెట్లను వదిలేసి, తమకు నమ్మకమైన ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs), ఇన్సూరెన్స్ ప్లాన్ల వైపు వెళ్లిపోతుంటారని ఆయన విశ్లేషించారు.
సమస్యకు పరిష్కారం: లైఫ్సైకిల్ ఫండ్స్
సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఎదుర్కొనే ఈ సమస్యలన్నింటికీ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన 'లైఫ్సైకిల్ ఫండ్స్' (కొన్ని దేశాల్లో వీటిని టార్గెట్-డేట్ ఫండ్స్ అంటారు) సరైన సమాధానమని నితిన్ కామత్ పేర్కొన్నారు. ఈ ఫండ్స్ ఇన్వెస్టర్ల నిర్ణయాలను ఆటోమేట్ చేస్తాయి.
{{/usCountry}}సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఎదుర్కొనే ఈ సమస్యలన్నింటికీ మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన 'లైఫ్సైకిల్ ఫండ్స్' (కొన్ని దేశాల్లో వీటిని టార్గెట్-డేట్ ఫండ్స్ అంటారు) సరైన సమాధానమని నితిన్ కామత్ పేర్కొన్నారు. ఈ ఫండ్స్ ఇన్వెస్టర్ల నిర్ణయాలను ఆటోమేట్ చేస్తాయి.
{{/usCountry}}"మీ ఆర్థిక లక్ష్యానికి సరిపోయే కాలపరిమితి గల ఒక ఫండ్ను ఎంచుకుంటే చాలు, మిగిలిన బాధ్యతను ఆ ఫండే చూసుకుంటుంది. సరైన అసెట్ అలోకేషన్ ఎంపిక, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్, లక్ష్యం దగ్గరపడే కొద్దీ ఈక్విటీ వాటాను తగ్గించి డెట్ వాటాను పెంచడం వంటివన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి" అని ఆయన వివరించారు.
వయసు, కాలపరిమితిని బట్టి ఇన్వెస్టర్ల రిస్క్ ప్రొఫైల్ మారుతుంది. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టగలిగేవారు ఈక్విటీలో ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్ లేదా ఆర్థిక లక్ష్యానికి దగ్గర పడుతున్న వారు పెట్టుబడి సురక్షితంగా ఉండటం కోసం డెట్ అలోకేషన్ను పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగానే లైఫ్సైకిల్ ఫండ్స్ పనిచేస్తాయి.
జెరోధా సరికొత్త అడుగు
భారతదేశంలో ఈ కేటగిరీలో ఫండ్స్ను లాంచ్ చేసిన మొదటి అసెట్ మేనేజ్ కంపెనీగా 'జెరోధా ఏఎంసీ' (Zerodha AMC) నిలిచింది. ఈ ఫండ్స్ తక్కువ ఖర్చుతో, చాలా సరళంగా ఉంటాయని కామత్ తెలిపారు. ఈక్విటీ విభాగానికి గాను 'జెరోధా నిఫ్టీ లార్జ్మిడ్ 250 ఇండెక్స్ ఫండ్' ద్వారా దేశంలోని టాప్ 250 లార్జ్, మిడ్-క్యాప్ కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. అలాగే డెట్ విభాగం కోసం ప్రభుత్వ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. వైవిధ్యం (Diversification), పన్ను సామర్థ్యం (Tax efficiency) కోసం బంగారం, వెండి, ఆర్బిట్రేజ్ కేటగిరీలలో కూడా కేటాయింపులు ఉంటాయి.
దీర్ఘకాలిక లక్ష్యాల కోసం తక్కువ మెయింటెనెన్స్తో కూడిన సింపుల్ ఇన్వెస్ట్మెంట్ మార్గం కోసం చూసేవారికి ఇది ఒక 'వన్-ఫండ్ సొల్యూషన్' (One-fund solution) అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ సరికొత్త న్యూ ఫండ్ ఆఫర్స్ (NFO) అందుబాటులో ఉన్నాయని నితిన్ కామత్ ముగించారు.