...
...
Next Story

రాజ్యసభ ఎన్నికల్లో ఉద్రిక్తత.. ఒడిశా బిజెడి, బిజెపి ఎమ్మెల్యేల మధ్య బాహాబాహీ! అసలేం జరిగింది?

ఒడిశా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ వేళ రాజకీయ రచ్చ మొదలైంది. భువనేశ్వర్‌లో ఓటు వేసే క్రమంలో బిజెడి, బిజెపి ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అక్రమాలకు పాల్పడుతోందని నవీన్ పట్నాయక్ ఆరోపించగా.. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి.

Published on: Mar 16, 2026, 20:47:08 IST
Advertisement

ఒడిశా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. రాజధాని భువనేశ్వర్‌లో ఓటు వేసే సమయంలో అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రతిపక్ష బిజు జనతా దళ్ (బిజెడి) ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి ఇరు వర్గాల మధ్య తోపులాట, భౌతిక దాడుల వరకు వెళ్లడంతో అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.

బిజెపివి అనైతిక మార్గాలు: బిజెడి ఆరోపణలు

విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ (@MohanMOdisha X)
విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులను అభినందిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ (@MohanMOdisha X)

ఈ ఎన్నికల్లో బిజెపి అనైతిక మార్గాల్లో ఓట్లను దక్కించుకోవాలని చూస్తోందని బిజెడి తీవ్రంగా మండిపడింది. “బిజెపి నేతలు బిజెడి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మా ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో వారిపై దాడులకు తెగబడ్డారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే, ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఏంటి? మేము ఎవరిపై దాడి చేయలేదు, బిజెపి ఎమ్మెల్యేలే మా వారిని కొట్టారు” అని బిజెడి ఎమ్మెల్యే శారదా ప్రసన్న జెనా ఆరోపించారు.

ఓటింగ్ నిబంధనల ఉల్లంఘనపై నవీన్ పట్నాయక్ ఆగ్రహం

మరోవైపు, బిజెడి అధినేత, ప్రతిపక్ష నాయకుడు నవీన్ పట్నాయక్ ఓటింగ్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై గళమెత్తారు. బ్రహ్మగిరి ఎమ్మెల్యే ఉపాసన మహాపాత్ర ఓటు వేసే క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు.

“బ్రహ్మగిరి ఎమ్మెల్యే ఓటు వేసేటప్పుడు స్పష్టమైన తప్పు చేశారు. వాస్తవానికి ఆమె ఓటు చెల్లకుండా పోవాలి. కానీ, అక్కడ విధుల్లో ఉన్న పోలింగ్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు రెండో బ్యాలెట్ పేపర్‌ను జారీ చేశారు. ఇది ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమే కాకుండా, ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమే” అని నవీన్ పట్నాయక్ విమర్శించారు. ఈ వ్యవహారంపై తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల అధికారులు పట్టించుకోలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe