ఇదేం నిర్ణయం.. టీ20 ప్రపంచకప్ లో ఆడతాం, కానీ ఇండియాతో మ్యాచ్ మాత్రం బాయ్ కాట్ చేస్తామని పాకిస్థాన్ టీమ్ తీసుకున్న నిర్ణయంపై వస్తున్న సెటైర్లు ఇవే. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడటం ఖాయమైంది. కానీ ఇండియాతో మ్యాచ్ ను బహిష్కరిస్తామని ప్రకటించడం అర్థం లేని నిర్ణయంగా విమర్శలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ లో పాక్

భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ ఆడనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఆదివారం (ఫిబ్రవరి 1) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది.
ఇండియాతో మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ లో ఆడతామని ప్రకటించిన పాక్.. ఈ టోర్నీలో ఇండియాతో మ్యాచ్ కోసం మైదానంలో దిగబోమని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ను పాక్ బహిష్కరిస్తుంది. దీనికి గల కారణాలను మాత్రం పాక్ వెల్లడించలేదు. దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
‘‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ ప్రభుత్వం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆడేందుకు అనుమతినిచ్చింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఫిబ్రవరి 15, 2026న భారత్తో తలపడాల్సిన మ్యాచ్ లో మాత్రం మైదానంలోకి దిగదు’’ అని ఎక్స్ లో పాకిస్థాన్ ప్రభుత్వం పోస్టు చేసింది. అయితే సెమీస్, ఫైనల్లో ఇండియాతో ఆడాల్సి వస్తే ఏం చేస్తారనే నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు.
అదే కారణమా?
బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ ఆడకుండా తొలగించింది. దీంతో భద్రతా కారణాలు చూపి టీ20 ప్రపంచకప్ లో తమ మ్యాచ్ లను ఇండియాలో ఆడలేమని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఐసీసీ మాత్రం ఇండియాలో ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ వినకపోవడంతో టీ20 ప్రపంచకప్ లో ఆ టీమ్ పై వేటు వేసి, స్కాట్లాండ్ కు ఛాన్స్ ఇచ్చింది ఐసీసీ.
{{/usCountry}}బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ ను ఐపీఎల్ ఆడకుండా తొలగించింది. దీంతో భద్రతా కారణాలు చూపి టీ20 ప్రపంచకప్ లో తమ మ్యాచ్ లను ఇండియాలో ఆడలేమని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఐసీసీ మాత్రం ఇండియాలో ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ వినకపోవడంతో టీ20 ప్రపంచకప్ లో ఆ టీమ్ పై వేటు వేసి, స్కాట్లాండ్ కు ఛాన్స్ ఇచ్చింది ఐసీసీ.
{{/usCountry}}ఈ విషయంలో బంగ్లాదేశ్ కు సపోర్ట్ గా పాకిస్థాన్ నిలుస్తోంది. అందుకే టీ20 ప్రపంచకప్ నే మొత్తం బాయ్ కాట్ చేయాలనే ఆలోచన కూడా చేసింది. కానీ ఇప్పుడు కేవలం ఇండియా మ్యాచ్ మాత్రమే ఆడమని చెప్పింది.
ఎలాగో ఓడిపోయే మ్యాచ్
టీ20 ప్రపంచకప్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే మామూలు మజా ఉండదు. ఈ రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ ఇటీవల టీమిండియా డామినెన్స్ కారణంగా ఆ కిక్కు ఉండటం లేదు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో పాకిస్థాన్ ఆడకపోయినా పోయేదం లేదని, ఎలాగో ఓడిపోయే మ్యాచ్ కాబట్టి బాయ్ కాట్ అంటూ తప్పించుకుందని ఇండియన్ ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.