కర్ణాటకలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని ప్రముఖ బహుభాషా నటుడు, సామాజిక వేత్త ప్రకాష్ రాజ్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన, ఈ పరిణామాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
"బెంగళూరులో పుట్టి పెరిగిన నాకే ఓటు లేదా?"

తన ఓటు హక్కును తొలగించడంపై ప్రకాష్ రాజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "బెంగళూరు నియోజకవర్గంలోనే నేను పుట్టి పెరిగాను. ఇక్కడే పాఠశాల, కళాశాల విద్యను అభ్యసించాను. థియేటర్ ఆర్టిస్ట్గా నా ప్రస్థానాన్ని ప్రారంభించాను. 2019 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను. అలాంటిది SIR ప్రక్రియ తర్వాత ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో నేను ఒకడినయ్యాను. ఇదో పెద్ద జోక్ లాగా ఉంది" అని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ఓటును తిరిగి పొందడానికి ఇకపై ఏ ఏ కాగితాలు చూపించాలో అర్థం కావడం లేదని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
"మా అధికారాన్ని ఆపలేరు.. గేమ్ ఆన్!"
ఓటు హక్కు పునరుద్ధరణ కోసం పాటించాల్సిన ప్రక్రియ ఏంటో తాను తెలుసుకుంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. "ఇప్పటి నుంచే అసలైన ఆట మొదలైంది (Game On). నా ఓటర్ ఐడీని తిరిగి తెచ్చుకోవడానికి ఏ ప్రక్రియ దాటాలో చూస్తాను" అని ఆయన సవాల్ విసిరారు.
పాలకవర్గాన్ని ప్రశ్నిస్తూ, "మీకు ఓటు వేయరనే అనుమానంతో కొందరు పౌరుల ఓటు హక్కును కాలరాసేందుకు మీ అధికారాలను ఉపయోగించుకోవచ్చు. అయితే, అధికార పీఠం నుంచి మిమ్మల్ని కిందకు దించే ప్రజల శక్తిని మీరు ఆపగలరా?" అని ప్రకాష్ రాజ్ నిలదీశారు.
జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై స్పందన
ఇదే సమయంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీ వైపు ప్రదర్శనగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఘటనపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దౌర్జన్యం చేయడం సరైంది కాదన్నారు.
{{/usCountry}}ఇదే సమయంలో జార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీ వైపు ప్రదర్శనగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ఘటనపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దౌర్జన్యం చేయడం సరైంది కాదన్నారు.
{{/usCountry}}"ఈ దౌర్జన్యం ఇక సాగదు. ఇది అహంకారపూరితమైన అధికారాన్ని కూల్చివేసేందుకు మాత్రమే దోహదపడుతుంది" అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
కర్ణాటక SIR టైమ్లైన్ సవరణ
కర్ణాటక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కొన్ని మార్పులు చేసింది. భారత ఎన్నికల సంఘం ఆగస్టు 7న పంపిన లేఖ ప్రకారం కర్ణాటక డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణను ఆగస్టు 24కు వాయిదా వేశారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 27న విడుదల చేయనున్నారు. ఈ ఓటర్ల జాబితా సవరణకు అర్హత తేదీగా 2026 అక్టోబర్ 1ని ఖరారు చేశారు.