మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగడ్ కోటలో గత వారం జరిగిన ట్రెక్కర్ మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది. గాలివాన వల్ల ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని భావించిన కేతన్ విశాల్ అగర్వాల్ (26) మృతి.. ముమ్మాటికీ హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. అతడు ప్రాణంగా ప్రేమించిన, ఈ ఏడాది నవంబర్లో పెళ్లి చేసుకోవాల్సిన కాబోయే భార్య, ఆమె స్నేహితుడేనని వెల్లడైంది.

పూణే నగర సమీపంలోని గహుంజేకు చెందిన కేతన్ అగర్వాల్ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది. కేతన్ ఆ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. కాబోయే భార్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి జూన్ 19, శుక్రవారం నాడు ఇద్దరు స్నేహితులతో కలిసి వారు లోహగడ్ కోటకు వెళ్లారు.
ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం
ఆ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో కోట పైభాగంలో ఈదురు గాలులు వీస్తుండగా, ఫోటోలు తీసుకునే క్రమంలో కేతన్ అడుగు తప్పి దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి పడిపోయాడని అంతా భావించారు. సమాచారం అందుకున్న లోనావాలా రూరల్ పోలీసులు, శివదుర్గ్ మిత్ర ఎమర్జెన్సీ రెస్క్యూ టీం రంగంలోకి దిగాయి. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి లోయలో నుంచి కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు.
"ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపాం" అని లోనావాలా రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ దినేష్ తాయ్డే ఆ సమయంలో మీడియాకు తెలిపారు.
విచారణలో తేలిన నగ్నసత్యం
పోస్ట్మార్టం నివేదిక, అనుమానాస్పద కదలికల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు మంగళవారం షాకింగ్ నిజాలు తెలిశాయి. కేతన్ ప్రమాదవశాత్తూ పడిపోలేదని, అతడి కాబోయే భార్య, ఆమె స్నేహితుడు కలిసి కావాలనే లోతైన లోయలోకి నెట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, హత్యకు గల కారణాలను మాత్రం పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఢిల్లీలోనూ ఇలాంటి ఘోరమే..
ఇలా మరణాన్ని వేరే రకంగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకున్న ఘటన ఈ నెల ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ వెలుగుచూసింది. కాళిందీ కుంజ్ ప్రాంతంలో 21 ఏళ్ల యువకుడు తన 18 ఏళ్ల భార్యను గొంతు నులిమి, దిండుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో గురువారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్య చేసిన తర్వాత దాదాపు 12 గంటల పాటు శవం పక్కనే పడుకున్నాడు.
{{/usCountry}}ఇలా మరణాన్ని వేరే రకంగా చిత్రీకరించి తప్పించుకోవాలనుకున్న ఘటన ఈ నెల ప్రారంభంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ వెలుగుచూసింది. కాళిందీ కుంజ్ ప్రాంతంలో 21 ఏళ్ల యువకుడు తన 18 ఏళ్ల భార్యను గొంతు నులిమి, దిండుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో గురువారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. హత్య చేసిన తర్వాత దాదాపు 12 గంటల పాటు శవం పక్కనే పడుకున్నాడు.
{{/usCountry}}ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో నిద్రలేచి, భార్య ఆత్మహత్య చేసుకుందంటూ గట్టిగా అరుస్తూ ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, అదే ప్రాంతంలో ఉంటున్న మృతురాలి సోదరి దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్ట్మార్టం నివేదికలో అది ఆత్మహత్య కాదు, గొంతు పిసికి ఊపిరాడకుండా చేయడం వల్లే జరిగిందని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.