...
...
Next Story

కాబోయే భర్తను లోయలోకి నెట్టేసిన యువతి.. ఆపై ప్రమాదంగా చిత్రించి..

లోహగడ్ కోటలో సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయాడనుకున్న పూణే యువకుడి మరణం వెనుక ఘోరమైన కుట్ర బయటపడింది. పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన కాబోయే భార్య, ఆమె స్నేహితుడే అతడిని నెట్టేసినట్లు పోలీసులు తేల్చారు.

Published on: Jun 23, 2026 03:32 PM IST
Advertisement

మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగడ్ కోటలో గత వారం జరిగిన ట్రెక్కర్ మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది. గాలివాన వల్ల ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని భావించిన కేతన్ విశాల్ అగర్వాల్ (26) మృతి.. ముమ్మాటికీ హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ దారుణానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. అతడు ప్రాణంగా ప్రేమించిన, ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకోవాల్సిన కాబోయే భార్య, ఆమె స్నేహితుడేనని వెల్లడైంది.

హత్యకు గురైన కేతన్
హత్యకు గురైన కేతన్

పూణే నగర సమీపంలోని గహుంజేకు చెందిన కేతన్ అగర్వాల్ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంది. కేతన్ ఆ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాబోయే భార్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి జూన్ 19, శుక్రవారం నాడు ఇద్దరు స్నేహితులతో కలిసి వారు లోహగడ్ కోటకు వెళ్లారు.

ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం

ఆ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో కోట పైభాగంలో ఈదురు గాలులు వీస్తుండగా, ఫోటోలు తీసుకునే క్రమంలో కేతన్ అడుగు తప్పి దాదాపు 400 అడుగుల లోతైన లోయలోకి పడిపోయాడని అంతా భావించారు. సమాచారం అందుకున్న లోనావాలా రూరల్ పోలీసులు, శివదుర్గ్ మిత్ర ఎమర్జెన్సీ రెస్క్యూ టీం రంగంలోకి దిగాయి. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి లోయలో నుంచి కేతన్ మృతదేహాన్ని వెలికితీశారు.

"ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపాం" అని లోనావాలా రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయ్డే ఆ సమయంలో మీడియాకు తెలిపారు.

విచారణలో తేలిన నగ్నసత్యం

పోస్ట్‌మార్టం నివేదిక, అనుమానాస్పద కదలికల ఆధారంగా విచారణ జరిపిన పోలీసులకు మంగళవారం షాకింగ్ నిజాలు తెలిశాయి. కేతన్ ప్రమాదవశాత్తూ పడిపోలేదని, అతడి కాబోయే భార్య, ఆమె స్నేహితుడు కలిసి కావాలనే లోతైన లోయలోకి నెట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, హత్యకు గల కారణాలను మాత్రం పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఢిల్లీలోనూ ఇలాంటి ఘోరమే..

ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో నిద్రలేచి, భార్య ఆత్మహత్య చేసుకుందంటూ గట్టిగా అరుస్తూ ఇరుగుపొరుగును నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, అదే ప్రాంతంలో ఉంటున్న మృతురాలి సోదరి దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్ట్‌మార్టం నివేదికలో అది ఆత్మహత్య కాదు, గొంతు పిసికి ఊపిరాడకుండా చేయడం వల్లే జరిగిందని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe