డిజిటల్ ఇండియా సేల్ షురూ.. ఐఫోన్, స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు!

రిలయన్స్ డిజిటల్ ప్రతిష్టాత్మక 'డిజిటల్ ఇండియా సేల్' ప్రారంభమైంది. జనవరి 26 వరకు అందుబాటులో ఉండే ఈ సేల్‌లో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ అప్లయెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Jan 23, 2026, 10:45:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టెక్ ప్రియులకు పండగ వచ్చేసింది! దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ 'రిలయన్స్ డిజిటల్' తన పాపులర్ 'డిజిటల్ ఇండియా సేల్'ను మళ్లీ తీసుకువచ్చింది. జనవరి 26, 2026 వరకు జరిగే ఈ భారీ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.

రిలయన్స్​ డిజిటల్​ ఇండియా సేల్​ వివరాలు..
రిలయన్స్​ డిజిటల్​ ఇండియా సేల్​ వివరాలు..

డిజిటల్​ ఇండియా సేల్​- ఆఫర్ల సునామీ..

కస్టమర్లు తమకు నచ్చిన గ్యాడ్జెట్లను సొంతం చేసుకునేందుకు రిలయన్స్ డిజిటల్ అదిరిపోయే వెసులుబాటు కల్పిస్తోంది. బ్యాంకు కార్డులపై రూ. 26,000* వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్లపై రూ. 30,000* వరకు క్యాష్‌బ్యాక్, యూపీఐ పేమెంట్స్‌పై అపరిమితంగా 5% డిస్కౌంట్ వంటి ఆఫర్లను అందిస్తోంది.

ఈ సేల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ డిజిటల్, మైజియో స్టోర్లతో పాటు ఆన్‌లైన్‌లోనూ (www.reliancedigital.in) అందుబాటులో ఉంటుంది.

సేల్‌లో ప్రధాన ఆకర్షణలు ఇవే:

ఐఫోన్లపై ముందెన్నడూ లేని ధరలు:

ఐఫోన్​ 15 (128 జీబీ): కేవలం రూ. 49,990* ప్రారంభ ధరకే లభిస్తోంది. నెలకు రూ. 2,888* నుంచి ఈఎంఐ సదుపాయం ఉంది.

ఐఫోన్​ 16 (128 జీబీ): రూ. 57,990* కే సొంతం చేసుకోవచ్చు. దీనికి నెలకు రూ. 3,388* ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.

ఐఫోన్​ 17 సిరీస్: కొత్తగా వచ్చిన ఐఫోన్ 17 (256 GB) రూ. 78,900* కే అందుబాటులో ఉంది. ప్రో మోడల్ రూ. 1,30,900* నుంచి ప్రారంభమవుతోంది.

మ్యాక్​బుక్​ ఎయిర్​ ఎం2: మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (విలువ రూ. 6,899*) ఉచితంగా పొందుతూ, కేవలం రూ. 64,990* కే ల్యాప్‌టాప్‌ను మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

స్మార్ట్ టీవీలు అండ్​ సౌండ్ సిస్టమ్స్:

తోషిబా 65 ఇంచ్​ క్యూఎల్​ఈడీ టీవీని 2 ఏళ్ల వారంటీతో రూ. 44,990* కే విక్రయిస్తున్నారు.

ఏదైనా టీవీ కొనుగోలు చేస్తే, ఎంపిక చేసిన సౌండ్‌బార్లపై రూ. 10,000* వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

ఇక రూ. 899* కే పవర్ బ్యాంక్, ఛార్జర్ లేదా నెక్ బ్యాండ్ వంటి రెండు రీకనెక్ట్ ప్రొడక్టులను ఎంచుకోవచ్చు.

గృహోపకరణాలపై భారీ తగ్గింపు:

ఫ్రిజ్‌లు రూ. 7,999* నుంచి, డబుల్ డోర్ ఫ్రిజ్‌లు రూ. 19,990* నుంచి ప్రారంభమవుతున్నాయి. కొన్ని రకాల ఫ్రిజ్‌ల కొనుగోలుపై ఐరన్ బాక్స్ (రూ. 9), బోట్ సౌండ్ బార్ (రూ. 49), లేదా ఎయిర్ ఫ్రైయర్ (రూ. 99) వంటి ఆఫర్లు ఉన్నాయి.

1.5 టన్ 3-స్టార్ ఏసీ రూ. 32,990* కే లభిస్తోంది. కొన్ని 5-స్టార్ ఏసీల కొనుగోలుపై మినీ బార్ ఉచితంగా ఇస్తున్నారు.

కిచెన్ అప్లయెన్సెస్ కొనుగోలుపై 50% వరకు డిస్కౌంట్‌తో పాటు రూ. 7,990* విలువైన గిఫ్ట్‌లు గ్యారెంటీగా పొందవచ్చు.

కేవలం అమ్మకాలే కాకుండా, 'రిలయన్స్ రెస్క్యూ' ద్వారా మెరుగైన ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా అందిస్తామని సంస్థ పేర్కొంది.

టెక్నాలజీని సామాన్యులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో ఈ ఆఫర్లను రూపొందించారు. ఇంకెందుకు ఆలస్యం? త్వరపడండి, స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్లు ఉంటాయి!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More